Thursday 29 November 2018

కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ పిక్ చూశారా?

కాజల్ అగర్వాల్.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది ఈ భామ. తన కెరీర్ ముగిసింది అని అనుకుంటున్న తరుణంలో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. మళ్లీ అగ్రహీరోల సరసన చాన్సులు దక్కించుకుంటోంది. మూడు పదుల వయసు దాటినా.. తనలోని అందాన్ని మాత్రం ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటూ సూపర్ ఫిట్ నెస్ ను మెయిన్ టేన్ చేస్తోంది కాజల్. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, తేజ కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తోంది కాజల్.

ఇక అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా కాజల్ తన స్టన్నింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విటమిన్ సీ అంటూ హ్యాష్ టాగ్ ను జత చేసింది కాజల్. ఇక.. తన స్టన్నింగ్ ఫోటోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేయకుండా ఉండలేకపోతున్నారు. నిజంగానే నీ పిక్ స్టన్నింగ్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tuesday 27 November 2018

అమ్మా ఇలియానా.. నీకంత సీనుందా..?

ఒకప్పుడు టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న ఇలియానా ఇక్కడ ఆఫర్లు వదులుకుని బాలీవుడ్ వెళ్లాక ఆమె మీద ఉన్న క్రేజ్ తగ్గిపోయింది. పొకిరి టైంలో ఇలియానా తన సోయగాలతో తెలుగు ప్రేక్షకులను వల్లో వేసుకుంది. అయితే చాన్నాళ్ల తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇల్లి బేబి నటించినా ఇదవరకు అంత చార్మింగ్ అనిపించలేదు. అందుకుతోడు కాస్త లావెక్కడంతో అసలేమాత్రం బాగాలేదు.

సినిమాలో ఇలియానా ఉంటే కాస్త కూస్తో గ్లామర్ షో ఉండాల్సిందే.. కాని అమ్మడు అమర్ అక్బర్ ఆంటోనిలో అది కూడా చేయలేదు. అందుకే సినిమా వచ్చింది వెళ్లింది అన్నట్టుగా ఉంది. ఇక ఈ అమ్మడికి తెలుగులో ఛాన్సులు వస్తున్నా రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసి వదులుకుంటుందట. లేటెస్ట్ గా రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఇలియానాని అడిగారట.

ఈమధ్య కాస్త ఫాం తగ్గింది అనుకునే టైంలో హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ తో డబుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలానే వి.వి.ఆర్ కోసం ఇలియానాని అడిగితే అమ్మడు 60 లక్షల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. 5 నిమిషాల పాటకు ఆమెకు అంత అవసరం లేదని మేకర్స్ వెనక్కి తగ్గారట. తెలుగులో అవకాశాలు రావట్లేదని అంటున్న ఇలియానా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఇలా కాలదన్నుకుంటుంది. చరణ్ లాంటి స్టార్ హీరో ఛాన్స్ అన్న గోవా భామకు ఇక తెలుగు సినిమా అవకాశాలు కష్టమే అని చెప్పొచ్చు.

Monday 26 November 2018

జనవరి 1 తర్వాత మీ పాత డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవు.. ఎందుకంటే?

డిసెంబర్ 31, 2018.. ఇదే చివరి తేది. మీ పాత డెబిట్, క్రెడిట్ కార్డులు మార్చుకోవడానికి. లేదంటే జనవరి 1, 2019 నుంచి మీ పాత డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవు. అవును.. సెక్యూరిటీ పర్పస్‌లో పాత మాగ్నెటిక్ స్ట్రిప్ ఉన్న కార్డులను తీసేసి.. కొత్తగా ఈఎంవీ చిప్‌ను కార్డులకు అనుసంధానం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈఎంవీ అంటే యూరోప్లే-మాస్టర్‌కార్డ్-విసా అని అర్థం.
కొత్తగా చిప్‌తో వచ్చే కార్డుల్లో సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఫ్రాడ్ జరిగే చాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఆగస్ట్ 27, 2015నే పాత కార్డులను రీప్లేస్ చేయాలంటూ అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. సెప్టెంబర్ 1, 2015 నుంచి కార్డులను మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పటికీ కార్డులను మార్చుకోని వారు సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి మార్చుకోవచ్చు. లేదంటే.. నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయి.. సర్వీసెస్ సెక్షన్‌లో డెబిట్ కార్డు రిక్వెస్ట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.

Sunday 25 November 2018

లేట్ వయసులో ఘాటు అందాలు

Click to see the images
లేటు వ‌యసులో అగ్గి రాజేసే ముద్దుగుమ్మ‌ల జాబితాలో ఈ అమ్మ‌డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో చాలా మంది క‌థానాయిక‌లు ఈ త‌ర‌హానే అయినా శిల్పా సంథింగ్ స్పెష‌ల్. ఇదిగో ఈ లుక్ అందుకు ఎగ్జాంపుల్. సాగ‌ర క‌న్య‌ శిల్పా శెట్టి 45 వ‌య‌సులోనూ కాలేజ్ గాళ్ లుక్‌తో అద‌ర‌గొడుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ్ కుంద్రాను పెళ్లాడి ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మ‌ద‌ర్‌గా ఉన్నా.. ఇప్ప‌టికీ టీనేజీ యాటిట్యూడ్ తో ఉందంటూ నెటిజ‌నుల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎక్క‌డ ప‌బ్లిక్ వేడుక‌కు వెళ్లినా, లేదూ ఫంక్ష‌న్ల‌లో క‌నిపించినా శిల్పా అల్ట్రా మోడ్ర‌న్ లుక్‌పైనే సెటైర్లు ప‌డుతూనే ఉంటాయి. ఇటీవ‌లే దీపావ‌ళి పార్టీలో శిల్పా స్పెష‌ల్ లుక్‌తో ఆక‌ట్టుకుంది. అటుపై టూపీస్ బికినీలో శిల్పా ఇచ్చిన ఫోజులు ప్ర‌స్తుతం యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల‌పై లేటు వ‌య‌సు ఘాటు సుంద‌రి అంటూ యూత్ సెటైరిక‌ల్ వ్యాఖ్య‌ల్ని చేస్తున్నారు.
Click to see the images

Saturday 24 November 2018

ఆంటీగా మారుతున్న కాజల్

కాజల్ అగర్వాల్ ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. శంకర్ తదుపరి సినిమాలో ఆమె నటిస్తుంది. దర్శకుడు శంకర్ తన తదుపరి సింఎంగా భారతీయుడు 2 సినిమాని తీస్తున్నాడు. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా 20 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి సిక్వెల్.

ఈ సినిమాలో కమల్ వయసుమళ్ళిన సేనాపతి పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకి భార్యగా కాజల్ నటించనుంది. కమల్ హాసన్ భార్య అంటే దాదాపు ఆంటీ పాత్రనే. ఆమె గెటప్ కూడా మిడిల్ ఏజ్డ్ ఆంటీగానే ఉంటుందట. 32 ఏళ్ళు వచ్చినా.... కాజల్ ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తుంది.

అందుకే రానా, శర్వానంద్, బెల్లంకొండ వంటి యువ హీరోల సరసన కూడా నటిస్తుంది. అయితే ఇప్పుడు కమల్ సరసన తన ఏజ్ కంటే చాలా పెద్ద వయసు ఆంటీగా కనిపించాలి. వచ్చే నెలలో కమల్ పై శంకర్ కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నాడు. ఐతే కాజల్ మాత్రం జనవరి నుంచి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Wednesday 21 November 2018

మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా.. అర్జెంట్‌గా ఇది చదవండి..!

మీరు ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమరా? మీకు ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు నవంబర్ 30 వ తేదీలోగా మీ ఖాతాకు మొబైల్ నెంబర్‌ను లింక్ చేసుకోవాలి. లేదంటే మీరు మీ అకౌంట్‌కు సంబంధించి ఆన్‌లైన్ లావాదేవీలను చేసుకోలేరు. వాటిని బ్యాంక్ నిలిపివేయనుంది. ఈ విషయాన్ని బ్యాంకే స్పష్టం చేసింది. ఈ ప్రకటనను తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అంటే మీరు మీ మొబైల్ నెంబర్‌ను అకౌంట్‌కు ఈనెల 30 లోగా అనుసంధానం చేసుకోకపోతే డిసెంబర్ 1, 2018 నుంచి ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకోలేరు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. ఇప్పటి వరకు మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోని వాళ్లు సంబంధిత బ్యాంక్ శాఖలో కానీ.. లేదా ఏటీఏంలో గానీ లింక్ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది

Monday 19 November 2018

కోలీవుడ్ లో అవకాశం కొట్టేసిన కమెడియన్

టాలీవుడ్ లో కమెడియన్ గా సునీల్ మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆ తరువాత సునీల్ హీరో గా సినిమాలకు దగ్గరవ్వడం తో సునీల్ ప్లేస్ ని వెన్నెల కిషోర్ ని సొంతం చేసుకున్నారు . మెల్లి మెల్లిగా వెన్నెల కిషోర్ స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు . పెద్ద హీరో స్ తో తో వెన్నెల కిషోర్ నటిస్తూ ఇండస్ట్రీ లో మంచి పేరును సంపాదించుకున్నారు . తాజా సమాచారం ప్రకారం ఈ కమెడియన్ ఇప్పుడు కోలీవుడ్ లో మంచి ప్రాజెక్ట్ లో నటించేందుకు అవకాశాన్ని దక్కించుకున్నారు . శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న 'భారతీయుడు 2 ' సినిమా లో ఒక ముఖ్య పాత్రలో నటించేందుకు వెన్నెల కిషోర్ ఓకే చేసారు.

Monday 12 November 2018

హీరోయిన్ పెళ్లి ఫొటోల రేట్ రూ.18 కోట్లు?

బాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతూ ఉంది. ఇదే సీజన్లో నటి ప్రియాంక చోప్రా కూడా పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన నిక్ జోనస్ తో ఇప్పటికే ప్రియాంకకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తనకన్నా చాలా చిన్నవాడు అయిన నిక్ ను ప్రియాంక పెళ్లి చేసుకోబోతోందనేది తెలిసిన సంగతే. ఈ పెళ్లికి ఇరుపక్షాల పెద్దలూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నిశ్చితార్థం జరిగిపోయింది. ఇక పెళ్లి ఎప్పుడో ప్రకటించాల్సి ఉంది.

అయితే వీరి పెళ్లికి తేదీ ఖరారు అయ్యిందని, డిసెంబర్లో వీళ్ల పెళ్లి అని తాజాగా వార్తలు వస్తున్నాయి. వీరి వివాహ వేడుక భారీఎత్తున జరగనుందని.. ఏకంగా మూడురోజుల పాటు పెళ్లి జరగబోతోందని సమాచారం. ఈ వేడుకకు బాలీవుడ్, హాలీవుడ్ అతిరథులు హజరు కావచ్చని అంటున్నారు.

మరి అంతమంది ప్రముఖులు వస్తే.. ప్రియాంక, నిక్ జోనస్ లు వారి మధ్యన పెళ్లి చేసుకుంటే.. ఆ ఫొటోలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. నెటిజన్లు వాటి కోసం తెగ సెర్చ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థ ప్రియాంక పెళ్లి ఫొటోలపై మొత్తం రైట్స్ ను కొనేసిందని అంటున్నారు.

ఏకంగా 18 కోట్ల రూపాయల మొత్తానికి ప్రియాంక పెళ్లి ఫొటోలు, వీడియోలను అమ్మేసిందని.. బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది.

అందరిముందు కాజల్ ని కిస్ చేసాడు

"కవచం"లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ మరియు మెహ్రెయిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు, హైదరాబాద్ లో  ఈ టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. 

ఈ వేడుక లో చలనచిత్ర సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు వేదికపై తన అసభ్యకర రీతి లో కాజల్ ని హఠాత్తుగా ముద్దు పెట్టుకున్నాడు . 

Sunday 11 November 2018

2 ఓను లీక్ చేస్తామంటున్న తమిళ్ రాక్స్

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తాజా సినిమా 2.ఓ త్వరలో రాబోతుంది. అయితే ఈ సినిమాని లీక్ చేస్తామంటూ పైరసీ వెబ్ సైట్ తమిళ్ రాక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తమిళ్ రాక్స్ లో 2.ఓ త్వరలో రాబోతుందని ప్రకటించింది. దాంతో రజనీకాంత్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇలా చేయడం మంచిది కాదని అంటున్నారు. విజయ్ హీరోగా నటించిన సర్కార్ సినిమాని కూడా తమిళ్ రాక్ లీక్ చేసింది. అంతేకాదు బాలీవుడ్ సినిమా థగ్స్ అఫ్ హిందుస్థాన్ ను కూడా తమిళ్ రాక్స్ లీక్ చేసింది. ఒకవేళ నిజంగానే తమిళ్ రాక్స్ సినిమాని ఆన్లైన్ లో లీక్ చేస్తే తమిళ నిర్మాతలకు చాలా నష్టం జరుగుతుందని అంటున్నారు.

Thursday 8 November 2018

హాట్ టీజర్‌తో మరింత హీటెక్కించారు

వెంకట్, హృశాలి గోసవిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఎ1 ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రాయల్ చిన్నా, నాగరాజు (పంచలింగాల బ్రదర్స్) నిర్మించిన చిత్రం ‘రాయలసీమ లవ్‌స్టోరీ’. రామ్ రణధీర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

దీపావళి కానుకగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఓయ్ లవ్ చేస్తున్నా అని చెప్పా కదా ఏం చేశావ్.. అంటూ మొదలైన ‘రాయలసీమ లవ్ స్టోరీ’ టీజర్ మెల్లగా రొమాంటిక్ మోడ్‌లోకి వెళ్లి పోవడం.. హీరో హీరోయిన్లు బాత్ రూం టబ్‌లో నగ్నంగా కామక్రీడలో తేలిపోతూ ఒకరి పెదాలను ఒకరు పెనవేసుకుని శృంగార రసాన్ని వరదలా పారించారు. అనంతరం ఎమోషన్ టర్న్ తీసుకుని హీరోయిన్ హీరో చెంపపై చెళ్లుమనిపించి నన్ను మరిపో అని బ్రేకప్ చెప్పేసింది. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన హీరో ఎలా మరిచిపోమంటావురా.. అన్నీ అయిపోయినవి చేతితో అసభ్యంగా సైగ చేస్తూ కమెడియన్ వేణు చెంపని పగలగొట్టేశాడు.

ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ.. లెక్చరర్ పాత్రలో ‘ఇదిగో మీ లాంటి ఎదవల వల్లే.. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయి.. నిర్భయ కేసులు ఎక్కువైపోయాయ్’ అంటూ పంచ్‌లు పేల్చుతున్నాడు. ఇటీవల హీరో హీరోయిన్లు నగ్నంగా బాత్ టబ్‌లో పడుకుని ఉన్న మోషన్ పోస్టర్‌తో సినిమాపై హైప్ తీసుకువచ్చిన చిత్ర యూనిట్.. తాజా హాట్ టీజర్‌తో మరింత హీటెక్కించారు.

Blog Archive