Posts

Showing posts from July, 2011

దేవుడికే దడ పుట్టింది!

స్వర్గ లోకం లో అన్ని రాష్ట్రాల దేవుళ్ళు కూర్చుని మూడు ముక్కలాట ఆడుకుంటున్నారు. ఇంతలో 'పెద్ద ' దేవుడొచ్చి..."ఇక మీదట మీకు టైం పాస్ కావాలంటే పేకాడాల్సిన అవసరం లేదు. రేపు మన లోకానికి ఒక హోం థియేటర్ తెప్పిస్తున్నాను. హాయిగా సినిమాలు చూడొచ్చు" అన్నాడు. చేతుల్లొ ఉన్న పేకలు గాల్లొకి ఎగరేసి చప్పట్లు కొట్టి ఈలలు వేసారు దేవుళ్ళందరూ. పెద్ద దేవుడు - "మీరంతా ఈ సారి సెలవులకు మీ మీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి మంచి మంచి సినిమాలు పట్టుకురండి. అందరివి చూసాక అందులో బెస్ట్ అనిపించుకున్నవి మాత్రం ప్లే చేస్తాను...ఎమంటారు" అన్నాడు. మిగతా దేవుళ్ళంతా "హై హై నాయకా..హై హై నాయకా" అని అరుచుకుంటూ వెళ్ళిపొయ్యారు. తెలుగు దేవుడు ఆంధ్రప్రదేశ్ లో దిగాడు. ప్రయాణం వల్ల బాగా అలసిపొయ్యినట్టున్నాడు. ఒళ్ళు విరుచుకుని, పక్కన్నే ఉన్న టే కొట్టుకు వెళ్ళాడు. ఒక టీ చెప్పి, న్యూస్ పేపర్ తీసాడు..ఊళ్ళో ఏ తెలుగు సినిమాలు ఉన్నాయో చూద్దామని. ఉన్న వాటిలొ సగానికి పైగా డబ్బింగ్ సినిమాలు. 'ప్రేమ సంయోగం', 'వీర దంచుడు ', 'జాతీయ పాట ' టైటిల్స్ మాత్రం గుర్తుండిపొయా...

రు.700 కోట్ల జగన్ మహల్!

Image
అక్కడెక్కడో ముకేశ్ అంబానీ భారీ భవంతిని కట్టాడని గొప్పలు చెప్పుకున్నాం కానీ, మనకు తెలియకుండానే, మన పక్కనే ఓ భారీ భవంతిని జగన్ నిర్మించాడని తెలుసుకోలేకపోయాం. జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై సీబీఐ విచారణ పుణ్యమా అని.. ఆ విషయం బయటపడింది. అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కలిసే.. లోటస్ పాండ్ దగ్గర ఉంది మనం చెప్పుకుంటున్న మహాసౌథం. అందుకే.. ఈ మహల్ కు లోటస్ మహల్ అని పేరు పెట్టుకున్నాడు జగన్. పైకి చూడడానికి మాములుగానే కనిపించినా, విషయమంతా అందులోకి వెళ్లిన వారికే తెలుస్తుంది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఈ నివాసంలోకి కొన్ని రోజుల క్రితం ప్రవేశించారు. 52263 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఐదంతస్తుల రాజభవనాన్ని చూసి వారు అవాక్కయ్యారు. ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వెళ్లడానికి సౌకర్యం కోసం పెద్ద సంఖ్యలో లిఫ్ట్ట్లులు, ఎస్కలేటర్లు ఉన్నాయి. 200 సీటింగ్ కెపాసిటీ గల ఓ మినీ థియేటర్, లైబ్రరీ, జిమ్, స్క్వాష్, టెన్నిస్,వాలీబాల్ కోర్టులు ఇందులోకి ప్రవేశించిన వారికి కనిపిస్తాయి. దాదాపు 30 బెడ్ రూములు ఈ మహల్లో ఉన్నాయి. దీని నిర్మాణంలో భాగంగా 24 బోగీల మార్భుల్...

కొంపముంచిన మతిమరుపు.!

Image
హాల్‌టికెట్ మరిచిపోయి ఎగ్జామ్‌కు వెళితే? పెనాల్టీతోనైనా ఎగ్జామ్ ఫీజు చెల్లించే ఆ చివరి రోజు కూడా మరిచిపోతే...? రిసీవ్ చేసుకోవడానికి కచ్చితంగా స్టేషన్‌కు వస్తానని చెప్పి, ఏ ఊరో వెళ్లిపోతే...? వ్యాపారి టాక్స్ చెల్లించాల్సిన లాస్ట్‌డేట్ మరిచిపోతే...? మ్యారేజ్ డే అన్న విషయమే మరిచిపోయి శ్రీవారు ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుంటే..? అన్నీ అతి ముఖ్యమైనవే! అయినా మరిచిపోవడమేమిటి? అదే మరి! కొన్ని విషయాలను మరిచిపోవడం వల్ల భారీ మూల్యమే చెలించుకోవలసి వస్తుంది. వాటిలో కొన్ని తిరిగి పూడ్చుకునే అవకాశమే లేని నష్టాలు కావచ్చు. నిజానికి ఆ నష్టాల గురించి తెలియకపోవడం కూడా కాదు. అయినా మరిచిపోతుంటాం. ఒక విద్యార్థి ఫీజు కట్టడం మరిచిపోతే ఒక విద్యాసంవ త్సరమే చేజారిపోయినట్లే కదా! ఒక సంవత్సరం వృధాగా గడిచిపోయాక వచ్చే సంవత్సరం నాటికి ఆలోచనలు మారిపోవనేమీ లేదు కదా! పరిస్థితులు మారిపోవచ్చు. ఏడాది తరువాత మళ్లీ ఆ దిశగా వెళ్లడం సాధ్యమే కాకపోవచ్చు. అహోరాత్రులు ఎంతో కష్టపడి చదివి, హాల్‌టికెట్ లేకుండా ఎగ్జామ్‌కు వెళితే ఏమిటి పరిస్థితి? మ్యారేజ్ డే మరిచిపోయిన శ్రీవారికి ఇంక ఆ ఏడాది పొడవునా వే ధింపులూ సాధింపులే ...

చీమలూ ... నిధులూ..!

Image
బంగారం తవ్వే 'చీమల' గురించి ఒక పురాగాథ ఉంది. భారతదేశంగా భావించబడే ఒక ఎడారి ప్రాంతంలో ఒకనాడు ఇసుకలో కలిసిపోయి బోలెడు బంగారం ఉండేదట. విపరీతమైన వేడి, ఉక్క ఉండే ఆ ప్రాంతంలో ఈ 'చీమలు' తప్ప వేరే జంతువులు ఉండేవి కావట. అవి కుక్కల కంటే చిన్నగా నక్కల కంటే పెద్దగా ఉండేవట. చాలా వేగంగా పరిగెత్తగలిగేవట. ఎండ పెరిగేకొద్దీ అవి ఇసుకను తొలుచుకుంటూ లోపల్లోపలికి వెళ్లిపోతే అడుగు ఇసకంతా పైకొచ్చి పడేదట. సరిగ్గా అవి లోపలికి వెళ్లిపోయి కునుకు తీసే సమయానికి పసిడి వేటగాళ్లు మూడు ఒంటెల సవారీ కట్టుకెళ్లి బంగారంతో నిండిన ఆ ఇసుకనంతా మూటలు గట్టుకుని వచ్చేసేవారట. ఆ 'చీమల' చేతచిక్కితే చావే కాబట్టి తమ ఒంటెల్లో ఒకటి బాలింత ఒంటె ఉండేలా చూసుకునేవారట. అది బిడ్డ మీద తీపితో ప్రాణాలకు తెగించి పరిగెత్తి వాళ్లను ఎలాగోలా క్షేమంగా తిరిగి తీసుకొచ్చేదట. *** 2500 ఏళ్ల క్రితం హెరొడొటస్ రాసిన ఈ కథనాన్ని చాలా శతాబ్దాల వరకు ఎవరూ నమ్మలేదు. కథో కల్పనో అనుకున్నారు. అబద్ధాలకోరు అని కూడా అన్నారు. కాని కొన్నేళ్ల క్రితం సింధునది ఎగువన భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఒక అధ్యయన బృందానికి సరిగ్గా అటువంటి ఇసుక, అటు...

ఎన్నారైసింహారెడ్డి!

ఒరేయ్ AT&Tగా,  నువ్విచ్చే బోడి పెయిడ్ డీల్సు ఎవడిక్కావాల్రా? ఎత్తి కొట్టానంటే నువ్వూ, నీ సర్క్యూట్సూ పనికిరాకుండాపోతైరా. ఆ తర్వాత గోక్కోటానికి వైర్లు చేతిలో ఉన్నా పీక్కోటానికి ఒక్క కస్టమరూ ఉండర్రా. నేను ఇండియాలో ఫ్రీ కాల్సు చేసుకున్నా, ఇక్కడికొచ్చి మీ ఊళ్ళో చేసుకున్నా, మా ఫ్రెండ్సుతో కలిసి చేసుకున్నా, సింగిల్గా కూడా చేసుకున్నా. ఒరేయ్, నువ్వే గనక ఓ దమ్మున్న ఫోను కంపనీవోడివైతే, నీకే గనక నన్ను ఫ్రీ ఫోన్ కాల్సు చేసుకోకుండా  ఆపగలిగే కెపాసిటీ ఉంటే, రారా...ఈ రోజు ఈ ఎన్నరైగాడో నువ్వో తేలిపోవాలి. అరేయ్ RI గుర్తుపట్టావా, నేను NRI గాణ్ణిరా., నేను ఫోనెత్తి హలో..... అని దారుణంగా నోరు తెరిచి పిలిస్తే ఆ పిలుపు వినలేక దెబ్బకి చెవులు చిల్లులుపడి చస్తావ్రా. నేను పర్సనల్గా వచ్చి మాట్లాడటమేంట్రా. ఇండియా కాల్ కోసం డబ్బు తగలెయ్యకుండా ఫ్రీగా చేసుకోటం ఎలాగో నాకు మా ఫ్రెండ్ అమెరికా పాలతో ఇక్కడికొచ్చిన మొదటి రోజే నేర్పాడ్రా. నేను ఇండియాకి ఫ్రీగా యాహూలో మాట్లాడా, జీ మెయిల్లో మాట్లాడా. మరీ తిక్కరేగితే ఆఫీసు ఫోనుతో కూడా మాట్లాడా. ఇవ్వాళ ఉన్నపళంగా పెయిడ్ కాల్సు అంటే యెవడు ఒప్పుకుంటాడ్రా...

భాషాభిమానం!

Image
"... ఇందుకోసం కూడా తెలుగు భాషను మనలో ప్రతి ఒక్కరం మరింత బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం'' మైకులో ఒక పెద్దాయన గొంతు వినబడుతోంది. తెలుగు భాష ఔన్నత్యం, ఆవశ్యకతలపై జరుగుతున్న సదస్సు అది. పొద్దున్నించి దేశభాషలందు తెలుగు ఎందుకు లెస్సో (ఇంగ్లీషు లెస్ కాదు) అందరూ చెప్పీ చెప్పీ వినీ వినీ అలిసిపోయి ఉన్నారు. ఇది మధ్యాహ్నం సెషన్. అన్నపూర్ణ లాంటి తెలుగు భోజనం తిని, తెలుగు భుక్తాయాసంతో, తెలుగు నిద్రామైకంలోకి జారుకుంటుండగా ఈ మాటలు వినిపించాయి. ఠక్కున లేచి కూర్చున్నారందరూ. తెలుగు గొప్పతనం గురించి, తెలుగును బతికించుకోవాల్సిన అవసరం గురించి ఇంతమంది కవులు, కథకులు, పండితులు, భాషావేత్తలు చెప్పని ఏ కొత్త విషయాన్ని ఆయన చెప్పబోతున్నాడో వాళ్లకు అర్థం కాలేదు. ఊపిరి బిగబట్టి చెవులు రిక్కించారు. "నేనో రాజకీయ నాయకుడ్ని. నాకు వ్యాకరణం, పద్యం, శైలి, శిల్పం వగైరాల గురించి తెలియదు. కాని తెలుగు భాష మాత్రం ఉండి తీరాలి. వేరే ఏ భాషలోనూ నాకు తిట్లు రావు. అలాగే నేను ఎవర్నయినా పొగడాలన్నా, ఎవరైనా నన్ను పొగడాలన్నా... వీటి అవసరం ప్రతిరోజూ ఉంటూనే ఉంటుంది... తెలుగు భాష నాకూ వాళ్లక...

India’s Population Reality!

WORLD POPULATION DAY-TODAY IT REMINDS US OF OUR SHARED RESPONSIBILITY TO CARE FOR EACH OTHER AND OUR PLANET Smaller Default Larger This year’s World Population Day falls during a milestone year, when we anticipate the birth of the earth’s seven-billionth inhabitant. This is an opportunity to celebrate our common humanity and our diversity. It is also a reminder of our shared responsibility to care for each other and our planet. It provides us an opportunity to analyze our successes and our failures. This year’s World Population Day has more significance for India, because the results of Census-2011 have just been released which provide a fertile ground for an assessment of our current demographic situation and future challenges. 
The provisional population figures of the 2011 Census do suggest that India’s population growth is finally slowing down. Although the total population size exceeded most projections, the growth rate has slowed compared to the 1990s. This is largely due t...