Saturday 25 September 2010

ఇదే అదృష్టం!

ఇదే అదృష్టం
స్వైన్ ఫ్లూ రోజుల్లో ఒట్టి ఫ్లూ రావడమే అదృష్టం.
గుండె పోట్ల రోజుల్లో గుండె కేవలం రివర్సయి డెంగూ గా రావడమే అదృష్టం.
టీవి చూసి గుండె ఆగే రోజుల్లో కరెంటు కోత ఉండటమే అదృష్టం.
టెర్రరిస్టులకు భయపడే రోజుల్లో జేబుదొంగలు తారసపడటమే అదృష్టం.
బ్యాంకులు దివాలా తీసే రోజుల్లో డబ్బులు లేకపోవడమే అదృష్టం.
ఉద్యోగాలు పోయే రోజుల్లో చదువులేకపోవడమే అదృష్టం.
అమెరికాకు ఆర్దికమాంద్యం వచ్చిన రోజుల్లో వీసా దొరకకపోవడమే అదృష్టం.
కందిపప్పు కొనలేని రోజుల్లో దానికి రుచి లేకుందా పోవడమే అదృష్టం.
సన్నబియ్యం దొరకని రోజుల్లో సన్నబడాల్సిరావడమే అదృష్టం.
ఆడపిల్లల్ని కననివ్వని రోజుల్లో గర్భం దాల్చకపోవడమే అదృష్టం.
ప్రేమికులు ఆసిడ్ బాటిళ్ళతో తిరిగే రోజుల్లో ఎవరి ప్రేమకూ నోచుకొకపోవడమే అదృష్టం.
మానసిక సౌందర్యాన్ని గుర్తించలేని రోజుల్లో శారీరక సౌందర్యం లేక పోవడమే అదృష్టం.
పెళ్ళిళ్ళ ఖర్చు ఆకాశాన్నంటే రోజుల్లో పెళ్ళికొడుకులూ ,కూతుళ్ళు దొరకకపోవడమే అదృష్టం.
స్వయంగా మొగుళ్ళే యముళ్ళుగా మారుతున్న రోజుల్లో అనాదలుగా బ్రతకడమే అదృష్టం.
వర్షాలు పడని రోజుల్లో వలస పోగలగటమే అదృష్టం.
నాయకులు లేని రోజుల్లో వినాయకుడు ఉండటమే అదృష్టం.
పుట్టగొడుగులమద్య బ్రతికే రోజుల్లో నిజం గొడుగు క్రింద నిలబడగలగటమే అదృష్టం.
తలవంచి బ్రతకడం తప్పనిసరైన రోజుల్లో తలల్లో ఏమీ లేకుండా ఉండటమే అదృష్టం.
అబద్దాలు ప్రచారమయ్యే రోజుల్లో నిజాలు నిలకడమీద తలుస్తాయని ఆశించడమే అదృష్టం.
నేరుగా తిట్టలేని రోజుల్లో పిట్టకధలు చెప్పి కోపం తీర్చుకోగలగటమే అదృష్టం.

Wednesday 22 September 2010

ఒక శ్రీకాకుళం లెక్క!


సండే కామెంట్
ఒక శ్రీకాకుళం లెక్క

ఎన్ని చాక్లెట్లు, ఐస్‌క్రీములు తింటే ఒక పిల్లవాడికి మొహం మొత్తుతుంది?
ఎన్ని దెబ్బలు తిన్నాక ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది?
ఎన్ని వృత్తులు నాశనమైతే ఒక డిగ్రీ చేతికి వస్తుంది?
ఎన్ని ప్రశంసలు లభిస్తే ఒక రచయిత సంతృప్తి చెందుతాడు?
ఎన్ని గుంటలు పడితే ఒక రోడ్డును ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపిస్తారు?
ఎన్ని ఫ్లైఓవర్లు కడితే ఒక నగరం తన పేరును మార్చుకుంటుంది?
ఎన్ని ఉద్యమాలు జరిగితే ఒక రాష్ట్రం అవతరిస్తుంది?

ఎంత పని చేశాక ఒక శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది?
ఎంత డబ్బు జేబులో ఉంటే ఒక మనిషికి ధైర్యం వస్తుంది?
ఎంత ప్రయాణం పూర్తయితే గమ్యస్థానం ఏమిటో తెలుస్తుంది?
ఎంత స్తబ్ధత తర్వాత ఒక సమాజం మేలుకుంటుంది?
ఎంత అవినీతి జరిగితే దేవుడు కొత్త అవతారం ఎత్తుతాడు?
ఎంత మంచితనం జతపడితే ఒక సమాజం బాగుపడుతుంది?

***

ఇలాంటి గణాంకాలు కూడా చెప్పే శాస్త్రవేత్తలు ఎప్పుడు వస్తారో!

***

ఆ మధ్య శ్రీకాకుళంలో - కోటానుకోట్ల మంది వచ్చినారు బాబూ అని ఒకావిడ చాలా గొప్పగా చెప్పింది.
కోటానుకోట్ల మంది ఏమిటే లక్షలాది లక్షల మంది వచ్చారు అన్నదట రెండో ఆవిడ ఇంకా గొప్పగా.
లక్షలాది లక్షల మంది కాదే వేలాది వేల మంది వచ్చారంది ఇదంతా వింటున్న మూడో ఆవిడ మరింత గొప్పగా.
వాళ్లు లెక్కలు తెలియక అలా అంటున్నారనుకుంటున్నారా?
కాని లెక్కలు తెలిసిన అభివృద్ధి శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి లెక్కలే వేస్తున్నారే!

Friday 3 September 2010

‘ఓదార్పు’

‘ఓదార్పు’ టూరిజం
‘ఓదార్పు’ టూరిజం
ట్రావెల్ ఎజెన్సీల దగ్గర ఈమధ్య విపరీతంగా జనం. ఉప ఎన్నికల కాలం కాబట్టి సహజమేనని ముందు ఎవరూ పట్టించుకోలేదు. ఈవెంట్ మెనేజర్ల దగ్గరా అదే పరిస్తితి.తీర్దయాత్రలకాలం కాబట్టి ఇదీ సహజమేనని ఎవరూ పట్టించుకొలేదు. పెళ్ళిళ్ళు,వార్షికొత్సవాలూ జరిగేకాలమూ కాదు.
బస్టాండులకు వెళ్ళినా,రైల్వే స్టేషన్లకు వెళ్ళినా సేం టు సేం.టిక్కెట్లన్నీ ఎప్పుడో అయిపోయాయి.పైగా బస్సులు బస్సులుగా,బొగీలు బొగీలుగా రిజర్వు అయిపోయి ఉన్నాయి.
ఏమిటీ జనం ఇంతలా టురిజం మీద పడ్డారు ?
అని ప్రభుత్వం,దాని అధికారులు కాస్త ఆశ్చర్యపోయారు.బాధలకు,ఎండలకు,వానలకూ తట్టుకొలేక తిరుపతి,కాశీ,షిర్డీ,పూరి జగన్నధ యాత్రలకో,అమరనాధ యాత్రలకో పొతున్నట్టున్నారు అనుకున్నరు వాల్లంతా. కాని జనం వెలుతున్న ఊర్ల పేర్లు చూసి మహా ఆశ్చర్యపోయారు.ఆ ఊళ్ళలో టురిజం ఏముందీ.. అందులొనూ వానాకాలంలొ?
ట్రవెల్ ఎజెన్సీల వాళ్ళనడిగారు.బస్సు ఆపరెటర్ల నడిగారు.ఈవెంట్ మెనెజర్ల నడిగారు.అందరూ రెట్లు,ఏర్పాట్ల గురించె చెప్పారు.కుటుంబాలకు కుటుంబాలు,ఊళ్ళకు ఊళ్ళు వెలుతున్నరు ఏమిటీ సంగతీ అనడిగారు.
‘ఓదార్పు యాత్ర’ చెప్పారు వాళ్ళు.‘ఎవర్ని ఓదార్చటానికీ?’
‘మాలాగే నీళ్ళు దొరక్క ఇబ్బంది పడుతున్న జనాన్ని,
మాలాగే గిట్టుబాటు ధరలు దొరక్క అవస్తలు పడుతున్న రైతుల్ని,
మాలాగే వైద్యం దొరక్క కష్టపడుత్టున్న ప్రజల్ని,
మాలాగే అధిక దరలతొ సతమతమవుతున్న మనుషుల్ని,
మాలాగే అప్పుల్లొ కూరుకుపోయిన ప్రజానికాన్ని,
మాలాగే భూములు కోల్పోతున్న భాదితుల్ని
పరామర్శించడానికి,ఓదార్చటానికి,ధైర్యం చెప్పటానికి వెళుతున్నాం’
అనిచెప్పారు వాళ్ళు.

‘ఓదార్పు’

‘ఓదార్పు’ టూరిజం

ట్రావెల్ ఎజెన్సీల దగ్గర ఈమధ్య విపరీతంగా జనం. ఉప ఎన్నికల కాలం కాబట్టి సహజమేనని ముందు ఎవరూ పట్టించుకోలేదు. ఈవెంట్ మెనేజర్ల దగ్గరా అదే పరిస్తితి.తీర్దయాత్రలకాలం కాబట్టి ఇదీ సహజమేనని ఎవరూ పట్టించుకొలేదు. పెళ్ళిళ్ళు,వార్షికొత్సవాలూ జరిగేకాలమూ కాదు.
బస్టాండులకు వెళ్ళినా,రైల్వే స్టేషన్లకు వెళ్ళినా సేం టు సేం.టిక్కెట్లన్నీ ఎప్పుడో అయిపోయాయి.పైగా బస్సులు బస్సులుగా,బొగీలు బొగీలుగా రిజర్వు అయిపోయి ఉన్నాయి.
ఏమిటీ జనం ఇంతలా టురిజం మీద పడ్డారు ?
అని ప్రభుత్వం,దాని అధికారులు కాస్త ఆశ్చర్యపోయారు.బాధలకు,ఎండలకు,వానలకూ తట్టుకొలేక తిరుపతి,కాశీ,షిర్డీ,పూరి జగన్నధ యాత్రలకో,అమరనాధ యాత్రలకో పొతున్నట్టున్నారు అనుకున్నరు వాల్లంతా. కాని జనం వెలుతున్న ఊర్ల పేర్లు చూసి మహా ఆశ్చర్యపోయారు.ఆ ఊళ్ళలో టురిజం ఏముందీ.. అందులొనూ వానాకాలంలొ?
ట్రవెల్ ఎజెన్సీల వాళ్ళనడిగారు.బస్సు ఆపరెటర్ల నడిగారు.ఈవెంట్ మెనెజర్ల నడిగారు.అందరూ రెట్లు,ఏర్పాట్ల గురించె చెప్పారు.కుటుంబాలకు కుటుంబాలు,ఊళ్ళకు ఊళ్ళు వెలుతున్నరు ఏమిటీ సంగతీ అనడిగారు.
‘ఓదార్పు యాత్ర’ చెప్పారు వాళ్ళు.‘ఎవర్ని ఓదార్చటానికీ?’
‘మాలాగే నీళ్ళు దొరక్క ఇబ్బంది పడుతున్న జనాన్ని,
మాలాగే గిట్టుబాటు ధరలు దొరక్క అవస్తలు పడుతున్న రైతుల్ని,
మాలాగే వైద్యం దొరక్క కష్టపడుత్టున్న ప్రజల్ని,
మాలాగే అధిక దరలతొ సతమతమవుతున్న మనుషుల్ని,
మాలాగే అప్పుల్లొ కూరుకుపోయిన ప్రజానికాన్ని,
మాలాగే భూములు కోల్పోతున్న భాదితుల్ని
పరామర్శించడానికి,ఓదార్చటానికి,ధైర్యం చెప్పటానికి వెళుతున్నాం’
అనిచెప్పారు వాళ్ళు.