Tuesday 16 November 2010

విజేత జగన్ !

అవినీతి విజేతలు
1.ఉత్తమ బలహీనమంత్రి
..-> రోశయ్య

2.ఉత్తమ విహారయాత్ర
1...->జగన్(ఓదార్పుయాత్ర).
2..->చిరంజీవి(ప్రజాచైతన్య యాత్ర)
3...->కె.సి.ఆర్.(తెలంగాణా జాగ్రుతి యాత్ర)

3.ఉత్తమ అవినీతి.
1...->యై.యస్.జగన్ (3 1/2 సంవత్సరాలు+45 కోట్లు=3,583 కోట్లు)
2...-> ఎమ్మార్ ఎంజిఎఫ్.
3...->సురేష్ కల్మాడి(కామన్వెల్త్ క్రీడలు2010) .

3.ఉత్తమ చెత్త మీడియా
1...->సాక్షి.
2..->ఎన్ టీ.వీ.
3..->టీ.వీ.5 .

మీకు తెలుసా!


మీకు తెలుసా! ఈప్రపంచంలో అత్యంత పేదవాడెవరో,
మీకు తెలుసా! గత ఏడాది బాగా నష్టపోయిన కంపనీల గురించి,
మీకు తెలుసా! పోనీ గత ఏడాది దివాలా తీసిన 500 ప్రముఖ సంస్థల గురించి,
మీకు తెలుసా! ఎంత బాగా కష్టపడినా విజయం సాధించలేని మనుషుల గురించి,
మీకు తెలుసా! ఎంత అరచి గీపెట్టినా ఫలితం సాధించలేని ఉద్యమాల గురించి,
మీకు తెలుసా! బ్రతకటానికి ఏమాత్రం అనువుగా లేని దేశాలగురించి,
మీకు తెలుసా! చావు తప్ప వేరే దారి చూపించలేకపోతున్న వృత్తుల గురించి,
మీకు తెలుసా! ఏ మాత్రం తెలివి సంపాదించలేకపోతున్న చదువులగురించి?

ఎవేవీ పట్టని ఓ ఇంగ్లీష్ మాగజిన్ ప్రపంచంలోని 'అత్యంత శక్తివంతులైన వ్యక్తుల జాబితా' ను ఇటీవల విడుదల చేసి తనేదో ఘనత సాధించినట్టు గొప్పలు చెప్పుకుంది.
ఇలాంటి జాబితాలను విడుదల చేసి మిగతావాళ్ళను అవమానించడం అవసరమా?
ఈ ప్రపంచంలోని అత్యంత పేదవాళ్ళ జాబితాను కూడా విడుదల చేసి అప్పుడుచాటుకుంటే బాగుంటుంది వారి ఘనత.

పాజిటివ్ వైరాగ్యం!


కోపమొచ్చినప్పుడల్లా అంకెలు లెక్కపెట్టీ పెట్టీ విసుగొచ్చేసింది ఆయనకు.
పళ్ళు నూరాలనిపించినపుడల్లా పళ్ళు కనపడేలా నవ్వీ నవ్వీ అలసిపోయాడాయన.
ఆవేశాన్ని అనచుకోవాల్సొచ్చినపుడల్లా..శ్వాస మీద ధ్యాస పెట్టీ పెట్టీ ఊపిరి పీల్చుకోవడం మీదే విరక్తి వచ్చేసిందిఆయనకు.
వెధవ జీవితం.కోపం మంచిది కాదట.ఏడుపు,ధుఖం మనిషికి ఉండాల్సిన లక్షణాలే కావట.నిరాశను గుండు గుత్తగాఅంగారక గ్రహానికి ఎగుమతి చేయాలట.దేనిమీద విరక్తి కలిగినా విజేతల జీవితాల గురించి చదవాలంట.గడ్డిపోచనుండిధైర్యాన్నీ,గబ్బిలం నుండి తలక్రిందులుగా వేలాడె విద్యను….ఇలా ఏవేవో నేర్చుకోవాలట.పాజిటివ్ ఆలోచనల్నిఎండార్ఫిన్లుగా మార్చుకొని బతకాలట..ఊహు..!తనకోపము తన ఇష్టం అనుకున్నాడాయన.కానీ,తన కోపమే తనశత్రువని మరచిపోలేదాయన.
ఆలోచించగా చించగా ఆయనకు ఒక ఉపాయం తోచింది.
ఓ డ్రామా దుస్తుల కంపనీకి వెళ్ళి సెకండ్ హాండ్ దుస్తులను కొని ఇంటికి పట్టికెళ్ళాడు.
మర్నాటినుంచి చీటికీ మాటికీ తలుపులు బిడాయించుకోవడం మొదలుపెట్టాడు.ముఖ్యంగా పేపర్లుచదివినప్పుడు,వార్తల్ని చూసినపుడు లేచి లోపలికి వెళ్ళిపోయేవాడు.రాజశేఖరరెడ్డి మీద కోపం వచ్చినపుడుచంద్రబాబులా,చంద్రబాబు మేద కోపం వచ్చినపుడు రాజశేఖరరెడ్డిలా,పోలీసు మీద కొపం వఛి నపుడునక్సలైటులా,నక్సలైటుమీద కోపం వఛినపుడు పోలీసులా,టీచరుమీద కోపం వచ్చినపుడు విద్యార్దిలా,విద్యార్ది మీదకోపం వచ్చినపుడు టీచరులా,అమెరికా మీద కోపం వచ్చినపుడు ఇరాక్ లా,పిల్లి మీద కోపం వచ్చినపుడుఎలుకలా,మనిషిమీద కోపం వచ్చినపుడు ప్రక్రుతి లా…ఇలా గంట గంటకూ వేషం మార్చి అద్దం ముందు నిలబడి నోరారాఅవతలి వ్యక్తిని తిట్టి అన్ని బావోద్వేగాలనుండి విముక్తుడవటం నేర్చుకున్నాడు.
ఏడుపు ధుఖం నిరాశ వగైరాలన్నీ కోపం నుండే కదా పుట్టెది.
ఇప్పుడు ఆయన కోపమే ఆయనకు రక్ష.

పాజిటివ్ వైరాగ్యం!




కోపమొచ్చినప్పుడల్లా అంకెలు లెక్కపెట్టీ పెట్టీ విసుగొచ్చేసింది ఆయనకు.
పళ్ళు నూరాలనిపించినపుడల్లా పళ్ళు కనపడేలా నవ్వీ నవ్వీ అలసిపోయాడాయన.
ఆవేశాన్ని అనచుకోవాల్సొచ్చినపుడల్లా..శ్వాస మీద ధ్యాస పెట్టీ పెట్టీ ఊపిరి పీల్చుకోవడం మీదే విరక్తి వచ్చేసిందిఆయనకు.
వెధవ జీవితం.కోపం మంచిది కాదట.ఏడుపు,ధుఖం మనిషికి ఉండాల్సిన లక్షణాలే కావట.నిరాశను గుండు గుత్తగాఅంగారక గ్రహానికి ఎగుమతి చేయాలట.దేనిమీద విరక్తి కలిగినా విజేతల జీవితాల గురించి చదవాలంట.గడ్డిపోచనుండిధైర్యాన్నీ,గబ్బిలం నుండి తలక్రిందులుగా వేలాడె విద్యను….ఇలా ఏవేవో నేర్చుకోవాలట.పాజిటివ్ ఆలోచనల్నిఎండార్ఫిన్లుగా మార్చుకొని బతకాలట..ఊహు..!తనకోపము తన ఇష్టం అనుకున్నాడాయన.కానీ,తన కోపమే తనశత్రువని మరచిపోలేదాయన.
ఆలోచించగా చించగా ఆయనకు ఒక ఉపాయం తోచింది.
ఓ డ్రామా దుస్తుల కంపనీకి వెళ్ళి సెకండ్ హాండ్ దుస్తులను కొని ఇంటికి పట్టికెళ్ళాడు.
మర్నాటినుంచి చీటికీ మాటికీ తలుపులు బిడాయించుకోవడం మొదలుపెట్టాడు.ముఖ్యంగా పేపర్లుచదివినప్పుడు,వార్తల్ని చూసినపుడు లేచి లోపలికి వెళ్ళిపోయేవాడు.రాజశేఖరరెడ్డి మీద కోపం వచ్చినపుడుచంద్రబాబులా,చంద్రబాబు మేద కోపం వచ్చినపుడు రాజశేఖరరెడ్డిలా,పోలీసు మీద కొపం వఛి నపుడునక్సలైటులా,నక్సలైటుమీద కోపం వఛినపుడు పోలీసులా,టీచరుమీద కోపం వచ్చినపుడు విద్యార్దిలా,విద్యార్ది మీదకోపం వచ్చినపుడు టీచరులా,అమెరికా మీద కోపం వచ్చినపుడు ఇరాక్ లా,పిల్లి మీద కోపం వచ్చినపుడుఎలుకలా,మనిషిమీద కోపం వచ్చినపుడు ప్రక్రుతి లా…ఇలా గంట గంటకూ వేషం మార్చి అద్దం ముందు నిలబడి నోరారాఅవతలి వ్యక్తిని తిట్టి అన్ని బావోద్వేగాలనుండి విముక్తుడవటం నేర్చుకున్నాడు.
ఏడుపు ధుఖం నిరాశ వగైరాలన్నీ కోపం నుండే కదా పుట్టెది.
ఇప్పుడు ఆయన కోపమే ఆయనకు రక్ష.

సత్యమా…సాహసమా!


త్రూత్ ఆర్ డేర్ అని ఇంగ్లీషువాళ్ళు ఆడుకొనే ఆట ఒకటి ఉంది.పిల్లలు,పెద్దలు అందరూ ఆడుతారు దీన్ని.
ఐదుమంది పదిమంది ఎందరైనా ఆడొచ్చు.ప్రతి ఒక్కరికీ చాన్స్ ఉంటుంది.ఎవరి వంతు వస్తే వాళ్ళను సత్యమా సాహసమా అని అడుగుతారు.సత్యమని చెపితే వాళ్ళు జవాబు చెప్పడానికి ఇబ్బందిపడే ప్రశ్న ఏదో అడుగుతారు.నిజమే చెప్పాలి,లేదా నిజంలా ద్వనించే జవాబు చెప్పలి.ఒకవేళ ప్రశ్న వద్దనుకొంటే ఏదో ఒక సాహసం చేసి చూపాలి.మొదటిది త్రూత్,రెండోది డేర్ అన్నమాట.
ఏ ఆటను మనం కాస్త సీరియస్ గా ఆడుకొన్నామనుకోండి.
ఉదాహరనకు నిజం నిప్పులాంటిదని ఎందుకు అంటారు?గాలిలాంటిదనో,వానలాంటిదనో,మెరుపులాంటిదనో,ఉరుములాంటిదనో ఎందుకు అనరు?పోనీ ప్రాస కోసం అంటారనుకొంటే నీళ్ళ లాంటిదనొచ్చుగా.వర్షంలా భూమ్మేద పడినపుడు ఒకలా,నదిలో చేరి ప్రవహించినపుడు ఒకలా,చెరువులో నిలిచిపోయినపుడు ఒకలా,మురికిగుంటలో నిలవున్నపుడు ఒకలా,ఆకులనుంచి బొట్లు బొట్లుగా పడినపుడు ఒకలా కనపడుతుందని దానికి ఎన్ని విశేషనాలు జోడించే అవకాశం ఉంది.!
నిజం నిప్పులా ఉంటుందనటంలో ఇంకో అస్పష్టత ఉంది.
ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడిగితే ఏమని జవాబు చెప్పలి?
సత్యం మాట్లాడి చరిత్రకెక్కినవాళ్ళు దేశంలో ఇద్దరే ఇద్దరు ఎందుకున్నారు?
ట్రూత్ వదిలేసి డేర్ కి వెలదామనుకొంటే అవి రెండూ వేరు వేరు అనిపించడంలేదు.మరి ఆ ఆటకు ఆ పేరు ఎందుకు పెట్టారో..?

తెలుగునూ మింగేస్తున్న రాజకీయం

ఆత్మాభిమానం,గౌరవం- ఇవి వేరెవరో వచ్చి రక్షించేవి కాదు,ఎవరికి వారేవాటిని కాపాడుకోవాలని ప్రబోదించారు మహాత్మాగాంధి.వ్యక్తికే కాదు జాతికీ వర్తిస్తుంది స్పూర్తి.
దాదాపు 30 ఏళ్ళ నాడు అప్పటి ప్రధాని కొడుకుగా మన రాష్ట్ర పర్యటనకువచ్చి మన ముఖ్యమంత్రిని అవమానించిన రాజివ్ ఉదంతం తెలుగువాళ్ళింకా మరువలేదు.నాటి ఘటననుమర్చిపోయిన కొందరు నేతలు సోనియాను ప్రసన్నం చేసుకునేందుకు రాజివ్ నామ జపంతో తరించిపోతున్నారు.అమ్మదయ ఊంటే తప్ప రాజకీయంగా మెతుకూ,బ్రతుకూ ఉండదని దిగాలు పడే కొందరు నేతలు ఇప్పటికే రాష్ట్రంలోనిపతకాలన్నింటికీ రాజివ్,ఇందిర పేర్లు తగిలించేశారు.
రెండేళ్ళక్రితం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందు తెలుగుకు ప్రాచీన బాషా హోదా కల్పిస్తూ కేంద్రం నిర్నయంప్రకటించినపుడు అదంత తమ గొప్పేనని మన రాష్ట్ర ప్రభుత్వం టాం..టాం..వేసుకుంది.మన రాష్ట్రంలోని ఏకైకఅంతర్జాతీయ విమానాశ్రయానికి మన తెలుగు వారి పేరు పెట్తడానికి నిరాకరించి రాజివ్ భజనతో తరించిన ప్రభుత్వంఆత్మాభిమానం తమకు ఏ కోశానాలేదని ఎప్పుడో చాటుకుంది.
దేశ సేవలో తరించిన తెలుగువారెవరూ లేరన్నట్టుగా పధకాలన్నింటికీ రాజివ్,ఇందిర ల పేర్లు పెట్టడం మన ప్రభుత్వపనితనానికి పరాకాష్ట.
తెలుగుజాతి ఔనత్త్యాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం వాటన్నింటినీ గాలికొదిలేసి తెలుగు జాతి ప్రతిష్టనుమంటగొల్పింది.తెలుగుగడ్డపై పుట్టిన ఈప్రభుత్వ నేతలకు తెలుగు పనికిరానిదైపోయింది.

హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లోని తెలుగు లలిత కళాతోరణం పేరు ఇప్పుడు రాజివ్ తెలుగు లలిత కలా తోరణంగామారిపోయింది.
తెలుగులలితకళతోరనం పేరు ముందు రాజివ్ పేరు తగిలించి ఈ ప్రభుత్వం తాజాగా తనకు తెలుగుపై వున్న 'చిత్తశుద్ధినిచాటుకుంది.ఇలాంటి ఈ ప్రభుత్వాన్ని క్షమిస్తే తెలుగుతల్లి ఆత్మ క్షోభిస్తుంది.

తెలుగునూ మింగేస్తున్న రాజకీయం



ఆత్మాభిమానం,గౌరవం- ఇవి వేరెవరో వచ్చి రక్షించేవి కాదు,ఎవరికి వారేవాటిని కాపాడుకోవాలని ప్రబోదించారు మహాత్మాగాంధి.వ్యక్తికే కాదు ఓజాతికీ వర్తిస్తుంది ఆ స్పూర్తి.
దాదాపు 30 ఏళ్ళ నాడు అప్పటి ప్రధాని కొడుకుగా మన రాష్ట్ర పర్యటనకువచ్చి మన ముఖ్యమంత్రిని అవమానించిన రాజివ్ ఉదంతం తెలుగువాళ్ళింకా మరువలేదు.నాటి ఘటననుమర్చిపోయిన కొందరు నేతలు సోనియాను ప్రసన్నం చేసుకునేందుకు రాజివ్ నామ జపంతో తరించిపోతున్నారు.అమ్మదయ ఊంటే తప్ప రాజకీయంగా మెతుకూ,బ్రతుకూ ఉండదని దిగాలు పడే కొందరు నేతలు ఇప్పటికే రాష్ట్రంలోనిపతకాలన్నింటికీ రాజివ్,ఇందిర పేర్లు తగిలించేశారు.
రెండేళ్ళక్రితం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందు తెలుగుకు ప్రాచీన బాషా హోదా కల్పిస్తూ కేంద్రం నిర్నయంప్రకటించినపుడు అదంత తమ గొప్పేనని మన రాష్ట్ర ప్రభుత్వం టాం..టాం..వేసుకుంది.మన రాష్ట్రంలోని ఏకైకఅంతర్జాతీయ విమానాశ్రయానికి మన తెలుగు వారి పేరు పెట్తడానికి నిరాకరించి రాజివ్ భజనతో తరించిన ప్రభుత్వంఆత్మాభిమానం తమకు ఏ కోశానాలేదని ఎప్పుడో చాటుకుంది.
దేశ సేవలో తరించిన తెలుగువారెవరూ లేరన్నట్టుగా పధకాలన్నింటికీ రాజివ్,ఇందిర ల పేర్లు పెట్టడం మన ప్రభుత్వపనితనానికి పరాకాష్ట.
తెలుగుజాతి ఔనత్త్యాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం వాటన్నింటినీ గాలికొదిలేసి తెలుగు జాతి ప్రతిష్టనుమంటగొల్పింది.తెలుగుగడ్డపై పుట్టిన ఈప్రభుత్వ నేతలకు తెలుగు పనికిరానిదైపోయింది.

హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లోని తెలుగు లలిత కళాతోరణం పేరు ఇప్పుడు రాజివ్ తెలుగు లలిత కలా తోరణంగామారిపోయింది.
తెలుగులలితకళతోరనం పేరు ముందు రాజివ్ పేరు తగిలించి ఈ ప్రభుత్వం తాజాగా తనకు తెలుగుపై వున్న 'చిత్తశుద్ధినిచాటుకుంది.ఇలాంటి ఈ ప్రభుత్వాన్ని క్షమిస్తే తెలుగుతల్లి ఆత్మ క్షోభిస్తుంది.

జల జాబిల్లి

చంద్రుడి మీద నీళ్ళున్నాయని తెలియగానే చాలమంది బుర్రల్లో కొత్త ఆలోచనలు తళుక్కుమన్నాయి.
మల్టీనేషనల్ కంపెనీలు ముందుచూపుతో మల్టీప్లానిటరీ కంపనీలుగా పేరు మార్చుకొని అన్నిరకాల ఫాక్టరీల కోసం గనుల కోసం,సెజ్ ల కోసం దరఖాస్తులు పెట్టేసుకొన్నాయి.
ఇన్ ఫ్రాడవలప్ మెంట్ కంపెనీలన్నీ కలసి కన్సార్టియంగా ఏర్పడి రోడ్లు,విమానాశ్రయాలూ,హౌసింగ్ కాలనీలు,ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడానికి టెండర్లు సిద్దం చేసుకోసాగాయి.
శాస్త్రవిగ్నానంలో చంద్రుడిగురించి వున్న సమాచారాన్నంతా క్రోడీకరించి అక్కడికి వెళ్ళడానికి అవసరమైన పరికరాలూ,వస్తువుల్నీ డిజైన్ చేయడంలో మానిఫాక్చరింగ్ ఇండస్ట్రీ యమ బిజీగా ఉంది.
ఆన్ని ప్రపంచ బాషల్లో చంద్రుడిమీద ఉన్న కథలూ,కాకరకాయలూ కలిపి ఓ వెయ్యి పుస్తకాల సెట్ ను ముద్రించే పనిలో పడ్డారు పబ్లిషర్లు.
ఇదంతా చంద్రుదికి ఎలాగో తెలిసింది.ఎలాగో ఏమిటిలే మనం ఇంత దూరమ్నుండి అక్కడి నీటి వాసనను పసిగట్టగాలేనిది అది ఓ వెన్నెల రాత్రి భూమి మీద జరిగే విషయాలను తెలుసుకోలేదా ఏమిటి?వెంటనే నాసాకు ఏవో సంకేతాలు పంపింది.వాటిని డీకొడ్ చేసి చదివితే అర్దమైందేమిటంటే-
ఇంతకాలం ఒక కుందేలు,ఒక అవ్వ మాత్రమె ఉందని నమ్మిన మీరు ఇప్పుడు ఆ అబిప్రాయం ఎందుకు మార్చుకొన్నారు?
మీ ద్రుష్టిలో ఎవర్ని నేను అసలు?సూర్యుడి బార్యనా,చెల్లెల్నా,భూమి కూతుర్నా,అమ్మనా?ఆడదాన్న,మగవాడీనా?మంచిదాన్నా,చెడ్డదాన్నా?తేల్చుకున్నరా ఇప్పుడైనా?నన్ను చూస్తే సముద్రాలు పొంగుతాయని మీరే అంటారు.మనుషుల్లో ఉన్మాదం పెచ్చుమీరుతుందని మేరే అంటారు.ఏది నిజం?
నాలో అమ్రుతం ఉందని ఊహించిందీ మేరే,మట్టి తప్ప మరేమీ లేదని కనిపెట్టిందీ మెరె.నా వ్రుద్ది క్ష్యాలకు బోలెడన్ని అర్దాలు చెప్పె మీరు ,అప్పుడప్పుడూ వచ్చే గ్రహనాలకే బయపడె మీరు,అవన్నీ మర్చిపోయి ఏ ధైర్యంతొ నా దగ్గరకు వచ్చి నా మీదె నివాసం ఉండాలనుకుంతున్నరు?
అయినా నా దగ్గర ఉంది పిడికెడు నీరు.అది కూడా టన్నుల కొద్దీ నా మట్టిని పిండితే వచ్చే నీరు.మా సౌరకుటుంబమంతా కలసి మీ కోసం అంత జలరాసిని స్రుష్టించి ఇచ్చినా మీకు సరిపోలేదా?
ఓక మాట చెప్పనా ..ఆ కాస్త నీరె నన్ను చల్లగా ఉంచుతుంది.ఆ చల్లదనంతోనే మీకు సుఖమైన నిద్రను ఇస్తాను.దాన్ని కోల్పోవడానికి కూడా సిద్దపడుతున్నారె మీరు!
ఆంతే ఉంది అందులో .ఆ తరువాత నాలుగు కన్నీటి చుక్కలు కనిపించాయి.ఎంత మట్టిని పిండి పంపిందో పాపం.!

Saturday 25 September 2010

ఇదే అదృష్టం!

ఇదే అదృష్టం
స్వైన్ ఫ్లూ రోజుల్లో ఒట్టి ఫ్లూ రావడమే అదృష్టం.
గుండె పోట్ల రోజుల్లో గుండె కేవలం రివర్సయి డెంగూ గా రావడమే అదృష్టం.
టీవి చూసి గుండె ఆగే రోజుల్లో కరెంటు కోత ఉండటమే అదృష్టం.
టెర్రరిస్టులకు భయపడే రోజుల్లో జేబుదొంగలు తారసపడటమే అదృష్టం.
బ్యాంకులు దివాలా తీసే రోజుల్లో డబ్బులు లేకపోవడమే అదృష్టం.
ఉద్యోగాలు పోయే రోజుల్లో చదువులేకపోవడమే అదృష్టం.
అమెరికాకు ఆర్దికమాంద్యం వచ్చిన రోజుల్లో వీసా దొరకకపోవడమే అదృష్టం.
కందిపప్పు కొనలేని రోజుల్లో దానికి రుచి లేకుందా పోవడమే అదృష్టం.
సన్నబియ్యం దొరకని రోజుల్లో సన్నబడాల్సిరావడమే అదృష్టం.
ఆడపిల్లల్ని కననివ్వని రోజుల్లో గర్భం దాల్చకపోవడమే అదృష్టం.
ప్రేమికులు ఆసిడ్ బాటిళ్ళతో తిరిగే రోజుల్లో ఎవరి ప్రేమకూ నోచుకొకపోవడమే అదృష్టం.
మానసిక సౌందర్యాన్ని గుర్తించలేని రోజుల్లో శారీరక సౌందర్యం లేక పోవడమే అదృష్టం.
పెళ్ళిళ్ళ ఖర్చు ఆకాశాన్నంటే రోజుల్లో పెళ్ళికొడుకులూ ,కూతుళ్ళు దొరకకపోవడమే అదృష్టం.
స్వయంగా మొగుళ్ళే యముళ్ళుగా మారుతున్న రోజుల్లో అనాదలుగా బ్రతకడమే అదృష్టం.
వర్షాలు పడని రోజుల్లో వలస పోగలగటమే అదృష్టం.
నాయకులు లేని రోజుల్లో వినాయకుడు ఉండటమే అదృష్టం.
పుట్టగొడుగులమద్య బ్రతికే రోజుల్లో నిజం గొడుగు క్రింద నిలబడగలగటమే అదృష్టం.
తలవంచి బ్రతకడం తప్పనిసరైన రోజుల్లో తలల్లో ఏమీ లేకుండా ఉండటమే అదృష్టం.
అబద్దాలు ప్రచారమయ్యే రోజుల్లో నిజాలు నిలకడమీద తలుస్తాయని ఆశించడమే అదృష్టం.
నేరుగా తిట్టలేని రోజుల్లో పిట్టకధలు చెప్పి కోపం తీర్చుకోగలగటమే అదృష్టం.

Wednesday 22 September 2010

ఒక శ్రీకాకుళం లెక్క!


సండే కామెంట్
ఒక శ్రీకాకుళం లెక్క

ఎన్ని చాక్లెట్లు, ఐస్‌క్రీములు తింటే ఒక పిల్లవాడికి మొహం మొత్తుతుంది?
ఎన్ని దెబ్బలు తిన్నాక ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది?
ఎన్ని వృత్తులు నాశనమైతే ఒక డిగ్రీ చేతికి వస్తుంది?
ఎన్ని ప్రశంసలు లభిస్తే ఒక రచయిత సంతృప్తి చెందుతాడు?
ఎన్ని గుంటలు పడితే ఒక రోడ్డును ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపిస్తారు?
ఎన్ని ఫ్లైఓవర్లు కడితే ఒక నగరం తన పేరును మార్చుకుంటుంది?
ఎన్ని ఉద్యమాలు జరిగితే ఒక రాష్ట్రం అవతరిస్తుంది?

ఎంత పని చేశాక ఒక శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది?
ఎంత డబ్బు జేబులో ఉంటే ఒక మనిషికి ధైర్యం వస్తుంది?
ఎంత ప్రయాణం పూర్తయితే గమ్యస్థానం ఏమిటో తెలుస్తుంది?
ఎంత స్తబ్ధత తర్వాత ఒక సమాజం మేలుకుంటుంది?
ఎంత అవినీతి జరిగితే దేవుడు కొత్త అవతారం ఎత్తుతాడు?
ఎంత మంచితనం జతపడితే ఒక సమాజం బాగుపడుతుంది?

***

ఇలాంటి గణాంకాలు కూడా చెప్పే శాస్త్రవేత్తలు ఎప్పుడు వస్తారో!

***

ఆ మధ్య శ్రీకాకుళంలో - కోటానుకోట్ల మంది వచ్చినారు బాబూ అని ఒకావిడ చాలా గొప్పగా చెప్పింది.
కోటానుకోట్ల మంది ఏమిటే లక్షలాది లక్షల మంది వచ్చారు అన్నదట రెండో ఆవిడ ఇంకా గొప్పగా.
లక్షలాది లక్షల మంది కాదే వేలాది వేల మంది వచ్చారంది ఇదంతా వింటున్న మూడో ఆవిడ మరింత గొప్పగా.
వాళ్లు లెక్కలు తెలియక అలా అంటున్నారనుకుంటున్నారా?
కాని లెక్కలు తెలిసిన అభివృద్ధి శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి లెక్కలే వేస్తున్నారే!

Friday 3 September 2010

‘ఓదార్పు’

‘ఓదార్పు’ టూరిజం
‘ఓదార్పు’ టూరిజం
ట్రావెల్ ఎజెన్సీల దగ్గర ఈమధ్య విపరీతంగా జనం. ఉప ఎన్నికల కాలం కాబట్టి సహజమేనని ముందు ఎవరూ పట్టించుకోలేదు. ఈవెంట్ మెనేజర్ల దగ్గరా అదే పరిస్తితి.తీర్దయాత్రలకాలం కాబట్టి ఇదీ సహజమేనని ఎవరూ పట్టించుకొలేదు. పెళ్ళిళ్ళు,వార్షికొత్సవాలూ జరిగేకాలమూ కాదు.
బస్టాండులకు వెళ్ళినా,రైల్వే స్టేషన్లకు వెళ్ళినా సేం టు సేం.టిక్కెట్లన్నీ ఎప్పుడో అయిపోయాయి.పైగా బస్సులు బస్సులుగా,బొగీలు బొగీలుగా రిజర్వు అయిపోయి ఉన్నాయి.
ఏమిటీ జనం ఇంతలా టురిజం మీద పడ్డారు ?
అని ప్రభుత్వం,దాని అధికారులు కాస్త ఆశ్చర్యపోయారు.బాధలకు,ఎండలకు,వానలకూ తట్టుకొలేక తిరుపతి,కాశీ,షిర్డీ,పూరి జగన్నధ యాత్రలకో,అమరనాధ యాత్రలకో పొతున్నట్టున్నారు అనుకున్నరు వాల్లంతా. కాని జనం వెలుతున్న ఊర్ల పేర్లు చూసి మహా ఆశ్చర్యపోయారు.ఆ ఊళ్ళలో టురిజం ఏముందీ.. అందులొనూ వానాకాలంలొ?
ట్రవెల్ ఎజెన్సీల వాళ్ళనడిగారు.బస్సు ఆపరెటర్ల నడిగారు.ఈవెంట్ మెనెజర్ల నడిగారు.అందరూ రెట్లు,ఏర్పాట్ల గురించె చెప్పారు.కుటుంబాలకు కుటుంబాలు,ఊళ్ళకు ఊళ్ళు వెలుతున్నరు ఏమిటీ సంగతీ అనడిగారు.
‘ఓదార్పు యాత్ర’ చెప్పారు వాళ్ళు.‘ఎవర్ని ఓదార్చటానికీ?’
‘మాలాగే నీళ్ళు దొరక్క ఇబ్బంది పడుతున్న జనాన్ని,
మాలాగే గిట్టుబాటు ధరలు దొరక్క అవస్తలు పడుతున్న రైతుల్ని,
మాలాగే వైద్యం దొరక్క కష్టపడుత్టున్న ప్రజల్ని,
మాలాగే అధిక దరలతొ సతమతమవుతున్న మనుషుల్ని,
మాలాగే అప్పుల్లొ కూరుకుపోయిన ప్రజానికాన్ని,
మాలాగే భూములు కోల్పోతున్న భాదితుల్ని
పరామర్శించడానికి,ఓదార్చటానికి,ధైర్యం చెప్పటానికి వెళుతున్నాం’
అనిచెప్పారు వాళ్ళు.

‘ఓదార్పు’

‘ఓదార్పు’ టూరిజం

ట్రావెల్ ఎజెన్సీల దగ్గర ఈమధ్య విపరీతంగా జనం. ఉప ఎన్నికల కాలం కాబట్టి సహజమేనని ముందు ఎవరూ పట్టించుకోలేదు. ఈవెంట్ మెనేజర్ల దగ్గరా అదే పరిస్తితి.తీర్దయాత్రలకాలం కాబట్టి ఇదీ సహజమేనని ఎవరూ పట్టించుకొలేదు. పెళ్ళిళ్ళు,వార్షికొత్సవాలూ జరిగేకాలమూ కాదు.
బస్టాండులకు వెళ్ళినా,రైల్వే స్టేషన్లకు వెళ్ళినా సేం టు సేం.టిక్కెట్లన్నీ ఎప్పుడో అయిపోయాయి.పైగా బస్సులు బస్సులుగా,బొగీలు బొగీలుగా రిజర్వు అయిపోయి ఉన్నాయి.
ఏమిటీ జనం ఇంతలా టురిజం మీద పడ్డారు ?
అని ప్రభుత్వం,దాని అధికారులు కాస్త ఆశ్చర్యపోయారు.బాధలకు,ఎండలకు,వానలకూ తట్టుకొలేక తిరుపతి,కాశీ,షిర్డీ,పూరి జగన్నధ యాత్రలకో,అమరనాధ యాత్రలకో పొతున్నట్టున్నారు అనుకున్నరు వాల్లంతా. కాని జనం వెలుతున్న ఊర్ల పేర్లు చూసి మహా ఆశ్చర్యపోయారు.ఆ ఊళ్ళలో టురిజం ఏముందీ.. అందులొనూ వానాకాలంలొ?
ట్రవెల్ ఎజెన్సీల వాళ్ళనడిగారు.బస్సు ఆపరెటర్ల నడిగారు.ఈవెంట్ మెనెజర్ల నడిగారు.అందరూ రెట్లు,ఏర్పాట్ల గురించె చెప్పారు.కుటుంబాలకు కుటుంబాలు,ఊళ్ళకు ఊళ్ళు వెలుతున్నరు ఏమిటీ సంగతీ అనడిగారు.
‘ఓదార్పు యాత్ర’ చెప్పారు వాళ్ళు.‘ఎవర్ని ఓదార్చటానికీ?’
‘మాలాగే నీళ్ళు దొరక్క ఇబ్బంది పడుతున్న జనాన్ని,
మాలాగే గిట్టుబాటు ధరలు దొరక్క అవస్తలు పడుతున్న రైతుల్ని,
మాలాగే వైద్యం దొరక్క కష్టపడుత్టున్న ప్రజల్ని,
మాలాగే అధిక దరలతొ సతమతమవుతున్న మనుషుల్ని,
మాలాగే అప్పుల్లొ కూరుకుపోయిన ప్రజానికాన్ని,
మాలాగే భూములు కోల్పోతున్న భాదితుల్ని
పరామర్శించడానికి,ఓదార్చటానికి,ధైర్యం చెప్పటానికి వెళుతున్నాం’
అనిచెప్పారు వాళ్ళు.


Monday 23 August 2010

ఒక షార్కూ ... తాజా చేపలూ!


ఒక షార్కూ ... తాజా చేపలూ

జపాన్ వాళ్లకు చేపలంటే భలే ఇష్టం. చుట్టూ సముద్రమే కాబట్టి వాళ్లకు కావాల్సిన దానికంటే ఎక్కువ చేపలే దొరుకుతుండేవి ఇన్నాళ్లూ. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.
దగ్గరి సముద్ర జలాల్లో చేపలు దొరకడం మానేసాయి. కాలుష్యమో థర్మల్ ప్లాంట్లో ఏదో కారణమన్నారు.
మత్స్యకారులు చేపల కోసం దూరం వెళ్లాల్సి వచ్చింది. చిన్న పడవలు సరిపోక పెద్దవి చేయించుకున్నారు.
అక్కడ చేపలైతే దొరికాయి. కాని అంత దూరం నుండి తెచ్చేసరికి తాజాతనం ఉండక జనం కొనలేదు.
ఫిషింగ్ కంపెనీలు రంగప్రవేశం చేసి తమ పడవలకు ఫ్రీజర్లు అమర్చుకున్నాయి. దాంట్లో చేప్చల్ని భద్రపరిచి తెచ్చి అమ్మినా జనం కొనలేదు. ఎందుకంటే ఫ్రోజెన్ చేపలు నచ్చలేదు వాళ్లకు. దాంతో ఆ చేపల్ని తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చేది. ఈసారి కంపెనీల వాళ్లు పడవల్లోనే నీళ్ల ట్యాంకులు ఏర్పాటు చేసుకుని వాటిల్లో చేపలు వేసి తీసుకురాసాగారు. అయితే వాటిల్లో ఈదడానికి కాదు కదా కదలడానికి కూడా చోటు ఉండకపోవడంతో చేపలు మందకొడిగా తయారై తాజాదనం కోల్పోయేవి. జపాన్‌వాళ్లకు వాటి రుచీ నచ్చలేదు. అప్పుడు కంపెనీలు ఏం చేశాయో తెలుసా! ఆ ట్యాంకుల్లో మామూలు చేపలతో పాటు ఒక షార్క్ చేపనీ వేయసాగాయి. షార్క్ సంగతి తెలుసుగా మీకు? చేపలే దాని ఆహారం. షార్క్‌లు చేపల్ని తినేస్తే మరి వాళ్లకు ఏమిటి లాభం అనకండి. ఉంది. షార్క్ నుంచి తప్పించుకోవడానికి చేపలు ఆ ట్యాంకుల్లోనే చురుకుగా తిరుగుతూ ఉంటాయి కదా. వాళ్లకు కావల్సింది అదే. కొన్ని చేపలు పోతేనేం జనానికి మార్కెట్‌లో తాజాచేపలు దొరుకుతాయి. అబ్బ జనమంటే ఎంత ప్రేమ కంపెనీల వారికి అనుకోకండి. తాజాచేపల్ని ఎంతకైనా కొనే జనం అభిరుచి పట్లే వారి ప్రేమంతా.
నీతి : 1. శత్రువు ఉన్నప్పుడే మనం చురుగ్గా ఉంటాం.
2. జనానికి ఏది ఇష్టమైతే ముందుగా దాన్ని దూరం చేసి తర్వాత ఎక్కువ రేటు పెట్టి అమ్మాలి.

Sunday 15 August 2010

ఒక వల - ఏడు పార్టీలు

సండే కామెంట్ఒక వల - ఏడు పార్టీలు
అనగనగా ఏడు పార్టీలు.ఏడు పార్టీలూ ఓట్ల వేటకెళ్లి ఏడు చేపలు తెచ్చుకుని ఎండబెట్టుకున్నాయి.అన్నీ ఒక సైజువి కాదు కనక ఒకేసారి ఎండలేదు. ముందుగా పెద్ద చేప ఎండడంతో ఆ చేపను వలేసి పట్టిన రాజు దాన్ని కోసి తన వాళ్లందరికీ చిన్నా పెద్దా ముక్కలు పంచిపెట్టాడు.ఇంతలో రాజు చనిపోయి మరో రాజు సింహాసనాన్ని అధిష్టించాడు.ముక్కలు ఇచ్చిన రాజుకే విధేయంగా ఉంటామని వాటిని తీసుకున్న వాళ్లు మొండికేసి కొత్త రాజును ముప్పుతిప్పలు పెట్టసాగారు.ఇచ్చిందెవరైతేనేం? బొక్కసంలో నుంచి వచ్చిన డబ్బుతోనే కదా వలను కుట్టించింది. దాన్ని విసిరిందీ, దానితో అతి పెద్ద చేపను పట్టిందీ కూడా రాజరికపు సొమ్ముతోనేనాయె. మీరు విధేయంగా ఉండాల్సింది వలకు కాని, వల విసిరిన వాళ్లకు కాదు కదా అని కొత్త రాజు నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించాడు.వాళ్లు... వింటేనా!వల గొప్పతనం గురించి నువ్వు మాకు కొత్తగా చెప్పనక్కర్లేదు. వలలు పేనీపేనీ పైకొచ్చిన వాళ్లమే మేమూ. లేకపోతే చేపముక్కలు మాదాకా ఎలా వచ్చేవి? ఆకర్షణీయమైన అతి పెద్దవల నేయడం అందరికీ చేతకాదు. నీకు అసలే రాదు. అందుకే మళ్లీ వేటకెళ్లినపుడు నువ్వొక్క చేపా తేలేవని మా అనుమానం... అన్నారు వాళ్లు.నిజమే. మీకందరికీ సరిపడేంత పెద్ద చేపను వలేసి పట్టే శక్తి నాకు లేదు. కాని ఇప్పటికే మీరు మింగిన చేపముక్కల్లో ఉన్న ముళ్లు మీ కడుపుకు గుచ్చుకునేలా మాత్రం చేయగలను. ఆ ముళ్లు మీరు పీక్కునేదాకా నేను నిశ్చింతగా రాజ్యం ఏలవచ్చును... అనుకున్నాడు కొత్త రాజు.మిగతా ఆరు పార్టీలూ ఈ చోద్యం చూస్తూ నిలబడి ఉండగా వాళ్లు ఎండబెట్టిన ఆరు చిన్నాచితకా చేపల్లో ఎక్కువ భాగం మళ్లీ నీళ్లలోకి జారుకోవడం మొదలుపెట్టాయి.వచ్చేసారి చేపల్ని పట్టడం మరింత కష్టమయ్యేలా ఉందని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి నిట్టూర్చారు.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఒక వల - ఏడు పార్టీలు




సండే కామెంట్ఒక వల - ఏడు పార్టీలు
అనగనగా ఏడు పార్టీలు.ఏడు పార్టీలూ ఓట్ల వేటకెళ్లి ఏడు చేపలు తెచ్చుకుని ఎండబెట్టుకున్నాయి.అన్నీ ఒక సైజువి కాదు కనక ఒకేసారి ఎండలేదు. ముందుగా పెద్ద చేప ఎండడంతో ఆ చేపను వలేసి పట్టిన రాజు దాన్ని కోసి తన వాళ్లందరికీ చిన్నా పెద్దా ముక్కలు పంచిపెట్టాడు.ఇంతలో రాజు చనిపోయి మరో రాజు సింహాసనాన్ని అధిష్టించాడు.ముక్కలు ఇచ్చిన రాజుకే విధేయంగా ఉంటామని వాటిని తీసుకున్న వాళ్లు మొండికేసి కొత్త రాజును ముప్పుతిప్పలు పెట్టసాగారు.ఇచ్చిందెవరైతేనేం? బొక్కసంలో నుంచి వచ్చిన డబ్బుతోనే కదా వలను కుట్టించింది. దాన్ని విసిరిందీ, దానితో అతి పెద్ద చేపను పట్టిందీ కూడా రాజరికపు సొమ్ముతోనేనాయె. మీరు విధేయంగా ఉండాల్సింది వలకు కాని, వల విసిరిన వాళ్లకు కాదు కదా అని కొత్త రాజు నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించాడు.వాళ్లు... వింటేనా!వల గొప్పతనం గురించి నువ్వు మాకు కొత్తగా చెప్పనక్కర్లేదు. వలలు పేనీపేనీ పైకొచ్చిన వాళ్లమే మేమూ. లేకపోతే చేపముక్కలు మాదాకా ఎలా వచ్చేవి? ఆకర్షణీయమైన అతి పెద్దవల నేయడం అందరికీ చేతకాదు. నీకు అసలే రాదు. అందుకే మళ్లీ వేటకెళ్లినపుడు నువ్వొక్క చేపా తేలేవని మా అనుమానం... అన్నారు వాళ్లు.నిజమే. మీకందరికీ సరిపడేంత పెద్ద చేపను వలేసి పట్టే శక్తి నాకు లేదు. కాని ఇప్పటికే మీరు మింగిన చేపముక్కల్లో ఉన్న ముళ్లు మీ కడుపుకు గుచ్చుకునేలా మాత్రం చేయగలను. ఆ ముళ్లు మీరు పీక్కునేదాకా నేను నిశ్చింతగా రాజ్యం ఏలవచ్చును... అనుకున్నాడు కొత్త రాజు.మిగతా ఆరు పార్టీలూ ఈ చోద్యం చూస్తూ నిలబడి ఉండగా వాళ్లు ఎండబెట్టిన ఆరు చిన్నాచితకా చేపల్లో ఎక్కువ భాగం మళ్లీ నీళ్లలోకి జారుకోవడం మొదలుపెట్టాయి.వచ్చేసారి చేపల్ని పట్టడం మరింత కష్టమయ్యేలా ఉందని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి నిట్టూర్చారు.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

Thursday 11 February 2010

Privacy & Cookies

Cookies & 3rd Party Advertisements
Google, as a third party vendor, uses cookies to serve ads on your site. Google's use of the DART cookie enables it to serve ads to your users based on their visit to your sites and other sites on the Internet. Users may opt out of the use of the DART cookie by visiting the Google ad and content network privacy policy.

We allow third-party companies to serve ads and/or collect certain anonymous information when you visit our web site. These companies may use non-personally identifiable information (e.g., click stream information, browser type, time and date, subject of advertisements clicked or scrolled over) during your visits to this and other Web sites in order to provide advertisements about goods and services likely to be of greater interest to you. These companies typically use a cookie or third party web beacon to collect this information. To learn more about this behavioral advertising practice or to opt-out of this type of advertising, you can visit

http://www.networkadvertising.org/managing/opt_out.asp.