Thursday 9 May 2024

హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?

 హీరోయిన్ జాన్వీ కపూర్ ఫుల్ ఫామ్‌లో ఉంది. హిందీలో మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తున్న ఈ భామ.. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర', రామ్ చరణ్‌ 16వ సినిమాలో చేస్తోంది. అలానే ప్రేమ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్‌తో రిలేషన్‌లో ఉంది. ఈ విషయాన్ని ఎక్కడ దాచలేదు. పలుమార్లు బయట కనిపించారు. కొన్నాళ్ల ముందు జంటగా తిరుపతి దర్శనం కూడా చేసుకున్నారు. తాజాగా వీళ్ల పెళ్లి గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది.

జాన్వీ కపూర్ పెళ్లి తిరుపతిలో జరగనుంది. బంగారు రంగు చీర కట్టుకోనుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా నాతో చెప్పింది' అని ఇన్ స్టాలో ఓ నెటిజన్స్ పోస్ట్ పెట్టాడు. ఇతడు జాన్వీ ఫ్రెండ్ కావడంతో నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఈ పోస్ట్‌కి రిప్లై ఇచ్చిన జాన్వీ.. 'ఏదైనా రాస్తారా' అని ఫైర్ అయింది. పలువురు నెటిజన్లు మాత్రం జాన్వీ పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'మీకు తెలియకుండానే మీ పెళ్లి చేసేస్తున్నారు', 'పెళ్లి చేసుకునే వరకు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు' అని రాసుకొస్తున్నారు


ఇకపోతే మహారాష్ట్ర మాజీ సీఎం సుశీష్ కుమార్ షిండే మనవడు అయిన శిఖర్.. ముంబయిలో బిజినెస్ చేస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి జాన్వీ కపూర్‌తో రిలేషన్‌లో ఉన్నాడు. అతడితో బాండింగ్ గురించి జాన్వీ కూడా పలుమార్లు బయటపెట్టింది. అయితే ఇప్పుడు పెళ్లి గురించి గోల ఎక్కువైంది. అయితే జాన్వీ కెరీర్ పరంగా చూస్తే ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోకపోవచ్చనిపిస్తోంది

Saturday 4 May 2024

ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త!



ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్‌ లోనుంచి బాటిల్‌ తీసుకుని చల్లని నీళ్లు గటగటా తాగడం  చాలా మందికి అలవాటే. విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగించేమాట నిజమే అయినా ఇలా చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్‌ లోనుంచి బాటిల్‌ తీసుకుని చల్లని నీళ్లు గటగటా తాగడం  చాలా మందికి అలవాటే. విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగించేమాట నిజమే అయినా ఇలా చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల గొంతు నొప్పి, టాన్సిలైటిస్‌ సమస్య మాత్రమే కాదు.. జీర్ణక్రియ నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు... చివరకు గుండెపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.


      ఎందుకంటే రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీటిని తాగడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఘన ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం వస్తుంది.

అంతేకాదు, చల్లటి నీటిని తాగడం వల్ల ఈ నాడి చల్లబడుతుంది. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా తగ్గితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.


      రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో వివిధ రకాల సమస్యలు సంభవిస్తాయి. చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు గట్టిపడుతుంది. ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది.

అందువల్ల వీలయినంత వరకు ఎండలో నుంచి రాగానే చల్లటి నీళ్లు తాగకూడదు. అందులోనూ ఫ్రిజ్‌లోని నీళ్లు తాగడం అసలు మంచిది కాదు. కొంచెంసేపు ఆగిన తర్వాత కుండలోని నీళ్లు లేదా నార్మల్‌ వాటర్‌ ముందు తాగి, ఆ తర్వాత చల్లటి నీళ్లు తాగినా ఫరవాలేదు.

Popular Posts