సర్వసాధారణంగా పరీక్షలు దగ్గరపడినపుడు, అవి ప్రారంభమైనపుడు పిల్లలు తమ మెదడుని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసేస్తారు. అలా చేయటం మంచిది కాదు. ఈ సమయంలోనే పిల్లలకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి అవసరం. మానసికంగా ఆందోళన చెందితే వారు పరీక్షలు సరిగా రాయలేరు. పైగా అంతకుముందు చదివినదంతా మర్చిపోయే ప్రమాదమూ వుంది. పరీక్షల సమయంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే వారిలో భయం, ఆందోళన వంటివి మాయమవుతాయి.ఇలా చదవడం వల్ల కూడా మానసిక ఆందోళన పెరిగే కొద్దీ పిల్లలు ఎక్కువ చదవలేరు. చదివినా మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల్లో ఒత్తిడి ఆందోళన కలగకుండా వారు బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాంటే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. అవేంటో ఒక సారి చూద్దాం.... 1. అనుకూలమైన ప్రదేశం కల్పించాలి: పిల్లలు చదువుకోవటానికి నిర్దిష్టమైన స్థలాన్ని లేదా చోటును చూసుకోవాలి. నలుగురు కూర్చున్నచోట కూర్చుని చదవటంవల్ల వాళ్ళేం చదువుతున్నారో వారికి అర్థం కాదు. అందుకని సాధ్యమైనంత వరకూ ఏ విధమైన అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. టీవీనో, డివిడిలో సినిమాలు చూస్తూనే చదువద్దు. మంచంపైన ఫ్లాట్గా, బోర్లా పడుకుని చదవకూడదు...