తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా "ఐ బొమ్మ " వెబ్సైట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వెబ్ సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ ను అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచగా.. ఈ పైరసీ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే రవిని అరెస్ట్ చేసిన వెంటనే వెబ్ సైట్ ని బ్లాక్ చేసేశారు అధికారులు. కానీ ఐబొమ్మ తరహా లోనే మరో కొత్త వెబ్సైట్ తెరపైకి రావడం అది డైరెక్ట్ గా కొత్త సినిమాలను కూడా ప్రదర్శిస్తుండడం ఆందోళన రేకెత్తించింది. 'ఐబొమ్మ వన్' పేరుతో వచ్చిన ఆ వెబ్ సైట్.. మూవీరూల్జ్ వెబ్ సైట్ కి అది రీ డైరెక్ట్ అవుతూ సినిమాలను చూసేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఈ విషయంపై కూడా పోలీసులు దృష్టి సరిస్తున్న తరుణంలో ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది. SBI పోర్టల్కు లింక్.. ఐబొమ్మ వన్ వెబ్ సైట్ లో నుంచి పైరసీ సినిమాలను చూసేందుకు SBI పోర్టల్కు లింక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. బ్యాంకింగ్ వెబ్సైట్ వంటి అత్యంత రక్షణ గల ప్లాట్ఫాంలోకి పైరసీ లింక్ను చొప్పించడం వెనుక పైరసీ రాకెట్ ఎంత పెద్దదో అనే అనుమానాలను లేవనెత్తుతోంది. SBI term life insurance పోర్టల్కు ఐబొమ్మను లింక్ చేశారు...
సానియా ట్వీట్కు అటు పాకిస్థానీయులతోపాటు భారత ప్రజలు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆగ్రహాన్ని వారు ట్విట్టర్ లో కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ను పాకిస్థాన్ ఆర్మీ ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. వాఘా సరిహద్దు వరకు అభినందన్ను పాక్ ఆర్మీ రహదారి మార్గంలో తరలించి సరిహద్దు వద్ద భారత సైన్యానికి అప్పగించారు. ఈ క్రమంలో అభినందన్ రాకపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. ప్రజలు, సెలబ్రిటీలు ముక్త కంఠంతో జైహింద్ అని కొనియాడారు. అలాగే ఇండియన్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా తన ట్విట్టర్ ఖాతాలో అభినందన్ను మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్పై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘వింగ్ కమాండర్ అభినందన్కు స్వాగతం. నువ్వు మా నిజమైన హీరోవి. మీరు చూపిన తెగువ, ధైర్య సాహసాలకు యావత్ దేశం మీకు శాల్యూట్ చేస్తుంది. మరోసారి అభినందన్కు స్వాగతం చెబుతున్నా. జై హింద్..!’ అంటూ.. సానియా ట్వీట్ చేసింది. అయితే సానియా ట్వీట్కు అటు పాకిస్థానీయులతోపాటు భారత ప్రజలు కొందరు ఆగ్రహం...
హీరోయిన్ జాన్వీ కపూర్ ఫుల్ ఫామ్లో ఉంది. హిందీలో మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తున్న ఈ భామ.. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర', రామ్ చరణ్ 16వ సినిమాలో చేస్తోంది. అలానే ప్రేమ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్తో రిలేషన్లో ఉంది. ఈ విషయాన్ని ఎక్కడ దాచలేదు. పలుమార్లు బయట కనిపించారు. కొన్నాళ్ల ముందు జంటగా తిరుపతి దర్శనం కూడా చేసుకున్నారు. తాజాగా వీళ్ల పెళ్లి గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది. జాన్వీ కపూర్ పెళ్లి తిరుపతిలో జరగనుంది. బంగారు రంగు చీర కట్టుకోనుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా నాతో చెప్పింది' అని ఇన్ స్టాలో ఓ నెటిజన్స్ పోస్ట్ పెట్టాడు. ఇతడు జాన్వీ ఫ్రెండ్ కావడంతో నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఈ పోస్ట్కి రిప్లై ఇచ్చిన జాన్వీ.. 'ఏదైనా రాస్తారా' అని ఫైర్ అయింది. పలువురు నెటిజన్లు మాత్రం జాన్వీ పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'మీకు తెలియకుండానే మీ పెళ్లి చేసేస్తున్నారు', 'పెళ్లి చేసుకునే వరకు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు' అని రాసుకొస్తున్నారు ఇకపోతే మహారాష్ట్ర మాజీ సీఎం సుశీష్ కుమార్ షిండే మనవడు అయిన శిఖర్.. ము...