Monday 31 December 2018

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో చాలా మంది టీవీలు చూడడం కంటే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఖాతాలను ఎక్కువగా వాడుతున్నారు. అందుకే ఇప్పుడు వాటికి క్రేజ్ బాగా పెరిగింది. క్రిష్ రూపొందిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ వారు నిర్మాతలకు భారీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

అప్పటివరకు సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ లేనప్పటికీ సినిమా ట్రైలర్ వచ్చి అంచనాలను అమాంతం పెంచేసింది. ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. దర్శకుడిగా క్రిష్ ఈ సినిమాకి నూటికి నూరు శాతం న్యాయం చేసి ఉంటారని అందరూ నమ్ముతున్నారు.

తన తండ్రి గెటప్ లో బాలకృష్ణ కూడా ఇమిడిపోయాడని అంటున్నారు. అందుకే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాకి భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు కలిపి పాతిక కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఆ రేటుకి బాలకృష్ణ సినిమా డిజిటల్ రైట్స్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది.

అమెజాన్ పైమ్ ఆఫర్ :- ఈరోజే ఉచితంగా సబ్‌స్కైబ్ అవ్వండి.. ఒక నెల రోజులు పాటు అన్ని సినిమాలూ చూసేయండి ఉచితంగా.

రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Sponsored: Amazon Prime India

Saturday 29 December 2018

రాజమౌళి తనయుడు పెళ్ళిలో తారక్ రచ్చ

రాజమౌళి తన కొడుకు కార్తికేయ పెళ్లిని జైపూర్ లో జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకి సినీసెలబ్రెటీలు అందరు హాజరయ్యారు. వారిలో  ప్రభాస్, అనుష్క, రామ్ చరణ్, ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక నిన్న రాత్రి జరిగిన పార్టీలో తారక్ స్టేజ్ పై చేసిన రచ్చ మాములుగా లేదు.

దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో సందడి చేస్తుంది. మొదట కీరవాణి స్టేజ్ పై ఉన్న ప్రభాస్ ని ఓ ప్రశ్న అడగడానికి ప్రయత్నిస్తుంటాడు. డార్లింగ్ అని పిలుస్తూ....ఆడవారి వయసు చెప్పకూడదు, మగవాడి సంపాదన అడగకూడదు. అందుకే బాహుబలి సినిమాకు నువ్వు ఎంత పారితోషికం తీసుకున్నావని నేను అడగను అని అనే లోపు తారక్ స్టేజ్ పై మీదకు వచ్చేశాడు.

కీరవాణిని ఏడిపిస్తూ కొన్ని కామెంట్స్ చేస్తుండగా.... దానికి కీరవాణి తారక్ నీది ఎలిఫెంట్ కామెడీ అని అంటుంటే... మాకు తెలుసు అంటూ అక్కడున్న వారిని చూస్తూ ధన్యవాదాలు చెబుతుంటాడు. కీరవాణి తారక్ తారక్ అని ఎంతగా పిలిచినా పట్టించుకోకుండా కామెడీ చేస్తూనే ఉన్నాడు. ఆ వీడియో తారక్ అభిమానులుఆకట్టుకుంటుంది .Video Link

Friday 28 December 2018

వినాయక్ వైజాగ్ థియేటర్ కూల్చివేత

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఈమధ్యన వైజాగ్ లో విమాక్స్ పేరుతో ఓ థియేటర్ కంప్లెక్స్ నిర్మించారు. ఆ కాంప్లెక్స్ వైజాగ్ లో జగదాంబ థియేటర్ల తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అందుకు కారణం వినాయక్ క్రేజ్ .... ఆ థియేటర్స్ లో ఉన్న ఫెయిసిలిటీ. వినాయక్ దర్శకుడుగా వెలుగుతున్న రోజుల్లో రెండు పాత థియేటర్లను కొని అధునాతన వసతులను ఏర్పాటు చేసి విమాక్స్ పేరుతో డెవలప్ చేశాడు.

అతి తక్కువ సమయంలో ఆ థియేటర్లు సిటీలో సెంటరాఫ్ అట్రాక్షన్ కదా, లోకల్ జనాలకు మేజర్ స్పాట్ గా మారాయి. అయితే ఇప్పుడు ఆయా థియేటర్లు కూల్చేస్తున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీకి ఆ థియేటర్ కాంప్లెక్స్ ను అమ్మేశాడట వినాయక్. ఆ సంస్థ అక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. అంటే ఆ థియేట‌ర్స్  త్వ‌ర‌లోనే కూల్చేస్తారని తెలుస్తోంది‌.

ఇక  వి.వి.వినాయ‌క్‌ ఈ కాంప్లెక్స్ అమ్మేయటాని కారణం ...మంచి రేట్ ప‌ల‌క‌డమే అని తెలుస్తోంది. అంతేతప్ప చాలా మంది భావిస్తున్నట్లు ఆర్దిక సమస్యలు ఏమీ లేవని, ఆయన వెల్ ఆఫ్ గా ఉన్నారని సమాచారం. ఇక వరస ఫ్లాఫ్ లతో ఉన్న వినాయిక్ ..సాయి ధరమ్ తేజ తో చేసిన మిస్టర్ ఇంటిలిజెంట్ సినిమా తర్వాత మరొక సినిమా కమిటవ్వలేదు. మంచి కథతో మళ్లీ స్టార్ హీరోతో ఆయన హిట్ కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు

Thursday 27 December 2018

13 ఏళ్లలో తొలిసారి బికినిలో దర్శనమిచ్చింది

సినిమా రంగంలో ఏ టైములో చేయాల్సిన గ్లామర్ షో అప్పుడే చేయాలి. ఈ సత్యాన్ని హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఆలస్యంగా తెలుసుకుంది. జూనియర్ ఐశ్వర్యారాయ్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు చేసి విజయాలను అందుకుంది. కానీ, ఎందుకో ఎక్కువకాలంనిలదొక్కుకోలేదు . ఆమధ్య బాలాకిష్ణ సింహ సినిమాలో కనిపించి మెప్పించింది.

ఇప్పుడు హాట్ షోకి తెరలు తీసింది. మొదటి బికినీ ఫోటో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది స్నేహ ఉల్లాల్. ఫిట్నెస్ పరంగా బాగున్నా....ఇప్పటికే ఆలస్యం అయిపొయింది కాబట్టి, మిగిలినవారికి ఉన్న ఫాలోయిన్ తనకు లేదు. అయితేనేమి స్నేహ ఉల్లాల్ ఇప్పటి నుంచి ఇది కొనసాగిస్తున్నానని చెబుతుంది.  స్నేహ ఎంట్రీ ఇచ్చింది 2005లో. ఇప్పటికి 13 ఏళ్ళు గడిచింది.

సల్మాన్ ఖాన్ లక్కీతో పరిచయమైన స్నేహకు జూనియర్ ఐశ్వర్య రాయ్ అనే పేరు వచ్చింది కానీ ఆ రేంజ్ లో అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేకుండా ఖాళీగా ఉన్న స్నేహ ఉల్లాల్ వాటికి గేలం వేయడం కోసం ఇలా మొదలుపెట్టింది. ఎక్కాల్సిన ట్రైన్ జీవిత కాలం లేట్ తరహాలో కెరీర్ మొదలుపెట్టిన 13 ఏళ్లకు ఫస్ట్ బికినీ వేస్తే వర్క్ అవుట్ అవుతుందంటారా.

Wednesday 26 December 2018

సుడిగాలి సుధీర్ ని పెళ్లి చేసుకోవడంపై స్పందించిన రష్మీ

జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్.. ప్రదీప్ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని వస్తే ఎవరిని  చేసుకుంటారనే ప్రశ్న యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఎదురైంది. ఇందుకు ఆమె ఏం చెప్పిందంటే.. తన వర్క్ వేరు, వ్యక్తిగతం వేరని చెప్పింది. రెండూ వేరు వేరుగా వుంటాయి. ఇందులో వుండే వ్యక్తులు అందులోకి రారు. అందులో వుండే వ్యక్తులు ఇందులోకి రారని స్పష్టం చేసింది. అలాగే మీ పెళ్లి లవ్వా, అరేంజ్డ్ మ్యారేజా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు......

సహజీవనం అనే ఆప్షన్ వుందిగా అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. కాగా బుల్లితెర యాంకర్‌గా మంచి క్రేజ్ కొట్టేసిన రష్మీ.. సినిమాల్లో కనిపిస్తూ... కుర్రకారు హృదయాలను దోచేస్తోంది. తాజాగా ట్విట్టర్ లైవ్ ఛాట్‌లో ప్రదీప్‌తో పెళ్లి గురించి స్పందించింది. తనకు పెళ్లి గురించి అడిగే ప్రశ్నలు నచ్చవని రష్మీ చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందే తాను ఓ బిడ్డను దత్తత తీసుకుంటానని రష్మీ చెప్పుకొచ్చింది

Tuesday 25 December 2018

అందరు ఎన్టీఆర్ నే టార్గెట్ చేశారు

బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో  కాఫీ విత్ కరణ్ జోహార్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో కి తాజాగా బాహుబలి టీమ్ రాజమౌళి, రానా, ప్రభాస్ గెస్ట్ లుగా వెళ్లారు. అందులో భాగంగా హోస్ట్ కారం జోహార్ రాజమౌళిని ఈ షోకి రానా, ప్రభాస్ ల తో కాకుండా వేరే ఎవరితో రావాలని ఉంది అని అడగ్గా తారక్, రవితేజ అని సమాధానం చెప్పాడు.

ప్రభాస్ ని వీరిలో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు? అని ఆప్షన్ ఇవ్వగా తారక్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ అని ఈ వరుస క్రమంలో చెప్పుకొచ్చారు. రానాని లాంగ్ డ్రైవ్ కి ఎవరితో వెళ్ళడానికి ఇష్టపడుతావ్ అని అడిగితె.... ఎన్టీఆర్ అని బదులు ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు. సరదాగా సాగిన ఈ షోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

Saturday 15 December 2018

అక్కడ తెలుగుదేశం ఓటమి, ఇక్కడ 2019లో వైకాపా ఓటమికి దారితీయనుందా?

అక్కడ తెలుగుదేశం ఓటమి, ఇక్కడ 2019లో వైకాపా ఓటమికి దారితీయనుందా?

నిత్యం ఐవిఆరెఎస్ కాల్స్, పాలన బావుందా? మీ అభిప్రాయాలు కావాలని. లోకల్ గా ఎన్ని ఇబ్బందులు వున్నా, చంద్రబాబు నాయుడి గొంతుతో అడిగేసరికి, అయ్యో కష్టపడే ఆయన కదా అని, అంతా బావుందని 1 నొక్కేస్తున్నారు.

ఆయన ఏమో, దానిని ముందేసుకొని, ఇంటెలిజెన్స్, పార్టీ వర్గాల సమాచారం మరియు బయటి వ్యక్తుల సర్వేలు, పార్టీ వర్గాలతో సమీక్షలు చేస్తుంటారు.

ఎన్ని గెలుస్తామో చెబుతూ, మీరు పని చేయట్లేదు, అవసరం అయితే మారుస్తా అని చెబుతూ వుంటారు.

నిత్యం ఎమ్మెల్యేలను ఏదో ఒక కార్యక్రమం పెట్టి, స్థానికంగా తిరిగేలా చేస్తున్నారు.

కానీ ఎంతటి క్రీడాకారుడు అయినా, నిత్యం కొంత ప్రాక్టీస్ చేస్తుంటాడు.

అలా తెలంగాణాలో కాంగ్రెస్స్ తో వెళ్లి, కుళ్లబొడిపించుకొని వచ్చింది. ఇంకా ఇక్కడ ఆరు నెలలు వుంది. ఆ దెబ్బలకు కారణాలు, అక్కడి వ్యూహాలు అన్నీ ఒక అనుభవం అవుతుంది.

ముఖ్యంగా, ఇక్కడ ఎలా ఒళ్లు దగ్గర పెట్టుకొని జాగ్రత్త పడాలో, బాగా గుణపాఠం నేర్చుకొంది.

నిన్నటి నైరాశ్యంలో నుండి అంతర్మధనం మొదలయ్యి, లోతైన విశ్లేషణ దిశగా, లోతు పాతుల అంతర్ముఖ పయనం జరుగుతోంది. పార్టీలో ప్రతి వ్యక్తి ఏమి చెబుతున్నాడో వింటోంది. ఇవన్నీ క్రోడీకరించి ఆలోచనలు కొలిక్కి వచ్చి, తన వ్యూహాత్మక అడుగులు, దాని నుండి ఆశించవచ్చు.

తెలంగాణాలో ఏదో బాబుగారి పాలన మీద తీర్పు ఇచ్చినట్టు, బాబు గారు అక్కడ సిఎం అవుతానంటే, తెలంగాణా అంతటా తిరస్కరించినట్టు, వైకాపా సంబరపడుతోంది, ఊదరగొడుతోంది.

12 స్థానాల్లో 2 స్థానాల్లో దళితులను గెలిపించుకొని, అక్కడి నుండి కాంగ్రెస్ తో ప్రత్యేక హోదా మీద ప్రకటన చేయించడం మరిచిపోతోంది.

నిజమే, పవన్, జెడి, బిజెపి, జగన్, లెఫ్ట్ మరియు కేసీఆర్ అంతా అంటీ ముట్టనట్టు, విడివిడిగా, మూకుమ్మడి దాడితో, కులం & మతం తో పాటు, అవినీతి ధనంతో, పెద్ద ఎత్తున వస్తారనే విషయం, ప్రతి నాయకుడి నుండి కార్యకర్త వరకు చెప్పి, తెలుగుదేశం తగువిధంగా సిద్ధం చేస్తుంది.

ఎవడు చెప్పినా తనో పెద్ద తోపని, పెడచెవిన పెట్టే జగన్ సహజ గుణం, నంద్యాల & కాకినాడల ఓటమి తరువాత ఏమీ నేర్చుకొన్నట్టు, కనిపించడం లేదు.

అదే జరిగి వుంటే కోడికత్తిని ఒక జాతీయ స్థాయి సమస్యగా ఇంకా చిత్రీకరించడానికి నానా పాట్లు పడుతూ, తుఫాన్ లాంటి విషయాల మీద నిర్లక్ష్యం వహించేది కాదు.

నాలుగు రోజులు ముందు, కేంద్ర కరువు బృందం, రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు తో సమీక్ష చేస్తుంటే, కనీసం తన వైకాపా బృందంతో, ప్రతిపక్ష పార్టీగా వినతి పత్రం ఇవ్వాలని విషయం కూడా మరిచిపోయి, కరపత్రం ద్వారా కరువని కన్నీరు కార్చి, సీఎం ఎంతడిగాడో వార్త వేశారు.

ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.

అక్కడ తెలుగుదేశం ఇంకొన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచివుంటే మళ్లీ కేసీఆర్ కొనుగోళ్లతో మరింత కుమిలేది. దానితో పాటు ఒరిగేది ఏమీ లేకున్నా, ఇక్కడ కన్నూమిన్నూ గానకుండా వచ్చే ఎన్నికలకు వెళ్లేవారు.

ఇప్పుడు భూమి మీద నిలబడేలా ఆలోచనలు & ఉపాయాలు చేసి వెళుతుంది.

దానికి దేశంలో 4 దశాబ్దాలకు పైగా, అత్యంత అనుభవం వున్న నాయకుడు వున్నాడు.

..చాకిరేవు.(సౌజన్యం తో )

సోనాక్షి సిన్హాకు షాక్ ఇచ్చిన అమెజాన్

ఇటీవల కాలంలో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే భయపడుతున్నారు. అలాగే ఈ కామర్స్ సైట్స్ గతంలో ఒక వస్తువును ఆర్డర్ ఇస్తే దానికి బదులుగా వేరే వస్తువు పంపిన ఘటనలు ఎదురయ్యాయి. ఇన్నాళ్ళు సామాన్య ప్రజలకు మాత్రమే ఇటువంటి సంఘటనలు ఎదురయ్యాయి.
Sonakshi Sinha receives iron piece instead of headphones, Twitterati lauds Amazon’s impartiality

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు ప్రముఖ షాపింగ్ సైట్ అమెజాన్ షాక్ ఇచ్చింది. హెడ్ ఫోన్స్ బదులుగా ఇనుప బోల్డ్ లు పంపింది. దాంతో సోనాక్షి ముంబై అమెజాన్ ప్రతినిధి తో మాట్లాడేందుకు ప్రయత్నించగా... వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మీడియాని ఆశ్రయించి బండారాన్ని బట్టబయలు చేసింది. ఈ మేరకు అమెజాన్ ను తప్పుబడుతూ సోనాక్షి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

హెడ్ ఫోన్స్ కోసం అమెజాన్ లో 18 వేలు చెల్లిస్తే అందులో ఇనుప బోల్ట్ ఉందని చెప్పింది. ప్యాకింగ్ అంతా బాగానే ఉన్నప్పటికీ హెడ్ ఫోన్స్ కు బదులుగా ఇనుప బోల్ట్ పంపారని సోనాక్షి ఫైర్ అయ్యింది ఈ ట్విట్ కు అమెజాన్ కంపెనీని ట్యాగ్ చేసింది. దాంతో అమెజాన్ స్పందించి. ఈ ఘటనకు విచారిస్తున్నామని చెబుతూ.... తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Thursday 13 December 2018

దిశాపటాని అందాల విందు

లోఫర్ బ్యూటీ దిశా పాటని బాలీవుడ్ లో వెలుగులు విరజిమ్ముతుంది.పరిశ్రమలో బెస్ట్ మోడల్ గా క్రేజీ ప్రకటనల్లో నటిస్తూనే, పెద్ద తెరపై ఒక్కో అవకాశాన్ని అందుకుంటుంది. ఇటీవలే ప్రియుడు బాఘీ వ సంచలన విజయం సాధించింది.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో భరత్ అనే సినిమాలో నటిస్తుంది.

ఈమె సినీ కెరీర్ ఒకెత్తుఅనుకుంటే , దిశా ప్రస్తుతం  బ్రాండ్ ప్రమోషన్స్ లోను బిజీ గా ఉన్నది. ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ లోదుస్తుల‌తో పాటు, ర‌క‌ర‌కాల బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేస్తున్న ఈ భామ నాలుగుచేతులా ఆర్జిస్తోంది. ఆ క్ర‌మంలోనే వేడెక్కించే ఫోటోషూట్ల‌తో నిరంత‌రం సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది.

తాజాగా దిశా రివీల్ చేసిన ఈ కొత్త ఫోటో వైరల్ అవుతుంది. మత్తెక్కించే బిగి అందాల్ని, నాభి అందాల్ని ప్రదర్శిస్తూ ట్రెడిషనల్ డ్రెస్ లోను వేడి పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇంతందంగా తీరైన రూపాన్ని మెయింటెయిన్ చేయ‌డం కోసం దిశా ప‌డే శ్ర‌మ అంతా ఇంతా కాదు. నిరంత‌రం ఫిటెనెస్ సెంట‌ర్ల‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ ఈ లెవ‌ల్‌ని అందుకుంది.

Monday 10 December 2018

మెగా బ్రదర్ పై బాలయ్య ఫాన్స్ ఫైర్

మెగా బ్రదర్, నిర్మాత నాగబాబు ఓ ఇంటర్వ్యూ లో బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.  బాలయ్య ఎవరో తెలియదంటూ నాగబాబు చేసిన కామెంట్స్ పై ఫాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో నాగబాబుపై ఫన్నీ సెటైర్స్ వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు కావాలనే రేచ్ఛతోట్టె విధంగా బాలయ్య పై వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు.

ఇంతకీ ఆ ఇంటర్వ్యూ లో నాగబాబు ఏమన్నారంటే.... బాలయ్య ఎవరో నాకు తెలియదు, ఐ యామ్ వెరీ సారీ.... ఏయ్... బాలయ్య గురించి తెలియదు అన్నానేంటి? బాలయ్య గారు చాలా పెద్ద ఆర్టిస్టు. సీనియర్ మోస్ట్....నేరము శిక్షలో కృష్ణ గారు, ఆయన కలసి నటించారు అని సీనియర్ నటుడు బాలయ్య గురించి చెప్పాడు. సీనియర్ నటుడు బాలయ్య కాదు నందమూరి బాలకృష్ణ అని యాంకర్ అడగ్గానే నేనెప్పుడూ బాలకృష్ణ పేరు వినలేదని మండిపడ్డాడు.

ప్రజాకూటమిలోకి మజ్లిస్! అసదుద్దీన్ స్పందన...

తెలంగాణలోఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ రాజకీయాల్లో అనూహ్యా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో భాగంగా ‘మా సొంతబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అన్న తెరాస ప్రకటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ… దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూస్తామనితెలిపారు.  శనివారం  భాజపా నేత లక్ష్మణ్‌మాట్లాడుతూ మజ్లిస్‌, కాంగ్రెసేతరపార్టీతో తాము కలుస్తామని పరోక్షంగా తెరాసకు సానుకూల సంకేతాలు పంపిన విషయంతెలిసిందే.

ప్రజాకూటమిలోకి రావాలన్న కాంగ్రెస్‌ ఆహ్వానంపై ఆలోచించి నిర్ణయంతీసుకుంటామన్నారు. తెలంగాణలో గెలుపై రాజకీయ పార్టీలు ఆధారాలు లేకుండా అంచనావేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో  ఎంఐఎం  కనీసం 7 స్థానాలు గెలవనున్నట్లు  వస్తున్న సర్వేలపై రాజకీయ పార్టీల చూపు ఎంఐఎం పై ఉండటంతో ఫలితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Saturday 8 December 2018

కూటమిదే విజయం, ప్రగతి భవన్ వీడేందుకు ముహూర్తం చూసుకోండి

తెలంగాణలో ప్రజాకూటమి విజయంపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్‌ ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో ప్రజాకూటమి 65 నుంచి 80 స్థానాలతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

శనివారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన జాతీయ మీడియా దక్షిణ భారతదేశ నాడిని సరిగ్గా పట్టుకోలేకపోయిందని విమర్శించారు. తెలంగాణలో తామే అధికారంలోకి వస్తున్నట్లు జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రగతిభవన్ వదిలేసేందుకు ముహూర్తం చూసుకోవాలని సూచించారు.

తమ నేతలు రేవంత్ ఇంటిపై, మధుయాష్కీ, వంశీ చంద్‌రెడ్డిపై అసహనంతో దాడులు చేశారని కుమార్ ఆరోపించారు. ఈ నెల 11న లెక్కింపు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

నియంత పాలనను గద్దె దించాలని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారని తమ సర్వేలో వెల్లడైందన్నారు. నిరుద్యోగ భృతి, తాము చేపట్టబోయే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని భావిస్తున్నట్లు కుసుమ కుమార్ తెలిపారు. 

Friday 7 December 2018

ఒక సారిగా కేసీఆర్ కాళ్ళ కింద భూమిని కంపింపచేసిన లగడపాటి

ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణాలో పోలింగ్ పూర్తి అయ్యింది. 72% కు తక్కువ కాకుండా పోలింగ్ నమోదు అయినట్టు సమాచారం. పోలింగ్ పూర్తవ్వగానే వరుసగా జాతీయ మీడియా ఛానళ్ళు తమ సర్వే రిపోర్టులు ప్రకటించడం మొదలు పెట్టాయి. ప్రతి సర్వేలోనూ తెరాసకు మెజారిటీ ఇచ్చి, మహాకూటమికి ఓటమి తప్పదు అని సంకేతాలు ఇచ్చాయి. ఈ క్రమంలో ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మీడియా ముందుకు వచ్చి తెలంగాణ ఎన్నికలు రసకందాయంలో పడేశారు. ఆయన మహాకూటమికి స్పష్టమైన మెజారిటీ ప్రకటించారు.

మహాకూటమిలోని అన్ని పార్టీలను కలిపి 65 (+/-10 సీట్లు) రావొచ్చని చెప్పారు. ఇదే క్రమంలో అధికార తెరాస పార్టీకి 35 (+/-10 సీట్లు) మాత్రమే వస్తాయని చెప్పుకొచ్చారు. అదే విధంగా బీజేపీకి 7 (+/-2 సీట్లు), ఎంఐఎంకి 6-7 సీట్లు, ఇండిపెండెంట్లకు 7 (+/-2 Seats), మరియు బీఎల్ఎఫ్ కు ఒక సీటు రావొచ్చని చెప్పుకొచ్చారు. మహాకూటమిలో టీడీపీకి 5-7 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు ఆయన. దీనితో మహాకూటమి క్యాంపులో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.


అదే సమయంలో తెరాస క్యాంపులో ఒక్క సారిగా అయోమయంకు గురయ్యారు. ఎన్నికలకు ముందు లగడపాటి చెప్పిన సర్వే కావాలని చంద్రబాబుకు అనుకూలంగా మార్చి చెప్పారని వారు అనుకుని సరిపెట్టుకున్నా, ఇప్పుడు ఎన్నికల తరువాత అబద్ధం చెప్పి ఆయన విశ్వసనీయత పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అని అలోచించి ఆందోళనకు గురవుతున్నారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఒక్క సారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ నెల 11న ఫలితాలు అధికారికంగా విడుదల కాబోతున్నాయి. ఈ సస్పెన్స్ అప్పటిదాకా కొనసాగుతుంది. మరో పక్క తెరాస గెలుపుపైనే ఎక్కువగా పందాలు జరగడంతో ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో ప్రభావం చూపించబోతున్నాయి. మహాకూటమి గెలిస్తే గనుక దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఉండే అవసరం ఏర్పడుతుంది. అదే విధంగా జాతీయ రాజకీయాలలో చంద్రబాబు ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. ఆరు నెలలో ఎన్నికలకు వెళ్లబోయే ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ అనుకూల పవనాలు వీయడం ఖాయం.

వాళ్ళకి ఇక నిద్రలు లేనట్టే!

ఒక పక్క సర్వేలు అన్నీ తెరాసాకె మళ్లీ అధికారం అంటూ చెబుతూ ఉంటే, మరో పక్క ‘ఆంధ్రా ఆక్టపుస్’ లగడపాటి మాత్రం కూటమికే గెలుపు అవకాశం ఎక్కువగా ఉంది అని తేల్చి చెప్పేశారు. దాదాపుగా కూటమి పార్టీలు అన్నీ కలసి 65 కి అటూ ఇటూగా వస్తాయి అని లగడపాటి చెప్పేశారు. అంతే కాదు దాదాపుగా జిల్లాల్లో 80 శాతం కూటమికే ఫేవర్ గా ఉన్నట్లుగా కూడా ఆయన స్పష్టం చేసేసారు. ఇదిలా ఉంటే మరో పక్క ఎలా చూసుకున్న లగడపాటి లెక్క ప్రకారం తెరాసాకు తెలంగాణాన ప్రజలు చరమగీతం పాడనున్నారు అని అర్ధం అవుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు.

అయితే మరో పక్క అందరిదీ ఒక గోల అయితే, కొందరిది ఇంకో గోల అన్నట్లు…ఏ పార్టీ గెలుస్తుందా అన్న మాట పక్కన పెడితే, నార్త్ ఇండియా సర్వేలు అన్నీ తెరాసాకి ఫేవర్ గా ఎగ్సిట్ పోల్స్ ఇవ్వగానే ఆనందంలో మునిగిపోయిన కొన్ని వర్గాలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన కొన్ని సామాజిక వర్గాలు, ఒక బడా హీరో అభిమానులు, ఆయా అభిమానుల వెనుక ఉన్న ఒక కోస్తా సామాజిక వర్గం పాపం లగడపాటి సర్వేని చూడగానే షాక్ కి గురయ్యారు. మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ద పెట్టి మరీ కేసీఆర్ ని గెలిపించాలి అని తెరాసాకు మద్దతుగా నిలిచిన వాళ్ళు కేసీఆర్ అండ్ పార్టీ మళ్లీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని భారీ ఆశలే పెట్టుకుని, భారీగానే బెట్టింగ్స్ కూడా కాసినట్లు తెలుస్తుంది.

అయితే ఈరోజు లగడపాటి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కూటమికి ఆధిక్యం స్పష్టం అవనున్న తరుణంలో ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటో, అసలు రేపు 11న ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ సరిగ్గా నిద్ర పోతారో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఇక మరో పక్క లగడపాటి జోస్యం నిజం అయ్యీ, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే త్వరలో అంటే వచ్చే నాలుగు నుంచి అయిదు నెలల్లో జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. అదే జరిగితే మాత్రం ఈసారి సీఎం సీట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్ మరియు పవన్ ఇద్దరూ ప్రతిపక్షానికి పరిమితం కాక తప్పదు.

Thursday 6 December 2018

నెటిజన్స్ మెచ్చిన ఫోటో ఇదే

ఈ ఏడాది ప్రముఖ సామజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా నెటిజన్స్ ఏ విషయాలను ఎక్కువగా మాట్లాడారు, వేటిని ఎక్కువగా మెచ్చరు అనే జాబితాని ట్విట్టర్ ఇండియా 2018 తాజాగా విడుదల చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అయన సతీమణి బాలీవుడ్ నటి అనుష్క శర్మ కార్వా చౌత్ వేడుకలు చేసుకున్న ఫోటో నెటిజన్స్ అత్యంత ఇష్టమైందిగా నిలిచింది.

అక్టోబర్ నెలలో విరుష్క దంపతులు కార్వాచౌత్ వేడుకలను జరుపుకొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి వెన్నెల వెలుగులో ఉన్న ఫొటోను విరుష్క జంట సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఈ ఏడాది అత్యధిక మంది నెటిజన్లు మెచ్చిన ఫొటోగా ఇది నిలిచింది. ఈ ఫొటోకు దాదాపు 2,15,000 లైక్స్‌ వచ్చాయి. ఈ ఏడాది మొత్తం మీద భారత్‌లో ఎక్కువగా ట్రెండ్‌ అయిన 10 హ్యాష్‌ట్యాగ్‌లలో ఏడు దక్షిణ చిత్రపరిశ్రమకు చెందినవే కావడం గమనార్హం.

Wednesday 5 December 2018

అగ్గి రేపుతున్న ప్రగ్య

అందంతో కవ్వించడం, యూత్ గుండెల్లో తిష్ట వేయడం అందాల ప్రగ్య జైస్వాల్ కి కొత్తేమి కాదు. కంచె సినిమాలో సంప్రదాయబద్ధంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత తనలోని గ్లామర్ యాంగిల్ అందరికి పరిచయం చేసింది ఈ అందాల భామ. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన ఆకాశం కోసం చాలా ప్రయత్నిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సిరా నరసింహరెడ్డి లో అవకాశం అందుకుంది. అలాగే ఈ భామ బాలీవుడ్లో హీరోయిన్ గా నటించే ప్రయత్నాల్లో ఉందని తెలుస్తుంది. ఆ ఆలోచనతోనే ఇటీవల రూటు మార్చిన ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల్లో వేడెక్కించే ఫోటో షూట్స్ తో చెలరేగిపోయింది.

మొన్నటి మొన్న తన దేహాన్ని టైట్ గా హత్తుకొనిపోయే జిమ్ డ్రెస్ లో ప్రగ్య దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది. ఈ అమ్మడు అగ్గి రాజేసిందంటే అతిశయోక్తి కాదు. తాజాగా మరో వేడెక్కించే ఫొటోతో సెగలు రేపుతోంది. ప్రగ్యను ఇలా చేశాక అయినా మన దర్శకనిర్మాతలు, స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వకుండా ఉంటారా??

దర్శకుడు శంకర్ సంచలన నిర్ణయం

గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమా ఎంత భారీ స్ధాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. తాజా చిత్రం 2.0 దాదాపు 550 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందించారు. రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్‌తో 2.0 దూసుకెళుతోంది. ఈ సినిమా త‌ర్వాత శంక‌ర్ భార‌తీయుడు 2 తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ న‌టించే ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే... శంక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. బారతీయుడు 2 సినిమాలో గ్రాఫిక్స్‌ని నమ్ముకోవట్లేదట‌. గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయాల‌నుకుంటున్నాడ‌ట‌. భారతీయుడులో లాగే ఇందులో సమాజంలో పేరుకుపోయిన అవినీతి మీద కథ నడుస్తుందట‌. కాకపోతే భారతీయుడు ఈ కాలంలో ఉన్న టెక్నాలజీ ఎలా వాడుకుంటాడు, పోలీసులకు ఇంకెంత సవాల్ విసురుతాడు అన్న అంశాలు అదనంగా ఉండబోతున్నాయంట. మ‌రి.. ఈ సినిమాతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Sunday 2 December 2018

కేసీఆర్ కు అండగా సాక్షి.. లోగుట్టు పెరుమాళ్లకెరుక..!

లగడపాటి సర్వే అంటూ బయటకు రావడంతో ఉన్నఫళంగా తెలంగాణాలోని అధికార పార్టీలో గుబులు మొదలయ్యింది. ఇప్పటికే గెలిచే ఇద్దరి రెబెల్స్ పేర్లు చెప్పడం వారిద్దరూ కాంగ్రెస్ రెబెల్స్ కావడం అధికార పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. సహజంగా ఓటర్లలో కొంత మందికి ఏ పార్టీతోను సంబంధం ఉండదు వారు మాత్రం ఎప్పుడూ గెలిచే పార్టీకి ఓటు వెయ్యాలని అనుకుంటారు. మీడియా అనుకూలంగా ఉండటంతో వీరందరూ తెరాస తన ఓటర్లని భావిస్తుంది. అయితే లగడపాటి సర్వే మీద మన వారికి బాగా గురి ఉండటంతో వారి ఓట్లు తరలి పోతాయేమోనని తెరాస భయం.

దీనితో కేసీఆర్ ఇప్పటికే ఈ సర్వే మీద ఒంటి కాలి మీద లేచారు, అదే విధంగా పార్టీ ఎన్నికల కమిషన్ కు కంప్లయింట్ చేసింది. ఈ క్రమంలో తెరాసకు అనుకూలంగా సాక్షి తన వంతు ప్రయత్నం తాను చేసింది. లగడపాటి సర్వే బోగస్ అంటూ ఈరోజు మొదటి పేజీలో బ్యానర్ ఐటెం వేసింది. ర్వే చేస్తే అంచనాలు తెలుస్తాయని, కానీ ఆ అంచనాలే నిజం కావాలని లేదని సన్నాయి నొక్కులు నొక్కింది. సాక్షి అనగానే చంద్రబాబు టచ్ లేకుండా ఉండదు కాబట్టి. ఇదంతా లగడపాటి ద్వారా మహాకూటమి కోసం కేసీఆర్ చేసిన కుట్ర అని చెప్పుకొచ్చింది. తిరుపతి వెళ్లడానికి ముందే తెలంగాణలో ప్రచారానికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుతో లగడపాటి సమావేశమయ్యారని, ఈ భేటీలో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలతో పాటు ఎల్లో మీడియా తోక పత్రిక అధినేత (ఆంధ్రజ్యోతి ఆర్కే) కూడా పాల్గొన్నారని సాక్షి ప్రచురించింది. ఈ సందర్భంగా కూటమికి, టీఆర్‌ఎస్‌కు మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి, ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్లాన్‌ వేసినట్టు స్పష్టమయిందని సాక్షి తేల్చేసింది.

తెలంగాణాలో పోటీ నుండి తప్పుకున్న వైకాపా ఇప్పటికే తన సంపూర్ణ మద్దతు తెరాసకు ఇచ్చిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వైకాపా మీటింగులు, రెడ్డి కుల మీటింగ్లు పెట్టిస్తుంది ఆ పార్టీ. ఇప్పుడు ఏకంగా కష్టకాలంలో కేసీఆర్ ను ఆదుకోవడానికి సాక్షినే రంగంలోకి దిగింది. గతంలో వైకాపాకు అనుకూలంగా ఉన్న సర్వేలను ఎత్తుతూ మొదటి పేజీలో ప్రచురించేది సాక్షి. వైకాపాకు వ్యతిరేకంగా వచ్చే సర్వేలను పక్కన పెట్టడం, వాటి భరతం పట్టింది అంటే అర్ధం చేసుకోగలిగేదే. కాకపోతే తెరాసకు వ్యతిరేకంగా సర్వే వచ్చిన తట్టుకోలేకపోతుంది ఏంటో సాక్షి. బహుశా మహాకూటమి తెలంగాణాలో గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తిరుగు లేకుండా పోతుంది అనే భయం కూడా కావొచ్చు.

Thursday 29 November 2018

కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ పిక్ చూశారా?

కాజల్ అగర్వాల్.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది ఈ భామ. తన కెరీర్ ముగిసింది అని అనుకుంటున్న తరుణంలో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. మళ్లీ అగ్రహీరోల సరసన చాన్సులు దక్కించుకుంటోంది. మూడు పదుల వయసు దాటినా.. తనలోని అందాన్ని మాత్రం ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటూ సూపర్ ఫిట్ నెస్ ను మెయిన్ టేన్ చేస్తోంది కాజల్. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, తేజ కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తోంది కాజల్.

ఇక అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా కాజల్ తన స్టన్నింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విటమిన్ సీ అంటూ హ్యాష్ టాగ్ ను జత చేసింది కాజల్. ఇక.. తన స్టన్నింగ్ ఫోటోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేయకుండా ఉండలేకపోతున్నారు. నిజంగానే నీ పిక్ స్టన్నింగ్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tuesday 27 November 2018

అమ్మా ఇలియానా.. నీకంత సీనుందా..?

ఒకప్పుడు టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న ఇలియానా ఇక్కడ ఆఫర్లు వదులుకుని బాలీవుడ్ వెళ్లాక ఆమె మీద ఉన్న క్రేజ్ తగ్గిపోయింది. పొకిరి టైంలో ఇలియానా తన సోయగాలతో తెలుగు ప్రేక్షకులను వల్లో వేసుకుంది. అయితే చాన్నాళ్ల తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇల్లి బేబి నటించినా ఇదవరకు అంత చార్మింగ్ అనిపించలేదు. అందుకుతోడు కాస్త లావెక్కడంతో అసలేమాత్రం బాగాలేదు.

సినిమాలో ఇలియానా ఉంటే కాస్త కూస్తో గ్లామర్ షో ఉండాల్సిందే.. కాని అమ్మడు అమర్ అక్బర్ ఆంటోనిలో అది కూడా చేయలేదు. అందుకే సినిమా వచ్చింది వెళ్లింది అన్నట్టుగా ఉంది. ఇక ఈ అమ్మడికి తెలుగులో ఛాన్సులు వస్తున్నా రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసి వదులుకుంటుందట. లేటెస్ట్ గా రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఇలియానాని అడిగారట.

ఈమధ్య కాస్త ఫాం తగ్గింది అనుకునే టైంలో హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ తో డబుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలానే వి.వి.ఆర్ కోసం ఇలియానాని అడిగితే అమ్మడు 60 లక్షల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. 5 నిమిషాల పాటకు ఆమెకు అంత అవసరం లేదని మేకర్స్ వెనక్కి తగ్గారట. తెలుగులో అవకాశాలు రావట్లేదని అంటున్న ఇలియానా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఇలా కాలదన్నుకుంటుంది. చరణ్ లాంటి స్టార్ హీరో ఛాన్స్ అన్న గోవా భామకు ఇక తెలుగు సినిమా అవకాశాలు కష్టమే అని చెప్పొచ్చు.

Monday 26 November 2018

జనవరి 1 తర్వాత మీ పాత డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవు.. ఎందుకంటే?

డిసెంబర్ 31, 2018.. ఇదే చివరి తేది. మీ పాత డెబిట్, క్రెడిట్ కార్డులు మార్చుకోవడానికి. లేదంటే జనవరి 1, 2019 నుంచి మీ పాత డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవు. అవును.. సెక్యూరిటీ పర్పస్‌లో పాత మాగ్నెటిక్ స్ట్రిప్ ఉన్న కార్డులను తీసేసి.. కొత్తగా ఈఎంవీ చిప్‌ను కార్డులకు అనుసంధానం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈఎంవీ అంటే యూరోప్లే-మాస్టర్‌కార్డ్-విసా అని అర్థం.
కొత్తగా చిప్‌తో వచ్చే కార్డుల్లో సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఫ్రాడ్ జరిగే చాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఆగస్ట్ 27, 2015నే పాత కార్డులను రీప్లేస్ చేయాలంటూ అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. సెప్టెంబర్ 1, 2015 నుంచి కార్డులను మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పటికీ కార్డులను మార్చుకోని వారు సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి మార్చుకోవచ్చు. లేదంటే.. నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయి.. సర్వీసెస్ సెక్షన్‌లో డెబిట్ కార్డు రిక్వెస్ట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.

Sunday 25 November 2018

లేట్ వయసులో ఘాటు అందాలు

Click to see the images
లేటు వ‌యసులో అగ్గి రాజేసే ముద్దుగుమ్మ‌ల జాబితాలో ఈ అమ్మ‌డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో చాలా మంది క‌థానాయిక‌లు ఈ త‌ర‌హానే అయినా శిల్పా సంథింగ్ స్పెష‌ల్. ఇదిగో ఈ లుక్ అందుకు ఎగ్జాంపుల్. సాగ‌ర క‌న్య‌ శిల్పా శెట్టి 45 వ‌య‌సులోనూ కాలేజ్ గాళ్ లుక్‌తో అద‌ర‌గొడుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ్ కుంద్రాను పెళ్లాడి ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మ‌ద‌ర్‌గా ఉన్నా.. ఇప్ప‌టికీ టీనేజీ యాటిట్యూడ్ తో ఉందంటూ నెటిజ‌నుల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎక్క‌డ ప‌బ్లిక్ వేడుక‌కు వెళ్లినా, లేదూ ఫంక్ష‌న్ల‌లో క‌నిపించినా శిల్పా అల్ట్రా మోడ్ర‌న్ లుక్‌పైనే సెటైర్లు ప‌డుతూనే ఉంటాయి. ఇటీవ‌లే దీపావ‌ళి పార్టీలో శిల్పా స్పెష‌ల్ లుక్‌తో ఆక‌ట్టుకుంది. అటుపై టూపీస్ బికినీలో శిల్పా ఇచ్చిన ఫోజులు ప్ర‌స్తుతం యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల‌పై లేటు వ‌య‌సు ఘాటు సుంద‌రి అంటూ యూత్ సెటైరిక‌ల్ వ్యాఖ్య‌ల్ని చేస్తున్నారు.
Click to see the images

Saturday 24 November 2018

ఆంటీగా మారుతున్న కాజల్

కాజల్ అగర్వాల్ ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. శంకర్ తదుపరి సినిమాలో ఆమె నటిస్తుంది. దర్శకుడు శంకర్ తన తదుపరి సింఎంగా భారతీయుడు 2 సినిమాని తీస్తున్నాడు. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా 20 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి సిక్వెల్.

ఈ సినిమాలో కమల్ వయసుమళ్ళిన సేనాపతి పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకి భార్యగా కాజల్ నటించనుంది. కమల్ హాసన్ భార్య అంటే దాదాపు ఆంటీ పాత్రనే. ఆమె గెటప్ కూడా మిడిల్ ఏజ్డ్ ఆంటీగానే ఉంటుందట. 32 ఏళ్ళు వచ్చినా.... కాజల్ ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తుంది.

అందుకే రానా, శర్వానంద్, బెల్లంకొండ వంటి యువ హీరోల సరసన కూడా నటిస్తుంది. అయితే ఇప్పుడు కమల్ సరసన తన ఏజ్ కంటే చాలా పెద్ద వయసు ఆంటీగా కనిపించాలి. వచ్చే నెలలో కమల్ పై శంకర్ కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నాడు. ఐతే కాజల్ మాత్రం జనవరి నుంచి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Wednesday 21 November 2018

మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా.. అర్జెంట్‌గా ఇది చదవండి..!

మీరు ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమరా? మీకు ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు నవంబర్ 30 వ తేదీలోగా మీ ఖాతాకు మొబైల్ నెంబర్‌ను లింక్ చేసుకోవాలి. లేదంటే మీరు మీ అకౌంట్‌కు సంబంధించి ఆన్‌లైన్ లావాదేవీలను చేసుకోలేరు. వాటిని బ్యాంక్ నిలిపివేయనుంది. ఈ విషయాన్ని బ్యాంకే స్పష్టం చేసింది. ఈ ప్రకటనను తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అంటే మీరు మీ మొబైల్ నెంబర్‌ను అకౌంట్‌కు ఈనెల 30 లోగా అనుసంధానం చేసుకోకపోతే డిసెంబర్ 1, 2018 నుంచి ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకోలేరు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. ఇప్పటి వరకు మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోని వాళ్లు సంబంధిత బ్యాంక్ శాఖలో కానీ.. లేదా ఏటీఏంలో గానీ లింక్ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది

Monday 19 November 2018

కోలీవుడ్ లో అవకాశం కొట్టేసిన కమెడియన్

టాలీవుడ్ లో కమెడియన్ గా సునీల్ మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆ తరువాత సునీల్ హీరో గా సినిమాలకు దగ్గరవ్వడం తో సునీల్ ప్లేస్ ని వెన్నెల కిషోర్ ని సొంతం చేసుకున్నారు . మెల్లి మెల్లిగా వెన్నెల కిషోర్ స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు . పెద్ద హీరో స్ తో తో వెన్నెల కిషోర్ నటిస్తూ ఇండస్ట్రీ లో మంచి పేరును సంపాదించుకున్నారు . తాజా సమాచారం ప్రకారం ఈ కమెడియన్ ఇప్పుడు కోలీవుడ్ లో మంచి ప్రాజెక్ట్ లో నటించేందుకు అవకాశాన్ని దక్కించుకున్నారు . శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న 'భారతీయుడు 2 ' సినిమా లో ఒక ముఖ్య పాత్రలో నటించేందుకు వెన్నెల కిషోర్ ఓకే చేసారు.

Monday 12 November 2018

హీరోయిన్ పెళ్లి ఫొటోల రేట్ రూ.18 కోట్లు?

బాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతూ ఉంది. ఇదే సీజన్లో నటి ప్రియాంక చోప్రా కూడా పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన నిక్ జోనస్ తో ఇప్పటికే ప్రియాంకకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తనకన్నా చాలా చిన్నవాడు అయిన నిక్ ను ప్రియాంక పెళ్లి చేసుకోబోతోందనేది తెలిసిన సంగతే. ఈ పెళ్లికి ఇరుపక్షాల పెద్దలూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నిశ్చితార్థం జరిగిపోయింది. ఇక పెళ్లి ఎప్పుడో ప్రకటించాల్సి ఉంది.

అయితే వీరి పెళ్లికి తేదీ ఖరారు అయ్యిందని, డిసెంబర్లో వీళ్ల పెళ్లి అని తాజాగా వార్తలు వస్తున్నాయి. వీరి వివాహ వేడుక భారీఎత్తున జరగనుందని.. ఏకంగా మూడురోజుల పాటు పెళ్లి జరగబోతోందని సమాచారం. ఈ వేడుకకు బాలీవుడ్, హాలీవుడ్ అతిరథులు హజరు కావచ్చని అంటున్నారు.

మరి అంతమంది ప్రముఖులు వస్తే.. ప్రియాంక, నిక్ జోనస్ లు వారి మధ్యన పెళ్లి చేసుకుంటే.. ఆ ఫొటోలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. నెటిజన్లు వాటి కోసం తెగ సెర్చ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థ ప్రియాంక పెళ్లి ఫొటోలపై మొత్తం రైట్స్ ను కొనేసిందని అంటున్నారు.

ఏకంగా 18 కోట్ల రూపాయల మొత్తానికి ప్రియాంక పెళ్లి ఫొటోలు, వీడియోలను అమ్మేసిందని.. బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది.

అందరిముందు కాజల్ ని కిస్ చేసాడు

"కవచం"లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ మరియు మెహ్రెయిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు, హైదరాబాద్ లో  ఈ టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. 

ఈ వేడుక లో చలనచిత్ర సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు వేదికపై తన అసభ్యకర రీతి లో కాజల్ ని హఠాత్తుగా ముద్దు పెట్టుకున్నాడు . 

Sunday 11 November 2018

2 ఓను లీక్ చేస్తామంటున్న తమిళ్ రాక్స్

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తాజా సినిమా 2.ఓ త్వరలో రాబోతుంది. అయితే ఈ సినిమాని లీక్ చేస్తామంటూ పైరసీ వెబ్ సైట్ తమిళ్ రాక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తమిళ్ రాక్స్ లో 2.ఓ త్వరలో రాబోతుందని ప్రకటించింది. దాంతో రజనీకాంత్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇలా చేయడం మంచిది కాదని అంటున్నారు. విజయ్ హీరోగా నటించిన సర్కార్ సినిమాని కూడా తమిళ్ రాక్ లీక్ చేసింది. అంతేకాదు బాలీవుడ్ సినిమా థగ్స్ అఫ్ హిందుస్థాన్ ను కూడా తమిళ్ రాక్స్ లీక్ చేసింది. ఒకవేళ నిజంగానే తమిళ్ రాక్స్ సినిమాని ఆన్లైన్ లో లీక్ చేస్తే తమిళ నిర్మాతలకు చాలా నష్టం జరుగుతుందని అంటున్నారు.

Thursday 8 November 2018

హాట్ టీజర్‌తో మరింత హీటెక్కించారు

వెంకట్, హృశాలి గోసవిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఎ1 ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రాయల్ చిన్నా, నాగరాజు (పంచలింగాల బ్రదర్స్) నిర్మించిన చిత్రం ‘రాయలసీమ లవ్‌స్టోరీ’. రామ్ రణధీర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

దీపావళి కానుకగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఓయ్ లవ్ చేస్తున్నా అని చెప్పా కదా ఏం చేశావ్.. అంటూ మొదలైన ‘రాయలసీమ లవ్ స్టోరీ’ టీజర్ మెల్లగా రొమాంటిక్ మోడ్‌లోకి వెళ్లి పోవడం.. హీరో హీరోయిన్లు బాత్ రూం టబ్‌లో నగ్నంగా కామక్రీడలో తేలిపోతూ ఒకరి పెదాలను ఒకరు పెనవేసుకుని శృంగార రసాన్ని వరదలా పారించారు. అనంతరం ఎమోషన్ టర్న్ తీసుకుని హీరోయిన్ హీరో చెంపపై చెళ్లుమనిపించి నన్ను మరిపో అని బ్రేకప్ చెప్పేసింది. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన హీరో ఎలా మరిచిపోమంటావురా.. అన్నీ అయిపోయినవి చేతితో అసభ్యంగా సైగ చేస్తూ కమెడియన్ వేణు చెంపని పగలగొట్టేశాడు.

ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ.. లెక్చరర్ పాత్రలో ‘ఇదిగో మీ లాంటి ఎదవల వల్లే.. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయి.. నిర్భయ కేసులు ఎక్కువైపోయాయ్’ అంటూ పంచ్‌లు పేల్చుతున్నాడు. ఇటీవల హీరో హీరోయిన్లు నగ్నంగా బాత్ టబ్‌లో పడుకుని ఉన్న మోషన్ పోస్టర్‌తో సినిమాపై హైప్ తీసుకువచ్చిన చిత్ర యూనిట్.. తాజా హాట్ టీజర్‌తో మరింత హీటెక్కించారు.

Monday 29 October 2018

1200 స్క్రీన్స్ లో సర్కార్

ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా సర్కార్. మురగదాస్-విజయ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో సర్కార్ గతంలో వీరి కాబినేషన్ లో తుపాకీ, కత్తి సినిమాలు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ పై భారీ అంచనాలు నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
దాదాపు ఈ సినిమాని 1200 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో ఓపెనింగ్స్ అదిరిపోయేలా వస్తాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. కోలీవుడ్ లో సర్కార్ 83 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డిజిటల్ రైట్స్, తెలుగు రైట్స్, ఇతర రైట్స్ తో కలిపితే సర్కార్ విడుదలకి ముందే వంద కోట్లు రాబట్టిందని చెప్పొచ్చు.

మరోవైపు, ఈ సినిమాపై వివాదం చెలరేగింది. ఈ సినిమా కథ నాదే అంటూ రచయిత వరుణ్‌ రాజేంద్రన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మురుగదాస్‌.. అందులో ఏమాత్రం నిజం లేదు. వరుణ్ కథకు, నా కథకు ఉన్న పోలిక ఒక్కటే. ఇద్దరి కథలు ఓట్లను ఎలా దుర్వినియోగం చేశారు ? అన్న నేపథ్యంలో ఉంటాయి. నా కథలో వివిధ అంశాలని లోతుగా ప్రస్తావించామని తెలిపారు

Sunday 28 October 2018

[Prime Members] Groceries Rs. 1 – Amazon

• Prime Exclusive Deal.
Discount will automatically get applied at checkout.
• The delivery charge Rs. 30 per box for Prime customers. However, if your Pantry order value is above Rs. 599, the delivery is FREE.

Buy: Groceries

Good Buys:
Pantene Oil Replacement 80ml Rs. 1
Colgate Maxfresh Spicy Fresh Red Gel Toothpaste 22gm Rs. 1
Bauli Moonfils Veg Choco 47gm Rs. 1
Cavins Milkshake Chocolate 180ml Rs. 1
Kohinoor Amritsari Tandoori Chicken Masala 15gm Rs. 1

[[OFFER]] Philips 1.8 L Rice Cooker @1801

Philips HD3017/08 1.8 L Rice Cooker @1801

Apply SHA20

https://paytmmall.com/philips-hd3017-08-1-8-l-rice-cooker-CMPLXPHILIPS_HD301708_NULL_NULL_272-pdp

3219 flipkart
3199 amazon

Wednesday 24 October 2018

అమెజాన్ - ఫ్లిప్ కార్ట్ ఆఫర్ - మాస్టర్ లింక్

అమెజాన్ ఆఫర్ - మాస్టర్ లింక్ : https://bit.ly/2JhUKnS

ఫ్లిప్ కార్ట్  ఆఫర్ - మాస్టర్ లింక్ : https://bit.ly/2JgvvlF

Must Buy: Large Appliances : https://bit.ly/2Pg1pnX

Monday 22 October 2018

ఫ్లిప్-కార్ట్ FlipKart Auspicious Furniture Store సేల్


Furniture & Mattresses upto 70% off.

Debit & Credit Cards – 5% off upto Rs. 750 on Purchase of Rs. 3000+: Only on products sold by OmniTechRetail. An instant discount will be awarded at the time of making the payment. Payment Options > Credit / Debit / ATM Card > Enter Card Details.

మరోసారి త్రిష అకౌంట్ హ్యాక్ అయ్యింది


హీరోయిన్ త్రిష ట్విట్టర్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్స్ తన ట్విట్టర్ ఎకౌంటు హ్యాక్ చేసినట్లు తెలుసుకున్న ఆమె పాస్ వర్డ్ మార్చుకున్నది. ఈ విషయాన్నీ త్రిష ట్విట్ చేసింది. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తున్నారని, తన పేరుతో పోస్ట్ అయిన మెసేజ్ లను పట్టించుకోవద్దు అని, ఫ్యాన్స్ ఎవరూ రిప్లై ఇవ్వొద్దని ఆమె కోరింది. గతంలో త్రిష అకౌంట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. త్రిష ప్రస్తుతం రజనీకాంత్ సరసన పెటా సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె కొన్ని రోజులుగా వారణాసిలో ఉంటుంది.
Trisha Account Hacked
Trisha Account Hacked

Friday 12 October 2018

గూగుల్ ని ఊపేస్తున్న అరవింద డైలాగ్స్

తెలుగులో మాటల మాంత్రికుడు మరోసారి తన పెన్ పవర్ చూపించాడు. తన సినిమాల్లో కేవలం మాటలతోనే మ్యాజిక్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే త్రివిక్రమ్ మరోసారి అరవింద సమేత వీర రాఘవ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించాడు. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఎన్టీఆర్ నోట నుంచి వస్తుంటే థియేటర్ మొత్తం హోరెత్తిపోతుంది.

Today's Best Offer:
Up to 50% off on Furo Sports shoes


ఈ సినిమాలో ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా పలికిన సంభాషణలు ఆలోచించేలా ఉన్నాయి. దాంతో మరోసారి త్రివిక్రమ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
=> వినే టైము.. చెప్పే మ‌నిషి వ‌ల్ల‌.. విష‌యం విలువే మారిపోతుంది.వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు.. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు.
=> జీవితంలో ఎప్పుడైనా సాగిపోవాలి.. ఎక్క‌డా ఆగిపోక‌డ‌దు.
=> నన్ను న‌మ్మిన‌వాళ్ళ‌కు అప్పుడూ ఇప్పుడు ఎప్పుడు తోడుగా ఉంటూనే ఉంటాను.
=>  ఆలోచించే వాడికంటే.. ఆలోచింపచేసే వాడే గొప్పోడు.
=> చావు చొక్కా లేకుండా తిరగాడుతున్నట్లుంది
=> నేను ఊరికే అడిగానండి.. నేను ఊరికే చెప్పనండి.
=> నీ పేరు విలువ నీకేం తెలుసురా.. మీ అమ్మానాన్న గుర్తుంటే తెలుస్తుంది.
=>  గంటల్లో సంపాదించే వాడికి ఎప్పుడూ నెల జీతం తీసుకునేవాడు తోడుగా ఉన్నప్పుడే ఆ సంస్థ బలంగా ఉంటుంది.
=>  సుఖం అన్నం రూపంలో వస్తే ఎవడూ తీసుకోడు, కాని అదే అన్నం బిర్యాని రూపంలో వస్తే ఎవడైనా తీసుకుంటాడు.
=> ఆనందం ఎప్పుడైనా అరుదుగానే దొరుకుతుందండి.. అందుకే మనం ఎప్పుడూ దుఖిస్తూ సుఖిస్తూ జీవిస్తూ ఉండాలి.
=>  సార్ వందడుగుల్లో నీరు పడుతుందంటే.. 99 అడుగులు వరకు తవ్వి ఆపేసేవాడ్ని ఏమంటారు.. మీ విజ్ణతకే వదిలేస్తున్నాను.. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సార్.. తవ్వి చూడండి.
=> 30 ఏండ్ల నాడు మీ తాత కత్తిపట్టినాడంటే.. అది అవసరం, అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే.. అది వారసత్వం, అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం, చివ‌రికి ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపమైతుందా.

=> ఇవండీ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ చిత్రంలో మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ పేల్చిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్.. ఇప్పుడీ డైలాగ్స్ సోష‌ల్ మీడియాలో తెగ ట్రాల్ అవుతున్నాయి.

Monday 8 October 2018

అంతసేపు ఎన్టీఆర్ మౌనమేనా?

ఎన్టీఆర్ అంటేనే డైలాగ్స్, డైలాగ్స్ అంటేనే ఎన్టీఆర్. అయన స్క్రీన్ పై అల గలగలా మాట్లాడుతుంటే అభిమానులు పండుగ చేసుకుంటారు. ఇక అటువంటి హీరోకు ఇప్పుడు త్రివిక్రమ్ లాంటి దర్శకుడు దొరికితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అసలే డైలాగులు రాయడంతో త్రివిక్రమ్ దిట్ట. వాటిని చెప్పడంతో ఎన్టీఆర్ దిట్ట. ఈ ఇద్దరు కలిస్తే రాచ్చరచ్చే. ఇప్పటికే ట్రైలర్ డైలాగ్స్ రచ్చ చేస్తున్నాయి.
ఇక సినిమాలో ఎలా ఉంటాయో అనే అంచనాలు పెరిగిపోయాయి కూడా. ఇప్పుడు అరవింద సమేత లో మరో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తుంది. ఈ సినిమాలో తోలి అరగంట ఎన్టీఆర్ కు మాటలు ఉండవని, మరీ అవసరం అయినప్పుడు మాత్రమే నోరు తెరుస్తాడని చెప్పాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అసలు ఎన్టీఆర్ లాంటి హీరోను తోలి అరగంట మాటల్లెకుండా ఉంచడం అంటే మాములు విషయం కాదు. కానీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్నాడు

Sunday 7 October 2018

సంచలనాత్మక సెలబ్రిటీగా ఇలియానా

ileana as sensational celebrity
ileana as sensational celebrity
సినీనటి ఇలియానాకు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటివరకు ఇండియన్ సైబర్ స్పేస్ జాబితాలో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ మొదటి స్థానంలో ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఇలియనా ఆక్రమించుకుంది. అమెరికన్ క్లోబల్ కంప్యూటర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ కంపెనీ MCA free నిర్వహించిన (అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీ) సర్వే ప్రకారం హ్యాకర్లు నెటిజన్స్ ని మభ్యపెట్టి తప్పుడు వెబ్ సైట్స్ క్లిక్ చేసేందుకు ఇలియానా పేరుని ఎక్కువగా యూజ్ చేశారని ఈ సర్వే లో తేలింది. ఈ జాబితాలో ఇలియానా తర్వాతి స్థానంలో ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనేలు ఉన్నారు.

Friday 5 October 2018

MLA ఎమ్మెల్యే అందాల విందు

ఎలాగైనా పరిశ్రమలో పాతుకుపోవాలని, ఇక్కడే స్టార్ అయిపోవాలని కలలు కంటుంది కేథరిన్. స్వతహాగా రిచ్ అయిన ఈ పాపకు సినిమా అంటే పిచ్చి. అందుకే తన సత్తా నిరూపించుకోవాలని చూస్తుంటుంది. ఇప్పటికే బన్నీ వంటి స్టార్ హీరోలతో నటించింది. కానీ అదృష్టం కలసి రావడం లేదు. స్టార్స్ ఇప్పటికీ ఆమెను పట్టించుకోవడం లేదు.

దాంతో అందాలే పెట్టుబడిగా దూసుకెళ్తుంది. గతేడాది విడుదలైన గౌతమ్ నందాలో గ్లామర్ షో అంతా ఈ భామే తీసుకుంది. ఏకంగా బికినీ కూడా వేసింది. కేథరిన్ బికినీ సీన్ వేడి పుట్టించేలా రూపొందించాడు సంపత్ నంది. ఇంత చేసినా కూడా సినిమా ఫ్లాప్ అవడంతో ఎవరు పట్టించుకోలేదు. ఆ సినిమా విడుదలకు ముందే హైదరాబాద్ లో ఓ ఇల్లు కొనేసింది.
Catherine Tresa Show Off
ఏదో టైం పాస్ కోసం సినిమాలు తప్పా...ఆమెకు ఆస్తులకు కొదవలేదు. ఎప్పటికైనా సోలో హీరోయిన్ రోల్స్ వస్తాయనే ఆశతో ఉన్నది. ఇక ఇప్పుడు హాట్ ఫోటో షూట్ ఒకటి చేసి తను ఇంకా ఇండస్ట్రీలో ఉన్నానని గుర్తు చేసింది. ఆమె కెరీర్ గాడిన పడాలంటే కేథరిన్ ఆప్షన్ అందాల అరబోతనే. మరి చూడాలి ఈ అందాలైన కేథరిన్ ను కాపాడుతుందో లేదో.

Thursday 4 October 2018

ఆ హీరోయిన్ కి ప్రభాస్ ఎవరో తెలియదట

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు నటుడిగానే కాకుండా టీవీ రంగంలో కూడా తన సత్తా చాటుతున్నాడు. బిగ్ బాస్, దస్ కా దమ్ వంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై తన సత్తా చాటుతున్నాడు. తాజాగా సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్ పై రూపొందించిన సినిమా లవ్ యాత్రి.
వరీన్ హుస్సేన్, అయుష్ శర్మ జంటగా నటించిన ఈ సినిమా ఈనెల 5 న విడుదల కానున్నది. ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో, హీరోయిన్ అయుష్ శర్మ , వరీన్ హుస్సేన్ హైదరాబాద్ వచ్చారు. ఈ సినిమా గురించి ఎన్నో విషయాలతో మీడియాతో పంచుకున్నారు. అయితే ఇదే సమయంలో టాలీవుడ్ సినిమాలు చూస్తారా అని హీరోయిన్ వరీన్ హుస్సేన్ ని ఓ విలేకరి అడిగాడు.

అయితే టాలీవుడ్ సినిమాల గురించి పెద్దగా తెలియదు కానీ, బాహుబలి సినిమా చూశానని చెప్పింది. అయితే ప్రభాస్ మీకు బాగా నచ్చాడా....ప్రభాస్ నటన ఎలా ఉంది అన్న ప్రశ్నకు అమ్మడు తెల్లముఖం వేసింది. అసలు విషయం ఏమిటంటే....ప్రభాస్ అంటే ఎవరో వరీన్ హుస్సేన్ కు తెలియదట.

Saturday 29 September 2018

కౌశల్ ని ఇంకా టార్గెట్ చేస్తున్నారు, తేజస్వి మరాదా?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో సంచలనం అని చెప్పొచ్చు. కొన్ని నెలల క్రితం నాని హోస్టింగ్ తో మొదలైన ఈ రెండో సీజన్ ఇప్పుడు ఓ కొలిక్కి రాబోతున్నది. 16 మందితో మొదలైన ఈ సీజన్ మొత్తం 5 మందితో చివరి దశకు చేరుకుంది. బిగ్ బాస్ ఇంట్లో మొదటి నుంచి అందరూ కౌశల్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారనేది కౌశల్ అభిమానుల వాదన.

కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ విషయం నిజమేనేమో అనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు బిగ్ బాస్ మిగిలిన హౌస్ మేట్స్ కి ముందు ఎలిమినేట్ అయినటువంటి సభ్యులని అందరిని పిలిపించి సర్ప్రైజ్ ఇచ్చారు. కానీ ఆ సర్ప్రైజ్ ఒక్కరికి తప్ప అందరికి దక్కింది. తిరిగి వచ్చిన సభ్యులు అందరూ మళ్ళీ కౌశల్ నే టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. వారిలో వారే మళ్ళీ గ్రూపులుగా విడిపోయి కౌశల్ ని ఒంటరి చేశారు. తేజస్వి అయితే మరీను వచ్చి అందరిని పలకరించింది కానీ, ఒక్క కౌశల్ ని మాత్రం పట్టించుకోలేదు.

బాబు గోగినేని పరిస్థితి కూడా ఇంతే వారు ఏ విధంగా ఐతే బయటికి వెళ్లారో అదే విధంగా లోపలికి వచ్చారని,వాళ్ళు ఇక మారరని కౌశల్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.నిన్నటి ఎపిసోడ్ ప్రోమో చూసుకున్నా సరే కౌశల్ ని ఒక్కరు కూడా కనీసం పలకరించిన పాపాన పోలేదు,సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.కానీ కౌశల్ కి తాము ఎప్పుడు వెన్నంటే ఉంటామని కౌశల్ ఆర్మీ అంటున్నారు.

Thursday 27 September 2018

బిగ్ బాస్ నుంచి మరో లీక్

నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 చివరి దశకు చేరుకుంది. ఈ వారమే బిగ్ బాస్ సీజన్ 2 విజేత ఎవరు అనేది తెలిపోనున్నది. విజేతగా ఎవరు నిలుస్తారు అనే దానిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరుగుతుంది. మొదటి నుంచి బిగ్ బాస్ లో జరగబోయే ఎలిమినేషన్స్ ముందుగానే తెలిసిపోతున్నాయి.

ఇప్పుడు అదే జరిగింది. ఈరోజు జరగబోయే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో దీప్తి బయటకు వేల్లబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు నమోదైన ఓట్ల ద్వారా ఈ విషయం చెబుతున్నారు. కౌశల్, గీత, సామ్రాట్, తనిష్ ఈ నలుగురిలో ఫైనల్ వీక్ జరనుంది. వీరిలో ఇద్దరిని శనివారం ఎలిమినేట్ చేయనున్నారు. ఇక ఆఖరి ఎపిసోడ్ ఆదివారం రోజున మిగిలిన ఇద్దరు సభ్యుల్లో ఒకరిని విజేతగా ప్రకటించబోతున్నారు.

Wednesday 26 September 2018

ట్విట్టర్ లో కాజోల్ ఫోన్ నెంబర్

పొరపాటున ట్విట్టర్ లో తన భార్య, నటి కాజోల్ మొబైల్ నెంబర్ ని షేర్ చేశాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. అంతే నిమిషాల వ్యవదిలో ఆ ట్విట్టర్ వైరల్ అయింది. వేలమంది ఈ ట్విట్ ని వాచ్ చేశారు, వందల మంది కాజోల్ కు మెసేజ్ చేయడం మొదలుపెట్టారు. పొరపాటుని గమనించిన అజయ్ దేవగన్ ఫ్రాంక్ అని వివరణ ఇచ్చినా వినని అభిమానులు వాట్సాప్ లో మెసేజ్ లపై మెసేజ్ లు చేస్తున్నారు.

దాంతో ఏమి చేయాలో పాలుపోని అజయ్ దేవగన్ తలపట్టుకొని కూర్చున్నాడట. అజయ్ దేవగన్ ఏమని ట్విట్ చేశాడంటే....కాజోల్ ప్రస్తుతం ఇండియాలో లేదు....ఆమెను వాట్స్ యాప్ నెంబర్ సంప్రదించి సమన్వయం చేసుకోండి అని ఎవరికో పెట్టాల్సిన మెసేజ్ అందరికి కనిపించేలా ట్విట్టర్ లో పెట్టాడు.
Kajol Whatsapp Number Leaked in Twitter
Kajol Whatsapp Number Leaked in Twitter


ఈ ఒక్క ఫోజులో చాలానే సంగతులున్నాయి

బాలీవుడ్ న‌టి స‌న్నీలియోన్ లేటెస్ట్‌గా ఓ పిక్‌ని పోస్ట్ చేసింది. సన్నీ ఈ ఫోటోలో నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా కనిపిస్తోంది. బ్లాక్ కలర్ జీన్స్ బాటమ్ – దానికి కాంబినేషన్ గా కాఫీ రంగు టైట్ ఫిట్ టాప్… పూర్తి ఆపోజిట్ లో ఆరెంజ్ కలర్ చున్నీతో అదిరిపోయే ఫోజిచ్చింది. అయితే ఈ ఒక్క ఫోజులో వేరే చాలానే సంగతులున్నాయి. దీనికి ప్రఖ్యాత కార్ల్ టన్ లండన్ ఇండియా – ఐరా సన్ గ్లాసెస్ – స్ప్లాష్ యాక్సెసరీస్ – స్ప్లాష్ టాప్ ఇన్ని రకాల బ్రాండ్లు సన్నీ ఒంటిపై ఉన్నాయి. వీటికి తోడు ఎలానూ స్టార్ స్టక్ సౌందర్య ఉత్పత్తులనే తన మేకప్కి ఉపయోగిస్తోంది. హితేంద్ర కపోపర ఈ స్టైల్ ని డిజైన్ చేశారు. కపిల్ కిల్ నాని ఈ ఫోటో రూపకర్త.

Monday 24 September 2018

అర్థరాత్రి వచ్చి మసాజ్ చేస్తానన్నాడు

గతంలో టాలీవుడ్ పై పలు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన ఈ హీరోయిన్, తాజాగా తనకు ఎదురైన మరో చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ఓ బాలీవుడ్ సినిమా సెట్స్ లో ఓ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది రాధిక ఆప్టే. అర్థరాత్రి రూమ్ కు వచ్చి మసాజ్ చేస్తానని ఆఫర్ చేశాడని చెప్పుకొచ్చింది.
Radhika Apte
"రీసెంట్ గా నాకు ఎదురైన ఓ అనుభవం గురించి చెబుతాను. నిజానికి ఆ టైమ్ లో నాకు బాగా నడుము నొప్పి ఉంది. కానీ అలానే షూటింగ్ లో పాల్గొన్నాను. షూటింగ్ తర్వాత నేను లిఫ్ట్ లో నా రూమ్ కు వెళ్తున్నాను. అదే లిఫ్ట్ లో మరో నటుడు ఉన్నాడు. మా సినిమాలో అతడు కూడా నటిస్తున్నాడు. లిఫ్ట్ లో నాతో అతడు అసభ్యంగా మాట్లాడాడు. అర్థరాత్రి అవసరం అయితే ఫోన్ చేయమన్నాడు. వచ్చి నా నడుముకు మసాజ్ చేస్తానని నాతో చెప్పాడు."

అతడు అలా చెప్పడంతో తను షాక్ అయ్యానని, మర్నాడు పొద్దున్నే ఈ విషయంపై యూనిట్ కు ఫిర్యాదు చేశానని తెలిపింది రాధికా ఆప్టే. అయితే మసాజ్ చేస్తానంటూ ఆఫర్ ఇచ్చిన నటుడిపై సానుభూతి కూడా తెలిపింది రాధిక.

"రాత్రికి వచ్చి మసాజ్ చేస్తానని ఆఫర్ చేసిన ఆ నటుడికి నిజానికి అది తప్పనే విషయం తెలీదు. అతడు పెరిగిన వాతావరణం అలాంటిది. యూనిట్ మందలించడంతో వెంటనే నా దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు."

ఇలా రీసెంట్ గా తనకు ఎదురైన ఓ అనుభవాన్ని బయటపెట్టింది రాధికా ఆప్టే. లైంగిక వేధింపులకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాధిక ఆప్టే, మహిళలపై వేధింపులు ఏ రూపంలో జరిగినా అది తప్పేనని, వీటిని ఎప్పటికప్పుడు ఖండించాలని పిలుపునిచ్చింది.

సమంత దెయ్యం అంటున్న చైతు

అదేంటి సమంతను చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా.... అలా అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే.... పరిశ్రమలో ఏ ఇద్దరినీ కదిపినా కూడా అక్కినేని వారి పోరు గురించే మాట్లాడుకుంటున్నారు. భార్య భర్తలు ఇద్దరూ వచ్చి సెప్టెంబర్ 13న తమ సినిమాలతో పోటీ పడుతున్నారు.

శైలజ రెడ్డి అల్లుడు వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 13న వస్తుంది. అయితే తన సినిమాను విడుదల చేయాలనే కంగారులో భార్య సమంతనే మరిచిపోయాడు నాగచైతన్య.

అయితే ఆ తర్వాత మెల్లగా సమంతకు వెళ్లి తన సినిమా విషయం చెప్పాడు చైతన్య. అప్పుడు నిజంగానే యుటర్న్ సినిమాలో దెయ్యంలాగే పేస్ పెట్టిందని.... తొలిసారి లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తే నువ్వొచ్చి నా సినిమాపైనే పెడతావా అంటూ అరిచేసిందని చెప్పాడు చైతు.

అయితే ఇద్దరు డిఫరెంట్ సినిమాలు చేశారు.... రెండు విభిన్నమైన కాన్సెప్ట్ లు... పైగా వినాయకచవితి సెలవులు ఉన్నాయి కాబట్టి సమస్య లేదని డిస్ట్రిబ్యూటర్లు తమకు ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నాడు చైతు.

పడి పడి లేచే మనసు

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరో గా నటిస్తున్న సినిమా 'పడి పడి లేచే మనసు ' . ఈ సినిమా లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది .ఈ చిత్ర యూనిట్ ఇటీవల నేపాల్ లో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు. తాజాగా వీరు హైదరాబాద్ చేసుకొని ఇక్కడ షూటింగ్ ని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం వీరు రొమాంటిక్ సీన్స్ షూటింగ్ లో బిజీ గా వున్నారు. ఈ సినిమా లో శర్వానంద్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా ని చిత్ర యూనిట్ డిసెంబర్ 21 న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు .

Tuesday 18 September 2018

తారక్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న అరవింద సమేత సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటె ఎన్టీఆర్ సినిమా అంటే డైలాగ్స్, ఫైట్స్, తో పాటుగా తారక్ డాన్స్ లు ఆశిస్తారు. అయితే ఈసారి ఆ విషయంలో నిరాశ చెందక తప్పాడు. సినిమాలో ఫారిన్ షెడ్యుల్ లో ఏర్పరిచిన ఓ పాటని మొత్తానికి క్యాన్సిల్ చేశారట.
కాబట్టి సినిమా మొత్తం మీద కేవలం 4 పాటలు మాత్రమే ఉంటాయని అంటున్నారు. అందులో ఒకటి బ్యాక్ గ్రౌండ్ థీం సాంగ్ అట. అంటే సినిమాలో ఉండేవి మూడు పాటలే అంట. అందులో ఒకటి మాత్రమే హీరో సోలో సాంగ్. ఆ ఒక్క పాటలోనే ఎన్టీఆర్ డాన్స్ చేస్తాడు. మొత్తానికి సాంగ్ కాన్సిల్ చేసి నిర్మాత వ్యయాన్ని తగ్గించినా సినిమా ఫలితం పై ఏమత్రం ప్రభావం చూపుతుందో చూడాలి

Sunday 16 September 2018

బిగ్ బాస్ 2 లో గీతకు నాని క్లాస్

బిగ్ బాస్ 2 సీజన్ ఇప్పటివరకు 95 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మరి కొన్ని రోజుల్లో ఈ షో పుర్తికానున్నది. ఈవారం నామినేషన్స్ లో అమిత్, రోల్, కౌశల్, దీప్తి, గీతామాధురిలు ఉండగా తక్కువ ఓట్లు అమిత్, రోల్ రైడాలకు వచ్చాయి. దాంతో వీరిద్దరిలో ఒకరు బయటకు వెళ్ళే అవకాశం ఉందని అనుకుంటే ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

బిగ్ బాస్ తన ప్లాన్ ప్రకారం దీప్తిని బయటకు పంపించబోతుందని టాక్. నిజానికి ఈవారం నామినేషన్స్ లో దీప్తికి ఓట్లు బాగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఆమెని బయటకి పంపితే మరోసారి ప్రజల ఓట్లకు విలువ లేదనే విమర్శలు వచ్చే అవకాశం ఉన్నది. మరి బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడో చూడాలి.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో హోస్ట్ నాని.. కంటెస్టెంట్ గీతాకి క్లాస్ పీకినట్లు సమాచారం. కౌశల్ పట్ల ఆమె వ్యవహరించిన తీరు పట్ల నానిని ఆమెని ప్రశ్నించి తప్పులు ఎత్తి చూపడంతో గీతా ఎమోషనల్ అయినట్లు చెబుతున్నారు. కౌశల్ ని కూడా టాస్క్ లలో సంచలకుడిగా సొంత రూల్స్ పెట్టుకోవడమేంటని ప్రశ్నించబోతున్నారట

Friday 14 September 2018

జాన్వి డ్రెస్సులపై ఫ్యాన్స్ ట్రోల్

మన సంప్రదాయాలను చేధించుకొని మన ఇష్టం వచ్చినట్లు ఉంటాం అంటే అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. సెలబ్రిటీలు అందుకు మినహాయింపు కాదు. వాళ్లైన అభిమానుల మాట ప్రకారం నడుచుకోవాల్సిందే. స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వి పరిస్థితి కూడా ఇదే.
Janhvi Kapoor
Janhvi Kapoor
ఈమధ్య చాలా పొట్టి దుస్తుల్లో బయట కనిపిస్తున్న జాన్వి పై సోషల్ మీడియాతో పాటు ఆన్ లైన్లో పెద్ద ఎత్తున ట్రాలింగ్ జరుగుతుంది. ఇలా సభ్యత లేకుండా మరి అంత కురచ దుస్తులు వేసుకోవడం అవసరమా అంటూ క్లాసులు పీకుతున్నారు.

తాజాగా థైస్ పైదాకా వచ్చిన చిన్న మిడ్డితో పైన రెడ్ స్కర్ట్ తో జాన్వి వేసిన ఔట్ ఫిట్ విమర్శలకు అవకాశం ఇస్తుంది. శ్రీదేవి మరీ ఇంత కురచ దుస్తులైతే ఎప్పుడు వేయలేదు. గ్లామర్ షో చేసినా పరిమితంగా నెగిటివ్ కామెంట్స్ రాకుండా జాగ్రత్త పడేది.

కానీ జాన్వి అలంటి పరిమితుల మధ్య ఉండడానికి ఇష్టపడటం లేదు. మొదటి సినిమా దఢక్ కమర్షియల్ గా సక్సెస్ అనిపించుకున్నా  తన విషయంలో పూర్తి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు.

అందుకే రెండో సినిమా విషయంలో కరణ్ జోహార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. అయినా పబ్లిక్ లో శ్రీదేవి కూతురిగా గుర్తింపు ఉన్నప్పుడు స్వంతంగా కొంత ఇమేజ్ వచ్చే దాకా జాన్వీ కాస్త జాగ్రత్తగా ఉంటే బెటరేమో. అయినా జాన్వీ మాత్రం వినే  పరిస్థితిలో లేదు.

Thursday 13 September 2018

ఎపి నిరుద్యోగ బృతి పథకం - Apply Online

పధకం : ముఖ్యమంత్రి యువ నేస్తం

దరఖాస్తు నమోదు ప్రారంభ తేదీ : 14-09-2018 Afternoon 

అర్హులు : డిగ్రీ, పాలిటెక్నిక్ చేసిన నిరుద్యోగ యువత 

వయస్సు : 22 నుంచి 35 ఏళ్ల లోపు 

నెలకు ఇచ్చే భృతి : రూ. 1,000 

ఎంత మందికి : 10 – 12 లక్షల మంది ఉంటారని అంచనా

పథకానికి అర్హతలు :
  • అర్హులకు ప్రతి నెలా మొదటి వారంలో బ్యాంకు ఖాతాల్లో భృతి జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
  • ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ నమోదుకు తుది గడువు విధించలేదు.
  • పీఎఫ్ ఉంటే అనర్తులే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తూ ప్రావిడెంట్ ఫండ్ (PF) ప్రతి నెలా చెల్లిసున్న వారంతా నిరుద్యోగ భృతికి అనర్హులు.
  • అర్హులు, అనర్హలా వెంటనే తెలిపే విధానం ఆన్ లైన్లో పేర్లు నమోదు చేసిన వెంటనే నిరుద్యోగ భృతి తీసుకోవడానికి అర్హులా? అనర్హలా? అనేది తెలిసిపోతుంది.
  • 50 వేలకు మించి సబ్సిడీ తీసుకుంటే వర్తించదు వివిధ సంక్షేమ పథకాల కింద ప్రభుత్వం తరపున రూ. 50 వేలకు మించి సబ్సిడీ తీసుకున్న వారంతా నిరుద్యోగ భృతికి అనర్హులు.

Wednesday 12 September 2018

ఆమెని ప్రశాంతంగా ఉండనివ్వండి

గీత గోవిందం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ముద్దుగుమ్మ రష్మిక మండన్న గతంలో కన్నడ నటుడు రక్షిత్ తో చేసుకున్న విషయం తెలిసిందే. గీత గోవిందం సినిమా విజయంతో కోట్ల పారితోషికాలు ఈమెకు వస్తున్న కారణంగా రక్షిత్ తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందని విమర్శలు వచ్చాయి. కన్నడ నటుడు రక్షిత్ అభిమానులు ఈ విషయంలో రష్మిక పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగులో ఆమె నటించిన సినిమా విడుదలై మంచి విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు వస్తున్న కారణంగానే నిశ్చితార్ధం రద్దు చేసుకున్నట్లుగా కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మీడియా వార్తలపై రక్షిత్ స్పందించాడు. రష్మికపై విమర్శలు ఆపండి, ఇద్దరం చర్చించుకొని నిశ్చితార్ధం రద్దు చేసుకున్నామని, ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

గత కొన్నిరోజులుగా తమ మధ్య కొన్ని విభేదాలు జరుగుతున్నాయి. ఆ విభేధాల కారణంగానే తాము కలసి జీవించడం అసాధ్యం అనే నిర్ణయానికి వచ్చాం. అందుకే పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని, అంతే కానీ ఆమెను ఎవరు ట్రోల్ చేయొద్దని రక్షిత్ కోరాడు. తమ ఇద్దరి అభిప్రాయాలూ కలవకపోవడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇద్దరం కలసి తీసుకున్న నిర్ణయంలో ఆమె ఒక్కదాన్ని బలిచేయడం సరైనది కాదని రక్షిత్ సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరాడు

Tuesday 11 September 2018

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నమిత

actress Namitha latest photo
హాట్ బ్యూటీ నమిత వివాహం తరువాత మీడియాలో కనిపించడం బాగా తగ్గించింది. తెలుగు తమిళ చిత్రాల్లో నమిత ఓ వెలుగు వెలిగింది. గత ఏడాదే తన ప్రియుడు వీరేంద్రని వివాహం చేసుకుంది. హీరోయిన్ నటిస్తూనే సింహ వంటి చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసింది. తాజాగా ఓ ఈవెంట్ లో మెరిసిన నమిత పూర్తిగా మారిపోయింది. ఆమె లేటెస్ట్ లుక్ షాక్ ఇచ్చే విధంగా ఉంది.

Monday 10 September 2018

ఇంటర్ నెట్‌ని బ్రేక్ చేస్తున్న ఫోటో!

వైరల్ గా మారిన కామసూత్ర 3డి హీరోయిన్ షెర్లిన్ చోప్రా
కామసూత్ర 3డి హీరోయిన్ షెర్లిన్ చోప్రా మరో మారు ఇంటర్ నెట్ లో అగ్గి రాజేసింది. బోల్డ్ లుక్ కనిపించడం షెర్లిన్ కు వెన్నతో పెట్టిన విద్య. ఘాటు ఫోటో షూట్స్ తో చెలరేగిపోతున్న షెర్లిన్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. క్షణాల్లో ఈ ఫోటో వైరల్ గా మారిపోయింది. ఘాటు ఫోజులకు, కాట్రవర్షియల్ కామెంట్స్ కు షెర్లిన్ చోప్రా కేర్ ఆఫ్ అడ్రస్.
sherlyn chopra
బ్రా లెస్ పిక్
తాజాగా ఓ ఫోటో షూట్ లో మెరిసిన షెర్లిన్ చోప్రా బ్ర లెస్ గా కనిపించింది. కళ్ళు చెదిరే హాట్ లుక్ లో ఉన్నఈ పిక్ ఇంటర్ నెట్ ని దున్నేస్తోంది. నైట్ సూట్ ధరించిన షెర్లిన్ బ్రా లెస్ గా కనిపిస్తూ అందాలు ఆరబోస్తోంది.

Sunday 9 September 2018

పవన్ హీరోయిన్ పోలీసులను ఆశ్రయించింది

పవన్ కళ్యాణ్ తో తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రీతి జంగానియా గుర్తుంది కదా...! వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రీతీ ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటుంది. చాలా కాలంగా బయట కనిపించని ఆమె తాజాగా మీడియా ముందుకు వచ్చింది.
తన ఏడేళ్ళ కొడుకుపై చేయి చేసుకున్న పక్క అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే వ్యక్తిపై ప్రీతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ పెద్దాయన తన కుమారిడిపై చేయి చేసుకోవడంతో పాటు అపార్ట్ మెంట్ బయటకు గెంటేశాడు అంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి, సర్దిచెప్పి పంపారని తెలుస్తుంది.

Friday 7 September 2018

గీతామాధురి పై దారుణమైన కామెంట్స్

బిగ్ బాస్ 2 షో బలమైన కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగుతున్న గీతామాధురిపై కొన్ని రోజులుగా దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. సోషల్ మీడియాలో కొందరు ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. మరో కంటెస్టెంట్ కౌశల్ ను తన పవర్స్ ఉపయోగించి ఈ సీజన్ ముగిసే సరికి ప్రతివారం నామినేట్ అయ్యేలా గీతామాధురి చేసిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. నెగిటివ్ కామెంట్స్, విమర్శలు ఒకే కానీ... బూతులు తిడుతూ కొందరు అసభ్యమైన కామెంట్స్ చేస్తుండడంతో గీతా మాధురి భర్త నందు రంగంలోకి దిగారు. బిగ్ బాస్ అనేది కేవలం గేమ్ షో. అందులో జరిగే పరిణామాలపై అభిప్రాయాలూ వ్యక్తం చేయడంలో తప్పులేదు. కానీ వ్యక్తిగతమైన కామెంట్స్ చేయడం సరికాదు.

ఓ మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం మన సంస్కారం కాదు.... అని గీతా మాధురి భర్త నందు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసి, తర్వాత డిలీట్ చేశారు. అయితే తను పోస్టు చేసిన వీడియో వల్ల నెగెటివిటీ మరింత పెరుగుతుందని, కామెంట్స్ ఇంకా ఎక్కువ అవుతాయని, దీని వల్ల గీతా మాధురికి నష్టం జరిగే అవకాశం ఉండటం వల్లనే డిలీట్ చేసినట్లు స్పష్టమవుతోంది.

Thursday 6 September 2018

మరోసారి నవ్వుల పాలైన అనుష్క

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ఇటీవల సోషల్‌ మీడియాలో బాగా ట్రోల్‌ అవుతూ ఉన్నారు. తన అప్‌కమింగ్‌ సినిమా ‘సూయి ధాగా-మేడిన్‌ ఇండియా’ ట్రైలర్‌లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్లకు విపరీతంగా నవ్వు తెప్పించాయి. తాజాగా మరోసారి అనుష్క నెటిజన్ల బారిన పడ్డారు. ఐఫోన్‌ను వాడుతూ.. గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ట్విటర్‌లో ప్రమోట్‌ చేశారు. ప్రపంచంలో టెక్‌ బ్లాగర్స్‌లో ఒకరైన, యూట్యూబ్‌ సెన్సేషన్‌ మార్క్స్‌ బ్రౌన్లీ ఈ విషయాన్ని గుర్తించారు. ఇంకేముంది ఆ విషయాన్ని ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశారు. దీంతో అనుష్క మరోసారి ట్విటర్‌లో బుక్‌ అయిపోయారు.

సూయి ధాగా నటి అనుష్క శర్మ, గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ప్రమోట్‌ చేయడానికి, ఐఫోన్‌ను వాడుతూ ట్వీట్‌ చేశారని తెలిపారు. ఆమె ట్వీట్‌ను కూడా స్క్రీన్‌షాట్‌ తీసి షేర్‌ చేశారు. పొరపాటు జరిగినట్టు గుర్తించిన అనుష్క, ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేసి, మరోసారి షేర్‌ చేశారు. కానీ ఆ లోపే మార్క్స్‌ అనుష్క పొరపాటును గుర్తించేశారు. అనుష్క చేసిన ఈ పొరపాటుపై ఈ యూట్యూబ్‌ స్టార్‌ మరోసారి మరో ట్వీట్‌ చేశారు. ‘డిలీట్‌‌ చేశావ్‌, మళ్లీ రీట్వీట్‌ చేశావు. కానీ కొంచెం కిందకి స్క్రోల్‌ డౌన్‌ చేయండి. ఐఫోన్‌ నుంచి వచ్చిన మరిన్ని పిక్సెల్‌ యాడ్స్‌ కనిపిస్తాయి’ అని పేర్కొన్నారు. అనుష్క చేసిన ఈ పనికి ట్విటర్‌ యూజర్లు పలువురు ఛలోక్తులు పేలుతున్నారు.

Blog Archive