Tuesday 26 July 2011

దేవుడికే దడ పుట్టింది!


స్వర్గ లోకం లో అన్ని రాష్ట్రాల దేవుళ్ళు కూర్చుని మూడు ముక్కలాట ఆడుకుంటున్నారు.

ఇంతలో 'పెద్ద ' దేవుడొచ్చి..."ఇక మీదట మీకు టైం పాస్ కావాలంటే పేకాడాల్సిన అవసరం లేదు. రేపు మన లోకానికి ఒక హోం థియేటర్ తెప్పిస్తున్నాను. హాయిగా సినిమాలు చూడొచ్చు" అన్నాడు.
చేతుల్లొ ఉన్న పేకలు గాల్లొకి ఎగరేసి చప్పట్లు కొట్టి ఈలలు వేసారు దేవుళ్ళందరూ.

పెద్ద దేవుడు - "మీరంతా ఈ సారి సెలవులకు మీ మీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి మంచి మంచి సినిమాలు పట్టుకురండి. అందరివి చూసాక అందులో బెస్ట్ అనిపించుకున్నవి మాత్రం ప్లే చేస్తాను...ఎమంటారు" అన్నాడు.

మిగతా దేవుళ్ళంతా "హై హై నాయకా..హై హై నాయకా" అని అరుచుకుంటూ వెళ్ళిపొయ్యారు.

తెలుగు దేవుడు ఆంధ్రప్రదేశ్ లో దిగాడు. ప్రయాణం వల్ల బాగా అలసిపొయ్యినట్టున్నాడు. ఒళ్ళు విరుచుకుని, పక్కన్నే ఉన్న టే కొట్టుకు వెళ్ళాడు. ఒక టీ చెప్పి, న్యూస్ పేపర్ తీసాడు..ఊళ్ళో ఏ తెలుగు సినిమాలు ఉన్నాయో చూద్దామని. ఉన్న వాటిలొ సగానికి పైగా డబ్బింగ్ సినిమాలు. 'ప్రేమ సంయోగం', 'వీర దంచుడు ', 'జాతీయ పాట ' టైటిల్స్ మాత్రం గుర్తుండిపొయాయ్ దేవుడికి.

స్వర్గ లొకంలొ జరిగే ఫిలిం ఫెస్టివల్ కు మంచి సినిమాలు సెలెక్ట్ చెయ్యాలి, పేపర్లలో వెతుక్కుని ,థియేటర్లకు వెళ్ళి చూస్తూకూర్చుంటే జరిగే పని కాదని, ఒక వీడియో పార్లర్ కు వెళ్ళి ఓ 200 సినిమాలు అద్దెకు తీసుకుని ఎడా పెడా చూసేసాడు.

అలా ఎన్ని రోజులు గడిచాయో తెలియదు. సినిమాలన్నీ చూసాక దేవుడికి ఏమి చెయ్యాలో తోచలా...తను చూసిన ఆ రెండొందల సినిమాలలో ఓ ఐదు సినిమాలు తప్ప మిగిలినవన్నీ చెత్తా చెదారం....'యూత్ ','ఫాక్షన్ ' ట్రెండ్ల పేరిట వచ్చిన ఎన్నో నికృష్టమైన సినిమాలు చూసాడు పాపం.

ఈ రెణ్ణెల్ల మెదడు వాపు కార్యక్రమం తరువాత ఓ రోజు న్యూస్ పేపర్ తెరిస్తే అందులో "తెలుగు నిర్మాతల సంఘం అనువాద చిత్రాలను బహిష్కరించాలని నిర్ణయించుకుంది" అని ఉంది.

అంతే...తెలుగు దేవుడికి చిర్రెత్తుకొచ్చింది , తన శక్తులన్నీ ఉపయోగించి తెలుగు సినిమా ఇండస్ట్రి వాళ్ళనందరినీ రవీంద్ర భారతికి రప్పించాడు..

మన సినిమా హీరొల స్టైల్లొనే కొంచెం అతి ఆవేశంతొ మొదలెట్టాడు దేవుడు - "రేయ్ మూర్ఖుల్లారా....మన సినిమాలు ఆడాలంటే డబ్బింగ్ సినిమాలను నిషేదించటం కాదు మార్గం...పిచ్చి పిచ్చి 'ట్రెండ్ ' సినిమాలు తియ్యకుండా.. కాస్త బుర్ర పెట్టి ఎంటర్టైనింగ్ గా తీయండి, అప్పుడు ఎందుకు చూడరు మీ సినిమాలు జనాలు?"

ఆగి, పక్కనున్న గ్లాసు లొంచి గట గటా నీళ్ళు తాగేసాడు.

మూతి తుడ్చుకుని, " 'సూపర్ కుర్రాళ్ళు - the youth guys ' అనే సినిమా తీసిన గాడిద ఎవడు...ముందుకు రా రా..." పిలిచాడు దేవుడు
"ఆ సినిమా రిలీజ్ చేసేముందు ఒక్క సారైన చూసావా దాన్ని?" .

ఆ దర్శకుడు "చూడండి సార్..ఇప్పుడు యూత్ ట్రెండ్ నడుస్తోంది...మీకు అర్థం కాదు..." అని ఇంకా ఏదో అనబోతుండగా...

" 'యూత్ ట్రెండ్' ఎంట్రా నీ మన్ను...ఏమాత్రం నటించలేని ఓ నలుగురిని తీసుకొచ్చి..వాళ్ళకు ఒకే రంగు బాగులు తగిలించి.. ఈ భూప్రపంచం లో యే కాలేజిలోనూ జరిగే అవకాశమే లేని 'క్లాసు రూము ' సన్నివేశాలు ఓ పది తీసి...సినిమా లో ఉండే విషయానికి ఏమాత్రం సంబంధం లేని టైటిల్ పెట్టి...అంతకన్నా దరిద్రమైన కాప్షన్ ఒకటి తగిలించి సినిమా రిలీజ్ చేస్తే....థియేటర్ లో ప్రొజెక్టర్ ఆపరేటర్ కూడా చూడడురా దాన్ని"

ఆ మాటలకు ముందు వరసలో కూర్చున్న సీనియర్ నిర్మాతల్లో ఒకరు "బాగా చెప్పారు...అస్సలు ఈ కొత్తవాళ్ళకు సమాజం పట్ల బాధ్యత లేకుండా పోతోంది.....సినిమా తీసెటప్పుడు స్క్రిప్టు పక్కాగా తయారు చేసుకుని వెళ్ళాలి..సీనియర్ రచయితల, దర్శకుల పర్యవేక్షణ లో తియ్యండయ్యా సినిమాలు" అన్నాడు.

దేవుడు ఆ నిర్మాత వైపు చూసి...."ఓ! మీరా సార్, మీ సినిమాలు కూడ ఓ నాలుగైదు చూసాను మొన్న ....వాళ్ళు తీసే సినిమాలు పనికిమాలినవైనా కనీసం కొత్త రకం చెత్త తీస్తున్నారు....మరి మీ సంగతి???? పాతికేళ్ళ నాటి కథలు, ముప్ఫై ఏళ్ళ నాటి డైలాగులు... రాసినవే మళ్ళీ మళ్ళీ రాసి, అతిశయోక్తి లేకుండా అర వాక్యం కూడ రాయలేని రచయితల్ని పెట్టుకుని సినిమాలు తీసేస్తున్నారే .. కొత్త కథలు, మంచి సంభాషణలు ఎక్కడి నుండి వస్తాయి భీష్ముడు గారూ??

" 'ఆడవాళ్ళ కోసం తీసిన సినిమా ' అని లేబిల్ తగిలించడం.అదే సినిమాలో అస్సలు అవసరం లేని బూతు పాటలు పెట్టడం, పరమ రిగ్రెస్సివ్ సన్నివేశాలు, డైలాగులతో సినిమాను రెండున్నర గంటల నిడివి నింపేయడం...

" 'ఇది కళ కాదు పెంకులూ కాదు, మేము కేవలం డబ్బు కోసం తీస్తున్నాము ' అని మీరు అంటే మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ రెండు రోజులకొకసారి..."మంచి సోషల్ మెస్సేజ్ ఉన్న సినిమా తీసాము...దీనికి 'ఉత్తమ చిత్రం ' అవార్డు రాకుంటే ఊరుకునేది లేదు "...అంటూ వాగుతూంటారే...మీకు అంతరాత్మ అనేది ఉందా..?
మీ లాంటి వాళ్ళను ఒక చీకటి గదిలో బంధించి 'దోమ కుడితె చికున్ గునియా...ప్రేమ కుడితే సుఖంగునియా ' అనే పాట వినిపించాలి"

ఓ రెండు సెకండ్లు ఏదొ ఆలొచిస్తున్నట్టు బుర్ర గోక్కుని మళ్ళీ ప్రారంభించాడు దేవుడు
"ఆ ఫాక్షన్ సినిమాల రచయితలు,దర్శకులు...ఇప్పుడు మీ వంతు,రండి ఫైకి ...ఆ వచ్చే ముందు...ఒక్కొక్కరు పది గుంజిళ్ళు తీసి రండి....
ఇన్ని 'రాయలసీమ ఫాక్షన్ ' సినిమాలు తీసారే...మీలో ఒక్కరికైన నిజంగా ఆ ఫాక్షనిస్టులు ఎలాగుంటారో తెలుసా??? చేతిలో కత్తులు, గన్నులతో ఎదురెదురుగా నుంచునప్పుడు...టీ లు, కాఫీలు తాగుతూ.. తీరిగ్గా అమ్మలను, అయ్యలను తిట్టుకుంటూ డైలాగులు చెప్పుకుంటార్రా ఎవరైనా??....ఐనా..ఒక్క సినిమాలో హీరో తొడ కొట్టినప్పుడు తెల్ల లుంగీ సందులోంచి చారల డ్రాయర్ కనిపించిందని...వరుసగా ఇరవై సినిమాలలో హీరోకు చారల డ్రాయర్ వేసి నిలబెడితే సినిమాలు హిట్టైపోవు"

"చివరగా మీలో ఉన్న ఇంకో ఆణిముత్యాన్ని పిలుస్తానుండండి" అని... మూలకు కూర్చున్న ఒక దర్శకుడిని పిలిచి "నీ పేరు...నువ్వు తియ్యబొయ్యే సినిమా గురించి అందరికీ చెప్పు" అన్నాడు దేవుడు.

ఆ దర్శకుడు అందరి ముందు నుంచొని "నా పేరు దినకర్...నా సినిమా చాల డిఫరెంట్ గా ఉంటుంది....ఇందులో క్లాస్, మాస్, లేడీస్ సెంటిమెంట్ అండ్ కామెడీ విత్ ఆక్షన్ బాక్డ్రాప్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి" అన్నాడు.

దేవుడు దినకర్ చెవు మెలి పెట్టి..."చూసారా...సినిమా పేరు తో వీడు చేస్తున్న అక్రమాలు....వీడా మన తెలుగు సినిమా భవిష్యత్తు???సంవత్సరానికి రెండు వందల తెలుగు సినిమాలు రిలీజ్ ఐతే...అందులో ఓ పదిహేను సినిమాలైన బాగా ఆడుతున్నాయా??? మిమ్మల్ని ఆర్ట్ సినిమాలు తియ్యమని ఎవ్వరూ అడగట్లేదు...మసాలా సినిమాలైనా మనోరంజకంగా తియ్యొచ్చు...వేరే భాష ల్లోనూ చెత్త సినిమాలు వస్తున్నాయి....కానీ వాళ్ళ మంచి సినిమాలు, ప్రయోగాత్మక సినిమాల శాతం మనకన్నా చాలా ఎక్కువ. అక్కడ బాగా ఆడిన సినిమాలను మన వాళ్ళు చక్కగా డబ్బింగు చేసి వదుల్తున్నారు....
అయితే, మూస వెధవల్లారా....ఒక్క డబ్బింగు సినిమా హిట్ అయ్యిందని...అరవం లో అడ్రస్సు లేని హీరోల సినిమాలు కూడా అనువదించి జనాల మీదకు తోస్తున్నారు కదరా"

ఇంతలో ఆకాశం లో పెద్ద ఉరుములు....దేవుడు పైకి చూసాడు..

పెద్ద దేవుడు ఆకాశం లో కనిపించి - "నాయనా...రానున్నది కార్తీక పౌర్ణమి...అంతలోపు నువ్వు తిరిగి రాకపొతే....దైవత్వము కోల్పొయ్యి శాశ్వతంగా భూలోకము మీద తెలుగు లో వచ్చే డబ్బింగు సినిమాలు, 'యూత్ ' సినిమాలు చూస్తూ ఉండిపోతావు" అన్నాడు.

దేవుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరితో - "నేను మా లోకానికి తిరిగి వెళ్ళిపోవాలి. ఇంకో సంవత్సరం లో మళ్ళీ వస్తా...అప్పటికైనా మన తెలుగు సినిమాల స్టాండర్డ్ కాస్త పెంచడానికి ప్రయత్నిచండి. జంధ్యాల, విశ్వనాథ్, బాపు, వంశీ లాంటి వాళ్ళు రెగులర్ గా తీసిన టైములో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. ఇప్పుడున్న దర్శకులలో 'సినిమా' మీద మంచి అవగాహన ఉండి, చక్కటి చిత్రాలు తీసే వాళ్ళు ఓ నలుగురున్నారంతే...ఆ సంఖ్య పెంచండి. మన సినిమాలను వేరే భాషల్లోకి అనువదించే లాగా తియ్యండి..కాదూ, కూడదు అని ఇలాగే చెత్త సినిమాలు తీస్తూ కూర్చుంటే......ఈసారి మీరు జరుపుకోవలసింది 'వజ్రోత్సవాలు ' కాదు...'బూడిదోత్సవాలు ' " అని మాయమైపొయ్యాడు..

"అన్ని తెలుగు సినిమాలు చూసిన ఎఫెక్ట్ వల్ల కాస్త ఓవరాక్షను డైలాగుల్తొ పేలినా మొత్తమ్మీద చాల నిజాలే మాట్లాడాడు ఈ దేవుడు" అనుకున్నాడు ఆ హాల్లొ ఉన్న ఒకే ఒక్క sensible శాల్తీ.

తను ఆ మీటింగుకి మైకు సెట్టు అరేంజ్ చేయటానికొచ్చినతను.

Monday 25 July 2011

రు.700 కోట్ల జగన్ మహల్!



అక్కడెక్కడో ముకేశ్ అంబానీ భారీ భవంతిని కట్టాడని గొప్పలు చెప్పుకున్నాం కానీ, మనకు తెలియకుండానే, మన పక్కనే ఓ భారీ భవంతిని జగన్ నిర్మించాడని తెలుసుకోలేకపోయాం. జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై సీబీఐ విచారణ పుణ్యమా అని.. ఆ విషయం బయటపడింది. అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కలిసే.. లోటస్ పాండ్ దగ్గర ఉంది మనం చెప్పుకుంటున్న మహాసౌథం. అందుకే.. ఈ మహల్ కు లోటస్ మహల్ అని పేరు పెట్టుకున్నాడు జగన్. పైకి చూడడానికి మాములుగానే కనిపించినా, విషయమంతా అందులోకి వెళ్లిన వారికే తెలుస్తుంది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఈ నివాసంలోకి కొన్ని రోజుల క్రితం ప్రవేశించారు. 52263 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఐదంతస్తుల రాజభవనాన్ని చూసి వారు అవాక్కయ్యారు. ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వెళ్లడానికి సౌకర్యం కోసం పెద్ద సంఖ్యలో లిఫ్ట్ట్లులు, ఎస్కలేటర్లు ఉన్నాయి. 200 సీటింగ్ కెపాసిటీ గల ఓ మినీ థియేటర్, లైబ్రరీ, జిమ్, స్క్వాష్, టెన్నిస్,వాలీబాల్ కోర్టులు ఇందులోకి ప్రవేశించిన వారికి కనిపిస్తాయి. దాదాపు 30 బెడ్ రూములు ఈ మహల్లో ఉన్నాయి. దీని నిర్మాణంలో భాగంగా 24 బోగీల మార్భుల్ రాయిని రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. సాధారణ సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ సైజులో రూములు కడితే.. 60 గదులకు ఈ మార్బుల్ సరిపోతుందట. ఇక ప్రత్యేకంగా సెల్లార్ లో మూడు అంతస్తులు పార్కింగ్ కోసమే వదిలిపెట్టారు. లోటస్ మహల్ ఉన్న ప్లాట్ లోనే ఆఫీస్ కాంప్లెక్స్ , సేవకుల కోసం 20 క్వార్టర్లు, రెండంతస్తుల ఔట్ హౌస్ ప్రత్యేకంగా నిర్మించారు. లోటస్ పాండ్ సమీపంలోని హుడాహైట్స్ లో 2,3,4,6,7,8 ప్లాట్లను కొని ఈ మహాసౌథాన్ని జగన్ నిర్మించాడు. ఇందులో మూడొంతులు జగనుకు చెందితే, మరో వంతు ఆయన సోదరి షర్మిలాది. వాస్తవానికి ఈ భవనం విలువ బహిరంగ మార్కెట్లో 700 కోట్ల వరకూ పలుకుతుందని, అయితే, తెలంగాణ ఉద్యమం కారణంగా, ప్రస్తుతం 300కోట్ల వరకూ విలువ చేస్తుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

Monday 18 July 2011

కొంపముంచిన మతిమరుపు.!

హాల్‌టికెట్ మరిచిపోయి ఎగ్జామ్‌కు వెళితే? పెనాల్టీతోనైనా ఎగ్జామ్ ఫీజు చెల్లించే ఆ చివరి రోజు కూడా మరిచిపోతే...? రిసీవ్ చేసుకోవడానికి కచ్చితంగా స్టేషన్‌కు వస్తానని చెప్పి, ఏ ఊరో వెళ్లిపోతే...? వ్యాపారి టాక్స్ చెల్లించాల్సిన లాస్ట్‌డేట్ మరిచిపోతే...? మ్యారేజ్ డే అన్న విషయమే మరిచిపోయి శ్రీవారు ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుంటే..? అన్నీ అతి ముఖ్యమైనవే! అయినా మరిచిపోవడమేమిటి? అదే మరి! కొన్ని విషయాలను మరిచిపోవడం వల్ల భారీ మూల్యమే చెలించుకోవలసి వస్తుంది.

వాటిలో కొన్ని తిరిగి పూడ్చుకునే అవకాశమే లేని నష్టాలు కావచ్చు. నిజానికి ఆ నష్టాల గురించి తెలియకపోవడం కూడా కాదు. అయినా మరిచిపోతుంటాం. ఒక విద్యార్థి ఫీజు కట్టడం మరిచిపోతే ఒక విద్యాసంవ త్సరమే చేజారిపోయినట్లే కదా! ఒక సంవత్సరం వృధాగా గడిచిపోయాక వచ్చే సంవత్సరం నాటికి ఆలోచనలు మారిపోవనేమీ లేదు కదా! పరిస్థితులు మారిపోవచ్చు. ఏడాది తరువాత మళ్లీ ఆ దిశగా వెళ్లడం సాధ్యమే కాకపోవచ్చు.

అహోరాత్రులు ఎంతో కష్టపడి చదివి, హాల్‌టికెట్ లేకుండా ఎగ్జామ్‌కు వెళితే ఏమిటి పరిస్థితి? మ్యారేజ్ డే మరిచిపోయిన శ్రీవారికి ఇంక ఆ ఏడాది పొడవునా వే ధింపులూ సాధింపులే కదా! నువ్వు ఉన్నావన్న ధీమాతో స్టేషన్‌లో దిగిపోతే నువ్వు ఆ విషయమే మరిచిపోయి అయిపు లేకుండా పోతే కొత్తగా సిటీకి వచ్చిన వారి గతేం కాను? ఈ విషయాల్లో ఎవరినో నిందించాల్సిన పనిలేదు.

అసలు మనల్ని మనమే క్షమించుకోలేం. తమాషా ఏమిటంటే ఇవేవీ మనం కావాలని చేసిన తప్పులు కావు. ఏవో పెద్ద అడ్డంకులు వచ్చి ఆగిపోయామని కూడా కాదు. వాటిని మరిచిపోవడమే సమస్య. ఎందుకిలా అవుతుంది?

కన్న వాళ్లే అన్నీ మోస్తే...
విద్యార్థులు ఫీజు లేదా హాల్ టికెట్ల విషయం మరిచిపోవడానికి కొన్ని సార్లు ఎగ్జామ్స్ తాలూకు ఒత్తిళ్లు కారణం కావచ్చు. ఇక కొందరి విషయంలో అయితే, తమకు సంబంధించినవన్నీ పేరెంట్సే చేసి పెట్టడం కారణంగా ఉంటుంది. అప్పటిదాకా తమ ప్రతి పనీ వారే చేశారు కాబట్టి, ఈ ఫీజులు, హాల్ టికెట్ల విషయాలు కూడా వారికి పట్టవు. అది తమ బాధ్యతగా అనిపించకపోవచ్చు. చివరికి హాల్ టికెట్ తెచ్చారో లేదో ఆ పేరెంట్స్‌ను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. త మలో ఇలా పేరుకుపోయిన ఉపేక్ష క్రమంగా ఒక మరుపుగా మారిపోవచ్చు.

మనసుకు నచ్చకపోయినా...?
కొన్ని పనులు ముఖ్యమైనవే కావచ్చు. కానీ, అవి మనసుకు నచ్చినవి కాకపోవచ్చు. ఇలాంటి విషయాల పట్ల అంతరంగంలో ఒక ఒక తిరస్కార వైఖరి ఉంటుంది. అందుకే ఆ పనుల పట్ల మనసు పట్టనట్లు ఉంటుంది. వాటిని మనసులోంచి బయటికి తోసేసే ప్రయత్నం కూడా చేస్తుంది. నచ్చని విషయాల పట్ల మనసులో దృఢమైన నిర్ణయం ఏర్పడదు. ఏదో బలంవంతంగా నిర్ణయానికి వచ్చేనాటికి ఆ గడువు కాస్తా దాటిపోతుంది. ఇతరుల బలవంతమే తప్ప తనకు ఏమాత్రం ఇష్టం లే నప్పుడు కూడా మనసులోంచి అది పూర్తిగా వైదొలగిపోతుంది.అది మరపు జాబితాలో చేరిపోతుంది. మెదడుకూ హృదయానికీ మధ్య చోటుచేసుకునే వైరుధ్యాలివి. ఇలాంటి పరిస్థితులో చాలా సార్లు హృద యానిదే పైచేయి అవుతుంది.

ఆత్మీయులకు దూరం కాలేక
కొన్ని సార్లు తాను ప్రేమించే వాటికి దూరం కాలేక కూడా మనసు ఇలాంటి వైఖరిని అలవర్చుకుంటుంది. ఐఐటి ఎంట్రన్సు రాసి సీటు వచ్చేస్తే ఎక్కడో దూరంగా వెళ్లాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులకూ, తోబుట్టువులకూ, మిత్రులకూ ఆత్మీయులకూ దూరంగా వెళ్లాలి. ఇది ఏమాత్రం భరించలేని మనసు పలాయనానికి సిద్ధపడుతుంది.

ఆ ఎగ్జామ్‌కు సంబంధించి ఫీజు చెల్లించకపోవడం గానీ, హాల్ టికె ట్ మరిచిపోవడం గానీ జరిగిపోతుంటాయి. ఇవన్నీ చేతన మనసుకు తెలియకుండానే జరిగిపోతాయి. పరీక్షల్లో కొన్నిసార్లు అన్ని ప్రశ్నలకూ సమాధానం రాయగలిగి కూడా కొంత మంది మధ్యలోనే విరమించుకుంటారు. ప్రతికూలమైన భావోద్వేగాలు, అనుభవాల నుంచి గాయాల నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటివి చోటుచేసుకుంటాయి.

వర్తమానాన్ని వదిలేస్తూ...
యువతలో ఎక్కువ మంది భవిష్యత్తు తాలూకు ఊహల్లో జీవించడాన్ని ఇష్టపడతారు. ప్రణాళికలన్నీ భవిష్యత్తుకు సంబంధించే ఉంటాయి. ఈ క్రమంలో వర్తమాన విషయాల మీధ «ధ్యాస బాగా తగ్గిపోతుంది. మనసంతా భవిష్యత్తే ఆక్రమిస్తే మనసులో వర్తమానానికి చోటెక్కడిది? వర్తమానంలో బాధ్యతల భారం ఉంటుంది. అందుకే చాలా మందికి భవిష్యత్తు తాలూకు ఊహల్లో గడపడమే హాయి అనిపిస్తుంది. చాలా మందికి వర్తమానం ఒక చేదు అనుభవం. అందుకే వర్తమానంలో చేయవలసిన చాలా పనులు వారి మదిలో ఉండవు. ఇలా నిజాలనుంచి దూరం జరిగే తత్వాన్ని డిసోషియేషన్ ఆఫ్ అమ్నేసియా అంటారు.

నిద్రలేమి...
జ్ఞాపకాలను స్థిరపరచడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. మానసిక ఒత్తిళ్లు తీవవ్రమైనప్పుడు కొందరిలో నిద్రలేమి మొదలవుతుంది. తాత్కాలిక నిద్రలేమి సమస్యలు అంత పెద్ద ప్రభావాన్ని చూపించకపోవచ్చు. కానీ, దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యలు క చ్ఛితంగా జ్ఞాపక శక్తిని దెబ్బ తీస్తాయి. ముఖ్యంగా ఎగ్జామ్స్‌కు ముందు యువతీ యువకులు తమ నిద్రా సమయాన్ని బాగా తగ్గిస్తారు. ఇది శారీరక , మానసిక ఒత్తిళ్లను పెంచుతుంది.

అలాగే తాను పనిచేసే సంస్థకు సంబంధించి ఒక పని తరువాత మరోపని వరుస పరంపరగా వచ్చిపడుతుంటే వ్యక్తిగతమైన విషయాల గురించి ఆలోచించే స్థితిని మనిషి కోల్పోతాడు. కుటుంబపరమైనవి, తన వ్యక్తిగతమైనవేవీ తనకు గుర్తు లేకుండా పోతాయి. ఇలాంటి స్థితిలో మన ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. అందుకు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ నిపుణుల సహకారం కూడా తెలుసుకోవాలి.

ప్లాన్ ఉంటే లేదు తంటా!
ఇష్టమైన పనులే అయినా అన్నీ ఒకసారే చేయలేం కదా! ఏది ఎప్పుడు చేయాలో వాటి ప్రాధాన్యతలను అనుసరించి ఒక ప్రణాళికా లేకపోతే అది కూడా ఒక ఇబ్బందే. పనులు పర్వతంలా ముందు పడి ఉన్నప్పుడు కూడా మనసు వాటినుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అన్నీ చేయాలనే ఆరాటంలో ఏ ఒక్కటీ చేయలేని పరిస్థితిలో పడిపోవచ్చు. ప్రణాళికలేని మనసులో ఒక అయోమయం నెలకొంటుంది. అయోమయం భయాన్నీ,ఆందోళననూ కలిగిస్తుంది.

అందుకే మనకున్న పనులన్నిటినీ ఒక ప్రణాళికా బద్ధం చేసుకోవ డం చాలా ముఖ్యం. వేరెవరూ ఈ పనిని తనంత బాగా చెయ్యలేరని కొందరు అన్నీ తామే చెయ్యాలనుకుంటారు. ఇది విపరీతమైన ఒత్తిడికి గురిచేసి చివరికి ఏ ఒక్క పనీ పరిపూర్ణంగా చేయలే ని స్థితికి చేరుకుంటారు. ఇవన్నీ వైఫళ్యాల వైపే నడిపిస్తాయి. పైగా పరిపూర్ణంగా చేయకపోవడం అలా ఉంచి చాలా పనులను పూర్తిగా వదిలేసే ప్రమాదం ఉంది. అందుకే పని విభజన కూడా చాలా ముఖ్యం.

బోర్డు మీద రాయాలి
జ్ఞాపకం ఉంటాయిలే అనే అతి నమ్మకం చాలా సార్లు ప్రమాదాల్లో పడదోస్తుంది. అందుకే అతి ముఖ్యమైన పనులను ఒక బోర్డు మీద పెద్ద అక్షరాలతో రాసి పెట్టుకోవాలి. వాటిలోనూ ఆ నెలలో చేయవలసినవి, ఆ వారంలో చెయ్య వలసినవి, ఆ రోజే చేయవలసినవి అంటూ కొన్ని విభాగాలుగా రాసిపెట్టుకోవాలి. అప్పుడింక మరిచిపోయే అవకాశం ఉండదు. అయితే ఏది ముందో ఏది వెనుకో ఆ క్రమాన్ని కూడా రాసుకోవాలి. ప్రాధాన్యతను బట్టే ఆ క్రమం ఉండాలి.

యోగా, మెడిటేషన్ విధి నిర్వహణ ఎంత ముఖ్యమైనా శరీరం అనుకూలించక పోతే ఏమీ జరగదు. అందుకే శారీరక ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలి. వ్యాధిగ్రస్తమై, శక్తిహీనమైన శరీరం ఏ బాధ్యతల పట్లా ఆసక్తి చూపదు. అందుకే పోషకాహారం తోపాటు ప్రతిరోజూ ఎంతో కొంత సమయాన్ని యోగా, ధ్యానాలకు కేటాయించాలి.       -Courtesy:Telugu News Paper.

చీమలూ ... నిధులూ..!


బంగారం తవ్వే 'చీమల' గురించి ఒక పురాగాథ ఉంది.
భారతదేశంగా భావించబడే ఒక ఎడారి ప్రాంతంలో ఒకనాడు ఇసుకలో కలిసిపోయి బోలెడు బంగారం ఉండేదట. విపరీతమైన వేడి, ఉక్క ఉండే ఆ ప్రాంతంలో ఈ 'చీమలు' తప్ప వేరే జంతువులు ఉండేవి కావట. అవి కుక్కల కంటే చిన్నగా నక్కల కంటే పెద్దగా ఉండేవట. చాలా వేగంగా పరిగెత్తగలిగేవట. ఎండ పెరిగేకొద్దీ అవి ఇసుకను తొలుచుకుంటూ లోపల్లోపలికి వెళ్లిపోతే అడుగు ఇసకంతా పైకొచ్చి పడేదట.
సరిగ్గా అవి లోపలికి వెళ్లిపోయి కునుకు తీసే సమయానికి పసిడి వేటగాళ్లు మూడు ఒంటెల సవారీ కట్టుకెళ్లి బంగారంతో నిండిన ఆ ఇసుకనంతా మూటలు గట్టుకుని వచ్చేసేవారట. ఆ 'చీమల' చేతచిక్కితే చావే కాబట్టి తమ ఒంటెల్లో ఒకటి బాలింత ఒంటె ఉండేలా చూసుకునేవారట. అది బిడ్డ మీద తీపితో ప్రాణాలకు తెగించి పరిగెత్తి వాళ్లను ఎలాగోలా క్షేమంగా తిరిగి తీసుకొచ్చేదట.

***


2500 ఏళ్ల క్రితం హెరొడొటస్ రాసిన ఈ కథనాన్ని చాలా శతాబ్దాల వరకు ఎవరూ నమ్మలేదు. కథో కల్పనో అనుకున్నారు. అబద్ధాలకోరు అని కూడా అన్నారు.

కాని కొన్నేళ్ల క్రితం సింధునది ఎగువన భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఒక అధ్యయన బృందానికి సరిగ్గా అటువంటి ఇసుక, అటువంటి 'చీమలు', ఆ వేటగాళ్లను పోలిన ఆదివాసులు కనిపించారట. అయితే ఆ ప్రాంతం సరిహద్దు రేఖ మీదే ఉండడం వల్ల సైన్యంకాల్పులకు భయపడి వాళ్లు మరింత లోతుగా పరిశోధించకపోయినా ఆ 'చీమలు' మనకు తెలిసిన చీమలు కావని, ఉడతల్లాంటివని అర్థం చేసుకున్నారు. పర్షియన్లు వాటిని కొండ చీమలు అనడం వల్ల అందరూ వాటిని ఇంతకాలం చీమలు అనే అనుకుంటూ వచ్చి చీమలేమిటి, బంగారం తవ్వడమేమిటని మరింత ఆశ్చర్యపోతూ వచ్చారు.

***


ఆ కథంతా మనకెందుగ్గాని మన సైన్యం, పాకిస్తాన్ సైన్యం కాసేపు కాల్పులు ఆపితే ఆ 'చీమల్ని' కొన్ని మనం తెచ్చుకోవచ్చు కదా. తెచ్చుకుని దేశమంతా తిప్పితే ఇంకా ఎక్కడెక్కడ బంగారం భూగర్భంలో దాగుందో చెప్పేస్తాయి కదా. అప్పుడు దేశం నిజమైన అర్థంలో ఆగర్భ శ్రీమంతురాలని మనం చెప్పుకుని గర్వించొచ్చు కదా... అప్పుడు అనంత పద్మనాభస్వామి నగలు ఏ మూలకు?

Thursday 14 July 2011

ఎన్నారైసింహారెడ్డి!

ఒరేయ్ AT&Tగా,  నువ్విచ్చే బోడి పెయిడ్ డీల్సు ఎవడిక్కావాల్రా? ఎత్తి కొట్టానంటే నువ్వూ, నీ సర్క్యూట్సూ పనికిరాకుండాపోతైరా. ఆ తర్వాత గోక్కోటానికి వైర్లు చేతిలో ఉన్నా పీక్కోటానికి ఒక్క కస్టమరూ ఉండర్రా.

నేను ఇండియాలో ఫ్రీ కాల్సు చేసుకున్నా, ఇక్కడికొచ్చి మీ ఊళ్ళో చేసుకున్నా, మా ఫ్రెండ్సుతో కలిసి చేసుకున్నా, సింగిల్గా కూడా చేసుకున్నా. ఒరేయ్, నువ్వే గనక ఓ దమ్మున్న ఫోను కంపనీవోడివైతే, నీకే గనక నన్ను ఫ్రీ ఫోన్ కాల్సు చేసుకోకుండా  ఆపగలిగే కెపాసిటీ ఉంటే, రారా...ఈ రోజు ఈ ఎన్నరైగాడో నువ్వో తేలిపోవాలి.


అరేయ్ RI గుర్తుపట్టావా, నేను NRI గాణ్ణిరా., నేను ఫోనెత్తి హలో..... అని దారుణంగా నోరు తెరిచి పిలిస్తే ఆ పిలుపు వినలేక దెబ్బకి చెవులు చిల్లులుపడి చస్తావ్రా. నేను పర్సనల్గా వచ్చి మాట్లాడటమేంట్రా.


ఇండియా కాల్ కోసం డబ్బు తగలెయ్యకుండా ఫ్రీగా చేసుకోటం ఎలాగో నాకు మా ఫ్రెండ్ అమెరికా పాలతో ఇక్కడికొచ్చిన మొదటి రోజే నేర్పాడ్రా.


నేను ఇండియాకి ఫ్రీగా యాహూలో మాట్లాడా, జీ మెయిల్లో మాట్లాడా. మరీ తిక్కరేగితే ఆఫీసు ఫోనుతో కూడా మాట్లాడా. ఇవ్వాళ ఉన్నపళంగా పెయిడ్ కాల్సు అంటే యెవడు ఒప్పుకుంటాడ్రా? హ్యాక్ చేసైనా ఫ్రీగా మాట్లాడ్తా కానీ, డబ్బులిచ్చి చచ్చినా మాట్లాడన్రా, గుర్తుపెట్టుకో..


ఒరే మామా, ఫోను ఇప్పుడెత్తినా సరే, పొద్దున్నే పళ్ళుతోమకముందెత్తినా సరే. మీకు పనున్నా సరే, మీ ఇంటికి ఎవరైనా వస్తున్నా సరే. టైమూపాడూ లేకుండా నాకు తిక్కరేగినప్పుడల్లా నేనెక్కడైనా, నేను ఎప్పుడైనా మీకు కాల్ చేస్తా.


రేయ్ బామ్మర్దీ, రెండ్రోజులు నా గొంతు వినపడనంత మాత్రాన, నేను చచ్చాననుకుని పండగ చేసుకుంటార్రా? ఎన్ని గుండెల్రా మీకు? చచ్చింది నేను కాదురా, నా పీసీ. అందుకే మీకు గంటలకొద్దీ ఫోన్ చేసే అవకాశం లేకపోయిందిరా. అయినా ఇవ్వాల్టినుంచి మళ్ళీ వేళాపాళా, వారంవర్జ్యం లేకుండా నేను చేసే కాల్సు దెబ్బకి మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయిరా.


ఒరేయ్, నేను డయల్ చేసిన నంబరు రాంగ్ కాబట్టి నువ్వు ఫోనెత్తి ఛీ పో అని బండబూతులు  తిట్టినా వెనక్కి తగ్గి ఫోన్ పెట్టేస్తున్నారా,ఒరేయ్ అదే కరక్ట్ నంబరై, నువ్వు ఫోన్ ఎత్తకపోయుంటే, నువ్వు ఫోనెత్తే దాకా నీకూ, మీ పక్కింటోడికీ రింగ్ చేస్తూనే ఉండేవాణ్ణిరా.


ఒరేయ్ RI రెడ్డప్పా, ఈ దేశానికొచ్చాక ఫ్రీగా ఇండియాకి ఫోన్ చెయ్యటం మొదలెట్టింది మా నీచం గాడు,  ఆఫీసు ఫోనుతో ఫ్రీగా మాట్లాడ్డం మొదలెట్టింది మా నికృష్టం గాడు, ఇంటర్నెట్లో ఫ్రీగా మాట్లాట్టం మొదలెట్టింది నేను. నువ్వేంట్రా, ఫ్రీ ఫోన్ కాల్సు నిషేధిస్తా...నిషేధిస్తా అంటూ పీకేది?


ఎవడికి ఫోను బిల్లు ఇస్తున్నావో తెలుసామ్మా? ఎవడి పేరు చెబితే ఫోను కంపనీలకి మండుద్దో, ఎవడి ఫోన్ కాలంటే ఇండియాలో చుట్టాలకి కంపరంతో కూడిన దడపుడుతుందో, వాడే వీడు "ఎన్నారైసింహారెడ్డి".


ఒరేయ్ AT&T, నీ దేశానికొచ్చా, నీ ఊరొచ్చా, నీ పేటకొచ్చా, నీ కాలనీకొచ్చా, నువ్వు ఫోను బిల్లు దండుకునే ఇళ్ళల్లోకొచ్చా. నేను ఇక్కణ్ణించే నీ కంటెదురుగానే ఫ్రీగా ఇండియాకి కాల్సుచేస్తారా. ఏం పీకుతావో పీక్కోరా.


ఒరేయ్ Reliance గా, నువ్వేంట్రా పెద్ద పుడింగివా? బాంబులతో కాదురా ఫ్రీ కాల్సుతో చంపుతా.


ఇది చాలు. ఈ నోటికున్న పవర్ చాలు. వారానికో పదిసార్లు నేను చేసే సొల్లు కాల్సు విని అభిమానించి భరించే వాళ్ళని ఆదరించి పొగిడే ఈ నోటికి, ఫోన్ కట్ చేసే వాళ్ళని, ఎంగేజ్లో పెట్టే వాళ్ళని చూస్తే ఆవేశంతో వచ్చేవి పొగడ్తలు కావురా, శాపనార్ధాలు. వినలేక నీ చెవులు చిల్లులు పడతాయి, అటుపై నీ ఫోను వైర్లు కాలిపోతాయ్. ఖబడ్దార్.


ఒసే ప్రొమోషనల్ ఫోన్ కంపనీ, నేను పొట్టకొట్టి కాల్సు చేసుకుంటున్న ఆ ఫోను కంపనీల సాక్షిగా, నాకు బోలెడు బిల్లు అవుతోందని వెర్రిగా నమ్ముతూ నన్ను మెచ్చుకుంటున్న మా ఊరి అమ్మలక్కల సాక్షిగా, నేనే గనక ఓ ఎన్నారై నయితే, నువ్వు ఇయ్యాల కూడా నాకు ఫ్రీ ఫోను మినిట్సు ఇస్తావమ్మా.


లక్షల్లో ఒక్క ఎన్నారైని, లక్ష మందికి ఒక్క ఎన్నారైని.

Tuesday 12 July 2011

భాషాభిమానం!

"... ఇందుకోసం కూడా తెలుగు భాషను మనలో ప్రతి ఒక్కరం మరింత బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం'' మైకులో ఒక పెద్దాయన గొంతు వినబడుతోంది.
తెలుగు భాష ఔన్నత్యం, ఆవశ్యకతలపై జరుగుతున్న సదస్సు అది. పొద్దున్నించి దేశభాషలందు తెలుగు ఎందుకు లెస్సో (ఇంగ్లీషు లెస్ కాదు) అందరూ చెప్పీ చెప్పీ వినీ వినీ అలిసిపోయి ఉన్నారు. ఇది మధ్యాహ్నం సెషన్. అన్నపూర్ణ లాంటి తెలుగు భోజనం తిని, తెలుగు భుక్తాయాసంతో, తెలుగు నిద్రామైకంలోకి జారుకుంటుండగా ఈ మాటలు వినిపించాయి. ఠక్కున లేచి కూర్చున్నారందరూ.
తెలుగు గొప్పతనం గురించి, తెలుగును బతికించుకోవాల్సిన అవసరం గురించి ఇంతమంది కవులు, కథకులు, పండితులు, భాషావేత్తలు చెప్పని ఏ కొత్త విషయాన్ని ఆయన చెప్పబోతున్నాడో వాళ్లకు అర్థం కాలేదు. ఊపిరి బిగబట్టి చెవులు రిక్కించారు.

"నేనో రాజకీయ నాయకుడ్ని. నాకు వ్యాకరణం, పద్యం, శైలి, శిల్పం వగైరాల గురించి తెలియదు. కాని తెలుగు భాష మాత్రం ఉండి తీరాలి. వేరే ఏ భాషలోనూ నాకు తిట్లు రావు. అలాగే నేను ఎవర్నయినా పొగడాలన్నా, ఎవరైనా నన్ను పొగడాలన్నా... వీటి అవసరం ప్రతిరోజూ ఉంటూనే ఉంటుంది... తెలుగు భాష నాకూ వాళ్లకీ కూడా వచ్చి ఉండాలి. మా ఇద్దరికి మాత్రమే వస్తే సరిపోదు. నా నియోజకవర్గం ప్రజలకు, మీడియా వాళ్లకు కూడా వచ్చి ఉండాలి. ఢిల్లీ వాళ్లకు, ఇంకా చెప్పాలంటే అమెరికా వాళ్లకు తెలుగు భాష రాకపోవడం వల్ల నాకు ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఒక రాజకీయ నాయకుడ్ని అర్థం చేసుకోవాలంటే అతని భాష తెలిసి ఉండాలి. ఒక భాష సజీవంగా ఉందని చెప్పడానికి ఎవరికైనా ఒక ప్రమాణమే ఉంటుంది. అదెన్ని కొత్త తిట్లను స్వీకరిస్తుందో, ఎన్ని కొత్త ప్రశంసలను సృష్టించుకుంటుందో దానిమీదే ఆ భాష కొనసాగింపు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మీరందరూ అందుకు దోహదపడాలని నా మనవి''... అనేసి సెలవు తీసుకున్నాడాయన.
కింద కూర్చున్నవాళ్లు యథాప్రకారం చప్పట్లు కొట్టి ఆయనతో పాటే లేచి వెళ్లిపోయారు.

Monday 11 July 2011

India’s Population Reality!


WORLD POPULATION DAY-TODAY
IT REMINDS US OF OUR SHARED RESPONSIBILITY TO CARE FOR EACH OTHER AND OUR PLANET


Smaller Default Larger

This year’s World Population Day falls during a milestone year, when we anticipate the birth of the earth’s seven-billionth inhabitant. This is an opportunity to celebrate our common humanity and our diversity. It is also a reminder of our shared responsibility to care for each other and our planet. It provides us an opportunity to analyze our successes and our failures. This year’s World Population Day has more significance for India, because the results of Census-2011 have just been released which provide a fertile ground for an assessment of our current demographic situation and future challenges.

The provisional population figures of the 2011 Census do suggest that India’s population growth is finally slowing down. Although the total population size exceeded most projections, the growth rate has slowed compared to the 1990s. This is largely due to further declines in fertility throughout the 2000s in the populous states in northern India. However, it will be a few more decades before the “momentum effect” arising from past high fertility runs its course. The more than expected increase in population size may also mean that India may overtake China as the most populous nation a few years earlier than predicted.
Regional variation in growth rates is along the expected lines. Despite the narrowing of the north-south gap in growth rates, the most populous states have the inbuilt demographic momentum to run further away from the rest in population size. This means the centre of population gravity is likely to move towards further north in the decades to come with the attendant social, economic and political implications.
Although the population sex ratio has improved, the unexpected surprise was the deterioration in child sex ratios. The 2011 Indian census revealed about 7•1 million fewer girls than boys aged 0–6 years, a notable increase in the gap of 6•0 million fewer girls recorded in the 2001 census and the gap of 4•2 million fewer girls recorded in the 1991 census. The overall child sex ratio of girls per 1000 boys at ages 0–6 years fell by 1•9% (from 945 to 927) in the decade starting in 1991 and by 1•4% (from 927 to 914) in the decade starting in 2001. More girls than boys die at ages 1–59 months, but this is mostly off set by more boys than girls dying in the first month of life.
With the exception of three states in the south, all the major states fared worse in under seven sex ratios during 2001-11 than in the previous decade. The only state whose figures are so strange that there is every reason to doubt them is Jammu and Kashmir (J&K), where the census was undertaken after a gap in 1991, in 2001 and 2011. According to the provisional figures, the child sex ratio has plummeted from 941 to 859 – 82 points – along with this, J&K is the only state in the whole country to have registered a positive increase in its fertility during this period. Whatever the form that the ongoing conflict is taking, such figures are hard to make sense of and require further investigation.).
As special measures were taken to improve female undercount in the 2011 Census, the most plausible explanation for the gap in the number of girls in the 2011 census is widespread use of sex selective abortion and excess female mortality. There is evidence that sex-selective abortions are widely practiced, facilitated by easy availability of the technology of pre- natal sex-detection and access to medical termination of pregnancy, at least in some parts of the country. 
 

Reducing maternal and child mortality are two of the eight goals for development adopted by 189 nations in the Millennium Declaration in 2000. Millennium Development Goal 5 (MDG5) set the ambitious target to reduce the maternal mortality ratio by three-quarters between 1990 and 2015. Similarly Millennium Development Goal 4 (MDG4) aims to reduce the under 5 mortality rate by two-thirds in that same period. India has achieved considerable progress in reducing its maternal mortality ratio during the last decade, thanks to the Reproductive and Child Health Programme and National Rural Health Mission, but still we have one of the highest maternal mortality ratios in the world. With a maternal mortality ratio of 254, more than 68 thousand women in India still die each year due to causes associated with pregnancy and child birth. For every women who dies, about 20-30 suffer from devastating health problems such as infertility and damage to their reproductive organs. Majority of these deaths and morbidities occur in poor households due to inadequate medical care at the time of child birth. This tragedy need not continue. One of the best ways to do this is to make sure that women receive antenatal care right from the first trimester and also receive skilled care at delivery. Skilled care, however, can only be effective if our poor health system addresses women’s health needs and the obstacles women face en route to emergency care.
Under-5 mortality in the country has declined considerably during the last 20 years from 106 in 2098 to about 70 in 2008. Each year 1828 thousand under-5 deaths take place in the country accounting for about 23 percent of the total global under-5 deaths. However, if we look at the newborn death rate, it has declined very little in recent decades. New born deaths in the country account for 38 percent of all deaths among children age five and younger. Between one-quarter and one-half of newborn deaths occur in the first 24 hours after birth: three quarters occur in the first week of life. If India wants to achieve the MGD-4, it need to focus more on improving the reproductive and child health care especially newborn child health.
The latest surveys also reveal that the average family size has declined in all parts of the country more so in the south than in the Hindi belt. The Total Fertility Rate (average number of children a women has throughout her child bearing years) has come down to 2.7 but most of the women still face difficulty achieving the number of children they want and having births when they want them. As a result, a gap frequently exists between women’s desired and actual family size. Consequently, women resolve to unplanned pregnancies, mistimed pregnancies or unwanted births. As per National Family Health Survey-3, 21 percent of all pregnancies in India are unplanned. Ten percent are mistimed and 10 percent are unwanted. Some women who are unable to plan their pregnancies resort to abortions to avert unwanted/mistimed births, which can be risky if the procedure is not safe. Though providing better quality, easily available and safe family planning services as per the needs of the women can address the issue of unplanned pregnancies to some extent but more needs to be done to improve the women’s conditions. If our women are to achieve control over their reproductive destiny, sustained improvement will be necessary not just in their access to contraceptives services, but also in their personal, legal, economic and social condition. This is because women’s control on child bearing is closely related to other aspects of their lives, particularly their educational achievement, the age at which they marry, their role within the family, their likelihood of being subjected to domestic violence, and the degree to which they and their husbands are agree about family size and the desirability of contraceptive use. With further improvements in women’s economic and social conditions, in their ability to act upon their own decisions and in the provision of family planning services, many women in the country can be successful in achieving their reproductive goals.