Saturday 29 September 2018

కౌశల్ ని ఇంకా టార్గెట్ చేస్తున్నారు, తేజస్వి మరాదా?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో సంచలనం అని చెప్పొచ్చు. కొన్ని నెలల క్రితం నాని హోస్టింగ్ తో మొదలైన ఈ రెండో సీజన్ ఇప్పుడు ఓ కొలిక్కి రాబోతున్నది. 16 మందితో మొదలైన ఈ సీజన్ మొత్తం 5 మందితో చివరి దశకు చేరుకుంది. బిగ్ బాస్ ఇంట్లో మొదటి నుంచి అందరూ కౌశల్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారనేది కౌశల్ అభిమానుల వాదన.

కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ విషయం నిజమేనేమో అనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు బిగ్ బాస్ మిగిలిన హౌస్ మేట్స్ కి ముందు ఎలిమినేట్ అయినటువంటి సభ్యులని అందరిని పిలిపించి సర్ప్రైజ్ ఇచ్చారు. కానీ ఆ సర్ప్రైజ్ ఒక్కరికి తప్ప అందరికి దక్కింది. తిరిగి వచ్చిన సభ్యులు అందరూ మళ్ళీ కౌశల్ నే టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. వారిలో వారే మళ్ళీ గ్రూపులుగా విడిపోయి కౌశల్ ని ఒంటరి చేశారు. తేజస్వి అయితే మరీను వచ్చి అందరిని పలకరించింది కానీ, ఒక్క కౌశల్ ని మాత్రం పట్టించుకోలేదు.

బాబు గోగినేని పరిస్థితి కూడా ఇంతే వారు ఏ విధంగా ఐతే బయటికి వెళ్లారో అదే విధంగా లోపలికి వచ్చారని,వాళ్ళు ఇక మారరని కౌశల్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.నిన్నటి ఎపిసోడ్ ప్రోమో చూసుకున్నా సరే కౌశల్ ని ఒక్కరు కూడా కనీసం పలకరించిన పాపాన పోలేదు,సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.కానీ కౌశల్ కి తాము ఎప్పుడు వెన్నంటే ఉంటామని కౌశల్ ఆర్మీ అంటున్నారు.

Thursday 27 September 2018

బిగ్ బాస్ నుంచి మరో లీక్

నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 చివరి దశకు చేరుకుంది. ఈ వారమే బిగ్ బాస్ సీజన్ 2 విజేత ఎవరు అనేది తెలిపోనున్నది. విజేతగా ఎవరు నిలుస్తారు అనే దానిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరుగుతుంది. మొదటి నుంచి బిగ్ బాస్ లో జరగబోయే ఎలిమినేషన్స్ ముందుగానే తెలిసిపోతున్నాయి.

ఇప్పుడు అదే జరిగింది. ఈరోజు జరగబోయే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో దీప్తి బయటకు వేల్లబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు నమోదైన ఓట్ల ద్వారా ఈ విషయం చెబుతున్నారు. కౌశల్, గీత, సామ్రాట్, తనిష్ ఈ నలుగురిలో ఫైనల్ వీక్ జరనుంది. వీరిలో ఇద్దరిని శనివారం ఎలిమినేట్ చేయనున్నారు. ఇక ఆఖరి ఎపిసోడ్ ఆదివారం రోజున మిగిలిన ఇద్దరు సభ్యుల్లో ఒకరిని విజేతగా ప్రకటించబోతున్నారు.

Wednesday 26 September 2018

ట్విట్టర్ లో కాజోల్ ఫోన్ నెంబర్

పొరపాటున ట్విట్టర్ లో తన భార్య, నటి కాజోల్ మొబైల్ నెంబర్ ని షేర్ చేశాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. అంతే నిమిషాల వ్యవదిలో ఆ ట్విట్టర్ వైరల్ అయింది. వేలమంది ఈ ట్విట్ ని వాచ్ చేశారు, వందల మంది కాజోల్ కు మెసేజ్ చేయడం మొదలుపెట్టారు. పొరపాటుని గమనించిన అజయ్ దేవగన్ ఫ్రాంక్ అని వివరణ ఇచ్చినా వినని అభిమానులు వాట్సాప్ లో మెసేజ్ లపై మెసేజ్ లు చేస్తున్నారు.

దాంతో ఏమి చేయాలో పాలుపోని అజయ్ దేవగన్ తలపట్టుకొని కూర్చున్నాడట. అజయ్ దేవగన్ ఏమని ట్విట్ చేశాడంటే....కాజోల్ ప్రస్తుతం ఇండియాలో లేదు....ఆమెను వాట్స్ యాప్ నెంబర్ సంప్రదించి సమన్వయం చేసుకోండి అని ఎవరికో పెట్టాల్సిన మెసేజ్ అందరికి కనిపించేలా ట్విట్టర్ లో పెట్టాడు.
Kajol Whatsapp Number Leaked in Twitter
Kajol Whatsapp Number Leaked in Twitter


ఈ ఒక్క ఫోజులో చాలానే సంగతులున్నాయి

బాలీవుడ్ న‌టి స‌న్నీలియోన్ లేటెస్ట్‌గా ఓ పిక్‌ని పోస్ట్ చేసింది. సన్నీ ఈ ఫోటోలో నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా కనిపిస్తోంది. బ్లాక్ కలర్ జీన్స్ బాటమ్ – దానికి కాంబినేషన్ గా కాఫీ రంగు టైట్ ఫిట్ టాప్… పూర్తి ఆపోజిట్ లో ఆరెంజ్ కలర్ చున్నీతో అదిరిపోయే ఫోజిచ్చింది. అయితే ఈ ఒక్క ఫోజులో వేరే చాలానే సంగతులున్నాయి. దీనికి ప్రఖ్యాత కార్ల్ టన్ లండన్ ఇండియా – ఐరా సన్ గ్లాసెస్ – స్ప్లాష్ యాక్సెసరీస్ – స్ప్లాష్ టాప్ ఇన్ని రకాల బ్రాండ్లు సన్నీ ఒంటిపై ఉన్నాయి. వీటికి తోడు ఎలానూ స్టార్ స్టక్ సౌందర్య ఉత్పత్తులనే తన మేకప్కి ఉపయోగిస్తోంది. హితేంద్ర కపోపర ఈ స్టైల్ ని డిజైన్ చేశారు. కపిల్ కిల్ నాని ఈ ఫోటో రూపకర్త.

Monday 24 September 2018

అర్థరాత్రి వచ్చి మసాజ్ చేస్తానన్నాడు

గతంలో టాలీవుడ్ పై పలు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన ఈ హీరోయిన్, తాజాగా తనకు ఎదురైన మరో చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ఓ బాలీవుడ్ సినిమా సెట్స్ లో ఓ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది రాధిక ఆప్టే. అర్థరాత్రి రూమ్ కు వచ్చి మసాజ్ చేస్తానని ఆఫర్ చేశాడని చెప్పుకొచ్చింది.
Radhika Apte
"రీసెంట్ గా నాకు ఎదురైన ఓ అనుభవం గురించి చెబుతాను. నిజానికి ఆ టైమ్ లో నాకు బాగా నడుము నొప్పి ఉంది. కానీ అలానే షూటింగ్ లో పాల్గొన్నాను. షూటింగ్ తర్వాత నేను లిఫ్ట్ లో నా రూమ్ కు వెళ్తున్నాను. అదే లిఫ్ట్ లో మరో నటుడు ఉన్నాడు. మా సినిమాలో అతడు కూడా నటిస్తున్నాడు. లిఫ్ట్ లో నాతో అతడు అసభ్యంగా మాట్లాడాడు. అర్థరాత్రి అవసరం అయితే ఫోన్ చేయమన్నాడు. వచ్చి నా నడుముకు మసాజ్ చేస్తానని నాతో చెప్పాడు."

అతడు అలా చెప్పడంతో తను షాక్ అయ్యానని, మర్నాడు పొద్దున్నే ఈ విషయంపై యూనిట్ కు ఫిర్యాదు చేశానని తెలిపింది రాధికా ఆప్టే. అయితే మసాజ్ చేస్తానంటూ ఆఫర్ ఇచ్చిన నటుడిపై సానుభూతి కూడా తెలిపింది రాధిక.

"రాత్రికి వచ్చి మసాజ్ చేస్తానని ఆఫర్ చేసిన ఆ నటుడికి నిజానికి అది తప్పనే విషయం తెలీదు. అతడు పెరిగిన వాతావరణం అలాంటిది. యూనిట్ మందలించడంతో వెంటనే నా దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు."

ఇలా రీసెంట్ గా తనకు ఎదురైన ఓ అనుభవాన్ని బయటపెట్టింది రాధికా ఆప్టే. లైంగిక వేధింపులకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాధిక ఆప్టే, మహిళలపై వేధింపులు ఏ రూపంలో జరిగినా అది తప్పేనని, వీటిని ఎప్పటికప్పుడు ఖండించాలని పిలుపునిచ్చింది.

సమంత దెయ్యం అంటున్న చైతు

అదేంటి సమంతను చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా.... అలా అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే.... పరిశ్రమలో ఏ ఇద్దరినీ కదిపినా కూడా అక్కినేని వారి పోరు గురించే మాట్లాడుకుంటున్నారు. భార్య భర్తలు ఇద్దరూ వచ్చి సెప్టెంబర్ 13న తమ సినిమాలతో పోటీ పడుతున్నారు.

శైలజ రెడ్డి అల్లుడు వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 13న వస్తుంది. అయితే తన సినిమాను విడుదల చేయాలనే కంగారులో భార్య సమంతనే మరిచిపోయాడు నాగచైతన్య.

అయితే ఆ తర్వాత మెల్లగా సమంతకు వెళ్లి తన సినిమా విషయం చెప్పాడు చైతన్య. అప్పుడు నిజంగానే యుటర్న్ సినిమాలో దెయ్యంలాగే పేస్ పెట్టిందని.... తొలిసారి లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తే నువ్వొచ్చి నా సినిమాపైనే పెడతావా అంటూ అరిచేసిందని చెప్పాడు చైతు.

అయితే ఇద్దరు డిఫరెంట్ సినిమాలు చేశారు.... రెండు విభిన్నమైన కాన్సెప్ట్ లు... పైగా వినాయకచవితి సెలవులు ఉన్నాయి కాబట్టి సమస్య లేదని డిస్ట్రిబ్యూటర్లు తమకు ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నాడు చైతు.

పడి పడి లేచే మనసు

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరో గా నటిస్తున్న సినిమా 'పడి పడి లేచే మనసు ' . ఈ సినిమా లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది .ఈ చిత్ర యూనిట్ ఇటీవల నేపాల్ లో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు. తాజాగా వీరు హైదరాబాద్ చేసుకొని ఇక్కడ షూటింగ్ ని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం వీరు రొమాంటిక్ సీన్స్ షూటింగ్ లో బిజీ గా వున్నారు. ఈ సినిమా లో శర్వానంద్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా ని చిత్ర యూనిట్ డిసెంబర్ 21 న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు .

Tuesday 18 September 2018

తారక్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న అరవింద సమేత సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటె ఎన్టీఆర్ సినిమా అంటే డైలాగ్స్, ఫైట్స్, తో పాటుగా తారక్ డాన్స్ లు ఆశిస్తారు. అయితే ఈసారి ఆ విషయంలో నిరాశ చెందక తప్పాడు. సినిమాలో ఫారిన్ షెడ్యుల్ లో ఏర్పరిచిన ఓ పాటని మొత్తానికి క్యాన్సిల్ చేశారట.
కాబట్టి సినిమా మొత్తం మీద కేవలం 4 పాటలు మాత్రమే ఉంటాయని అంటున్నారు. అందులో ఒకటి బ్యాక్ గ్రౌండ్ థీం సాంగ్ అట. అంటే సినిమాలో ఉండేవి మూడు పాటలే అంట. అందులో ఒకటి మాత్రమే హీరో సోలో సాంగ్. ఆ ఒక్క పాటలోనే ఎన్టీఆర్ డాన్స్ చేస్తాడు. మొత్తానికి సాంగ్ కాన్సిల్ చేసి నిర్మాత వ్యయాన్ని తగ్గించినా సినిమా ఫలితం పై ఏమత్రం ప్రభావం చూపుతుందో చూడాలి

Sunday 16 September 2018

బిగ్ బాస్ 2 లో గీతకు నాని క్లాస్

బిగ్ బాస్ 2 సీజన్ ఇప్పటివరకు 95 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మరి కొన్ని రోజుల్లో ఈ షో పుర్తికానున్నది. ఈవారం నామినేషన్స్ లో అమిత్, రోల్, కౌశల్, దీప్తి, గీతామాధురిలు ఉండగా తక్కువ ఓట్లు అమిత్, రోల్ రైడాలకు వచ్చాయి. దాంతో వీరిద్దరిలో ఒకరు బయటకు వెళ్ళే అవకాశం ఉందని అనుకుంటే ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

బిగ్ బాస్ తన ప్లాన్ ప్రకారం దీప్తిని బయటకు పంపించబోతుందని టాక్. నిజానికి ఈవారం నామినేషన్స్ లో దీప్తికి ఓట్లు బాగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఆమెని బయటకి పంపితే మరోసారి ప్రజల ఓట్లకు విలువ లేదనే విమర్శలు వచ్చే అవకాశం ఉన్నది. మరి బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడో చూడాలి.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో హోస్ట్ నాని.. కంటెస్టెంట్ గీతాకి క్లాస్ పీకినట్లు సమాచారం. కౌశల్ పట్ల ఆమె వ్యవహరించిన తీరు పట్ల నానిని ఆమెని ప్రశ్నించి తప్పులు ఎత్తి చూపడంతో గీతా ఎమోషనల్ అయినట్లు చెబుతున్నారు. కౌశల్ ని కూడా టాస్క్ లలో సంచలకుడిగా సొంత రూల్స్ పెట్టుకోవడమేంటని ప్రశ్నించబోతున్నారట

Friday 14 September 2018

జాన్వి డ్రెస్సులపై ఫ్యాన్స్ ట్రోల్

మన సంప్రదాయాలను చేధించుకొని మన ఇష్టం వచ్చినట్లు ఉంటాం అంటే అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. సెలబ్రిటీలు అందుకు మినహాయింపు కాదు. వాళ్లైన అభిమానుల మాట ప్రకారం నడుచుకోవాల్సిందే. స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వి పరిస్థితి కూడా ఇదే.
Janhvi Kapoor
Janhvi Kapoor
ఈమధ్య చాలా పొట్టి దుస్తుల్లో బయట కనిపిస్తున్న జాన్వి పై సోషల్ మీడియాతో పాటు ఆన్ లైన్లో పెద్ద ఎత్తున ట్రాలింగ్ జరుగుతుంది. ఇలా సభ్యత లేకుండా మరి అంత కురచ దుస్తులు వేసుకోవడం అవసరమా అంటూ క్లాసులు పీకుతున్నారు.

తాజాగా థైస్ పైదాకా వచ్చిన చిన్న మిడ్డితో పైన రెడ్ స్కర్ట్ తో జాన్వి వేసిన ఔట్ ఫిట్ విమర్శలకు అవకాశం ఇస్తుంది. శ్రీదేవి మరీ ఇంత కురచ దుస్తులైతే ఎప్పుడు వేయలేదు. గ్లామర్ షో చేసినా పరిమితంగా నెగిటివ్ కామెంట్స్ రాకుండా జాగ్రత్త పడేది.

కానీ జాన్వి అలంటి పరిమితుల మధ్య ఉండడానికి ఇష్టపడటం లేదు. మొదటి సినిమా దఢక్ కమర్షియల్ గా సక్సెస్ అనిపించుకున్నా  తన విషయంలో పూర్తి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు.

అందుకే రెండో సినిమా విషయంలో కరణ్ జోహార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. అయినా పబ్లిక్ లో శ్రీదేవి కూతురిగా గుర్తింపు ఉన్నప్పుడు స్వంతంగా కొంత ఇమేజ్ వచ్చే దాకా జాన్వీ కాస్త జాగ్రత్తగా ఉంటే బెటరేమో. అయినా జాన్వీ మాత్రం వినే  పరిస్థితిలో లేదు.

Thursday 13 September 2018

ఎపి నిరుద్యోగ బృతి పథకం - Apply Online

పధకం : ముఖ్యమంత్రి యువ నేస్తం

దరఖాస్తు నమోదు ప్రారంభ తేదీ : 14-09-2018 Afternoon 

అర్హులు : డిగ్రీ, పాలిటెక్నిక్ చేసిన నిరుద్యోగ యువత 

వయస్సు : 22 నుంచి 35 ఏళ్ల లోపు 

నెలకు ఇచ్చే భృతి : రూ. 1,000 

ఎంత మందికి : 10 – 12 లక్షల మంది ఉంటారని అంచనా

పథకానికి అర్హతలు :
  • అర్హులకు ప్రతి నెలా మొదటి వారంలో బ్యాంకు ఖాతాల్లో భృతి జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
  • ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ నమోదుకు తుది గడువు విధించలేదు.
  • పీఎఫ్ ఉంటే అనర్తులే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తూ ప్రావిడెంట్ ఫండ్ (PF) ప్రతి నెలా చెల్లిసున్న వారంతా నిరుద్యోగ భృతికి అనర్హులు.
  • అర్హులు, అనర్హలా వెంటనే తెలిపే విధానం ఆన్ లైన్లో పేర్లు నమోదు చేసిన వెంటనే నిరుద్యోగ భృతి తీసుకోవడానికి అర్హులా? అనర్హలా? అనేది తెలిసిపోతుంది.
  • 50 వేలకు మించి సబ్సిడీ తీసుకుంటే వర్తించదు వివిధ సంక్షేమ పథకాల కింద ప్రభుత్వం తరపున రూ. 50 వేలకు మించి సబ్సిడీ తీసుకున్న వారంతా నిరుద్యోగ భృతికి అనర్హులు.

Wednesday 12 September 2018

ఆమెని ప్రశాంతంగా ఉండనివ్వండి

గీత గోవిందం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ముద్దుగుమ్మ రష్మిక మండన్న గతంలో కన్నడ నటుడు రక్షిత్ తో చేసుకున్న విషయం తెలిసిందే. గీత గోవిందం సినిమా విజయంతో కోట్ల పారితోషికాలు ఈమెకు వస్తున్న కారణంగా రక్షిత్ తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందని విమర్శలు వచ్చాయి. కన్నడ నటుడు రక్షిత్ అభిమానులు ఈ విషయంలో రష్మిక పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగులో ఆమె నటించిన సినిమా విడుదలై మంచి విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు వస్తున్న కారణంగానే నిశ్చితార్ధం రద్దు చేసుకున్నట్లుగా కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మీడియా వార్తలపై రక్షిత్ స్పందించాడు. రష్మికపై విమర్శలు ఆపండి, ఇద్దరం చర్చించుకొని నిశ్చితార్ధం రద్దు చేసుకున్నామని, ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

గత కొన్నిరోజులుగా తమ మధ్య కొన్ని విభేదాలు జరుగుతున్నాయి. ఆ విభేధాల కారణంగానే తాము కలసి జీవించడం అసాధ్యం అనే నిర్ణయానికి వచ్చాం. అందుకే పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని, అంతే కానీ ఆమెను ఎవరు ట్రోల్ చేయొద్దని రక్షిత్ కోరాడు. తమ ఇద్దరి అభిప్రాయాలూ కలవకపోవడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇద్దరం కలసి తీసుకున్న నిర్ణయంలో ఆమె ఒక్కదాన్ని బలిచేయడం సరైనది కాదని రక్షిత్ సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరాడు

Tuesday 11 September 2018

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నమిత

actress Namitha latest photo
హాట్ బ్యూటీ నమిత వివాహం తరువాత మీడియాలో కనిపించడం బాగా తగ్గించింది. తెలుగు తమిళ చిత్రాల్లో నమిత ఓ వెలుగు వెలిగింది. గత ఏడాదే తన ప్రియుడు వీరేంద్రని వివాహం చేసుకుంది. హీరోయిన్ నటిస్తూనే సింహ వంటి చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసింది. తాజాగా ఓ ఈవెంట్ లో మెరిసిన నమిత పూర్తిగా మారిపోయింది. ఆమె లేటెస్ట్ లుక్ షాక్ ఇచ్చే విధంగా ఉంది.

Monday 10 September 2018

ఇంటర్ నెట్‌ని బ్రేక్ చేస్తున్న ఫోటో!

వైరల్ గా మారిన కామసూత్ర 3డి హీరోయిన్ షెర్లిన్ చోప్రా
కామసూత్ర 3డి హీరోయిన్ షెర్లిన్ చోప్రా మరో మారు ఇంటర్ నెట్ లో అగ్గి రాజేసింది. బోల్డ్ లుక్ కనిపించడం షెర్లిన్ కు వెన్నతో పెట్టిన విద్య. ఘాటు ఫోటో షూట్స్ తో చెలరేగిపోతున్న షెర్లిన్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. క్షణాల్లో ఈ ఫోటో వైరల్ గా మారిపోయింది. ఘాటు ఫోజులకు, కాట్రవర్షియల్ కామెంట్స్ కు షెర్లిన్ చోప్రా కేర్ ఆఫ్ అడ్రస్.
sherlyn chopra
బ్రా లెస్ పిక్
తాజాగా ఓ ఫోటో షూట్ లో మెరిసిన షెర్లిన్ చోప్రా బ్ర లెస్ గా కనిపించింది. కళ్ళు చెదిరే హాట్ లుక్ లో ఉన్నఈ పిక్ ఇంటర్ నెట్ ని దున్నేస్తోంది. నైట్ సూట్ ధరించిన షెర్లిన్ బ్రా లెస్ గా కనిపిస్తూ అందాలు ఆరబోస్తోంది.

Sunday 9 September 2018

పవన్ హీరోయిన్ పోలీసులను ఆశ్రయించింది

పవన్ కళ్యాణ్ తో తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రీతి జంగానియా గుర్తుంది కదా...! వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రీతీ ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటుంది. చాలా కాలంగా బయట కనిపించని ఆమె తాజాగా మీడియా ముందుకు వచ్చింది.
తన ఏడేళ్ళ కొడుకుపై చేయి చేసుకున్న పక్క అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే వ్యక్తిపై ప్రీతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ పెద్దాయన తన కుమారిడిపై చేయి చేసుకోవడంతో పాటు అపార్ట్ మెంట్ బయటకు గెంటేశాడు అంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి, సర్దిచెప్పి పంపారని తెలుస్తుంది.

Friday 7 September 2018

గీతామాధురి పై దారుణమైన కామెంట్స్

బిగ్ బాస్ 2 షో బలమైన కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగుతున్న గీతామాధురిపై కొన్ని రోజులుగా దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. సోషల్ మీడియాలో కొందరు ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. మరో కంటెస్టెంట్ కౌశల్ ను తన పవర్స్ ఉపయోగించి ఈ సీజన్ ముగిసే సరికి ప్రతివారం నామినేట్ అయ్యేలా గీతామాధురి చేసిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. నెగిటివ్ కామెంట్స్, విమర్శలు ఒకే కానీ... బూతులు తిడుతూ కొందరు అసభ్యమైన కామెంట్స్ చేస్తుండడంతో గీతా మాధురి భర్త నందు రంగంలోకి దిగారు. బిగ్ బాస్ అనేది కేవలం గేమ్ షో. అందులో జరిగే పరిణామాలపై అభిప్రాయాలూ వ్యక్తం చేయడంలో తప్పులేదు. కానీ వ్యక్తిగతమైన కామెంట్స్ చేయడం సరికాదు.

ఓ మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం మన సంస్కారం కాదు.... అని గీతా మాధురి భర్త నందు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసి, తర్వాత డిలీట్ చేశారు. అయితే తను పోస్టు చేసిన వీడియో వల్ల నెగెటివిటీ మరింత పెరుగుతుందని, కామెంట్స్ ఇంకా ఎక్కువ అవుతాయని, దీని వల్ల గీతా మాధురికి నష్టం జరిగే అవకాశం ఉండటం వల్లనే డిలీట్ చేసినట్లు స్పష్టమవుతోంది.

Thursday 6 September 2018

మరోసారి నవ్వుల పాలైన అనుష్క

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ఇటీవల సోషల్‌ మీడియాలో బాగా ట్రోల్‌ అవుతూ ఉన్నారు. తన అప్‌కమింగ్‌ సినిమా ‘సూయి ధాగా-మేడిన్‌ ఇండియా’ ట్రైలర్‌లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్లకు విపరీతంగా నవ్వు తెప్పించాయి. తాజాగా మరోసారి అనుష్క నెటిజన్ల బారిన పడ్డారు. ఐఫోన్‌ను వాడుతూ.. గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ట్విటర్‌లో ప్రమోట్‌ చేశారు. ప్రపంచంలో టెక్‌ బ్లాగర్స్‌లో ఒకరైన, యూట్యూబ్‌ సెన్సేషన్‌ మార్క్స్‌ బ్రౌన్లీ ఈ విషయాన్ని గుర్తించారు. ఇంకేముంది ఆ విషయాన్ని ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశారు. దీంతో అనుష్క మరోసారి ట్విటర్‌లో బుక్‌ అయిపోయారు.

సూయి ధాగా నటి అనుష్క శర్మ, గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ప్రమోట్‌ చేయడానికి, ఐఫోన్‌ను వాడుతూ ట్వీట్‌ చేశారని తెలిపారు. ఆమె ట్వీట్‌ను కూడా స్క్రీన్‌షాట్‌ తీసి షేర్‌ చేశారు. పొరపాటు జరిగినట్టు గుర్తించిన అనుష్క, ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేసి, మరోసారి షేర్‌ చేశారు. కానీ ఆ లోపే మార్క్స్‌ అనుష్క పొరపాటును గుర్తించేశారు. అనుష్క చేసిన ఈ పొరపాటుపై ఈ యూట్యూబ్‌ స్టార్‌ మరోసారి మరో ట్వీట్‌ చేశారు. ‘డిలీట్‌‌ చేశావ్‌, మళ్లీ రీట్వీట్‌ చేశావు. కానీ కొంచెం కిందకి స్క్రోల్‌ డౌన్‌ చేయండి. ఐఫోన్‌ నుంచి వచ్చిన మరిన్ని పిక్సెల్‌ యాడ్స్‌ కనిపిస్తాయి’ అని పేర్కొన్నారు. అనుష్క చేసిన ఈ పనికి ట్విటర్‌ యూజర్లు పలువురు ఛలోక్తులు పేలుతున్నారు.

ఈ సినిమాని వరల్డ్ ఫెమస్ చేద్దాం

కేరాఫ్ కంచరపాలెం సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సినీ హీరో రానా మాట్లాడుతూ....కంచరపాలెం సినిమాని వరల్డ్ ఫెమస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

'ఈనెల 7న మీ ముందుకు రాబోతుంది. కంచపాలెంతో పాటు నేనున్నా... ఈ సినిమాని వరల్డ్ ఫెమస్ చేద్దాం. మీలో ఎంతో మంది కళాకారులూ ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రపంచానికి పంపిద్దాం. ఈ సినిమాలో కళాకారులు చాలా బాగా చేశారు. వీరు చేసిన దానిలో పదిశాతం నేను చేసుంటే.... కమల్ హాసన్ అయిపోతాను. పెద్ద స్క్రీన్ లో ప్రపంచమంతా చూడాలి' అంటూ ప్రశంసలు కురిపించారు.

Wednesday 5 September 2018

రవిశాస్త్రి రాసలీలలు.. అప్పట్లో ఆ హీరోయిన్!

నిమ్రత్ కౌర్ అనే నటీమణితో శాస్త్రి డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సుదీర్ఘ పర్యటన కోసం శాస్త్రి ఇంగ్లండ్ వెళ్లాడు. అప్పటి నుంచి నిమ్రత్ కూడా అక్కడే ఉందని.. వీరిద్దరూ తరచూ కలుస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 56 యేళ్ల వయసులో శాస్త్రి కొత్త గ్రంథ సారంగం మొదలుపెట్టడం విశేషం.

టీమిండియా మాజీ కెప్టెన్, జగమెరిగిన కమెంటరేటర్, ప్రస్తుతం టీమిండియా కోచ్.. ఈ సెలబ్రిటీ తనకన్నా ఇరవై యేళ్ల చిన్న వయసు మగువతో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నాడట. రవిశాస్త్రి కొన్ని సంవత్సరాల నుంచి భార్యకు దూరంగా ఉంటున్నాడు. పదేళ్ల నుంచి వీరు వేర్వేరుగా ఉంటున్నారు. మధ్యలో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే విడాకులు ఖరారు కాలేదు.

అయితే తనకు హీరోయిన్ భార్యగా వద్దని స్టేట్ మెంట్ ఇచ్చి నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు శాస్త్రి. అనంతరం అమృతా సింగ్ సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంది. మరి ఒకప్పుడు తనకు భార్యగా హీరోయిన్ వద్దని స్టేట్ మెంట్ ఇచ్చిన శాస్త్రి ఇప్పుడు నిమ్రత్ కౌర్ ను పెళ్లి చేసుకుంటాడా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. ఇక నిమ్రత్ మాత్రం.. శాస్త్రితో తనకు ముడిపెడుతూ వస్తున్న వార్తల్లో నిజంలేదని అంటోంది.

ట్రోల్స్ పై స్పందించిన నాని

బిగ్ బాస్ 2 రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. సోషల్ మీడియాలో తోలి నుంచి ఈ షోపై హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో హౌస్ లో జరిగే ప్రతివిషయం పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

గతవారం నూతన నాయుడు ఎలిమినేషన్ సరిగ్గా జరగలేదని, ఓట్లు ఎక్కువ వచ్చినా కావాలనే ఎలిమినేటి చేశారని షో నిర్వాహకులు, హోస్ట్ నానిపై ప్రేక్షకులు మండి పడుతున్నారు.

అంతా స్క్రిప్టెడ్ గేమ్ అని తనీష్ లేక గీత మాధురిల్లో ఒకరిని విజేతగా ప్రకటించడానికి బిగ్ బాస్ ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. ఎలిమినేషన్ చేయాలనుకుంటే డైరెక్ట్ చేయాలనీ కానీ తమ ఓట్లు అడిగి అవమానించడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.

షో పై నమ్మకం పోయిందని, హోస్ నాని కూడా వారి పక్షాన నిలుస్తూ మద్దతు తెలుపుతున్నారని కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా నాని మూవీ దేవదాస్ ని బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.

ఇంకొందరు తమ అభిమాన హీరో నానినే తమని మోసం చేస్తున్నాడని, అతనిపై ఉన్న గౌరవడం పోయిందని అంటున్నారు. అయితే తాజాగా ఈ ట్రోల్స్ పై నాని ట్విట్టర్ లో స్పందించారు. ఆ లేఖలో ఏమున్నదో ఇక్కడ చూడొచ్చు.

Blog Archive