Monday 4 March 2019

సానియా మీర్జాపై మ‌ళ్లీ నెటిజ‌న్ల ఫైర్‌.. ఎందుకంటే..?

సానియా ట్వీట్‌కు అటు పాకిస్థానీయుల‌తోపాటు భార‌త ప్ర‌జలు కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ ఆగ్ర‌హాన్ని వారు ట్విట్ట‌ర్ లో కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు.
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థ‌మాన్ ను పాకిస్థాన్ ఆర్మీ ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. వాఘా సరిహ‌ద్దు వ‌ర‌కు అభినంద‌న్‌ను పాక్ ఆర్మీ ర‌హ‌దారి మార్గంలో త‌ర‌లించి స‌రిహ‌ద్దు వ‌ద్ద భారత సైన్యానికి అప్ప‌గించారు. ఈ క్ర‌మంలో అభినంద‌న్ రాక‌పై యావ‌త్ దేశం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ప్ర‌జ‌లు, సెల‌బ్రిటీలు ముక్త కంఠంతో జైహింద్ అని కొనియాడారు. అలాగే ఇండియ‌న్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో అభినంద‌న్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

‘వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్‌కు స్వాగ‌తం. నువ్వు మా నిజ‌మైన హీరోవి. మీరు చూపిన తెగువ‌, ధైర్య సాహసాల‌కు యావ‌త్ దేశం మీకు శాల్యూట్ చేస్తుంది. మ‌రోసారి అభినంద‌న్‌కు స్వాగ‌తం చెబుతున్నా. జై హింద్‌..!’ అంటూ.. సానియా ట్వీట్ చేసింది. అయితే సానియా ట్వీట్‌కు అటు పాకిస్థానీయుల‌తోపాటు భార‌త ప్ర‌జలు కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ ఆగ్ర‌హాన్ని వారు ట్విట్ట‌ర్ లో కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు. సానియా పెట్టిన ట్వీట్‌పై వారు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

‘నీకు నిజ‌మైన హీరో ఎవ‌రో ఇప్పుడు తెలిసిందా..’ అని కొంద‌రు సానియా ట్వీట్‌ను విమర్శిస్తుంటే.. మ‌రికొంద‌రు.. ‘నువ్వు నిజ‌మైన హీరోను ఇప్ప‌టి వ‌ర‌కు చూసుండ‌వు..’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అభినంద‌న్ పాక్ ఆర్మీ అదుపులో ఉన్న‌ప్పుడు కూడా సానియా చేసిన ట్వీట్‌పై దుమారం చెల‌రేగిన విష‌యం విదిత‌మే. మ‌రోవైపు ఆమె భ‌ర్త, పాకిస్థాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ మాత్రం త‌మ దేశ ఆర్మీకి అనుకూలంగా గ‌తంలో కామెంట్లు చేశాడు. అందువ‌ల్లే.. భార‌త పౌరులు సానియా ట్వీట్ల‌పై మండిప‌డుతున్నారు.

Sunday 17 February 2019

ఎన్టీఆర్ ని ఎందుకు వదిలేశారో

2017, 2018 సంవత్సరం కు గాను సుబ్బిరామిరెడ్డి జాతీయ అవార్డు ప్రకటించారు. ఆనవాయితీ ప్రకారం, హీరోలు, హీరోయిన్లు అందరికి ఏదో ఓ పేరు చెప్పి అవార్డులు ఇచ్చేశారు. ఆ జాబితాలో లేని హీరో అంటూ లేడు. ఒక్క ఎన్టీఆర్ తప్ప. ఎన్టీఆర్ కావాలనుకుంటే అరవింద సామెత వీరరాఘవ సినిమాకి గాను, అవార్డు ఇవ్వొచ్చు. కానీ, కే. సుబ్బిరామిరెడ్డి ఎన్టీఆర్ ని విస్మరించారు.

దీనికి కారణం అంటూ ఏమి లేదు. 2017 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడు ఖాతాలో నందమూరి బాలకృష్ణకు అవార్డు ఇచ్చారు. ఎన్టీఆర్ కి కూడా అవార్డు ఇస్తే బాలయ్య ఆ వేడుకకి వస్తాడో, రాడో అన్నది సుబ్బిరామిరెడ్డి అనుమానం. అందుకే, ఆ రిస్క్ చేయలేకపోయాడు కెఎస్ఆర్. బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య దూరం ఇటీవలే తగ్గినట్లు అనిపించింది. ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు ఫంక్ష‌న్‌ని జూనియ‌ర్ వ‌చ్చి వెళ్లాడు.

అంత‌కు ముందు అర‌వింద స‌మేత స‌క్సెస్ మీట్ లో బాల‌య్య అతిథిగా మెరిశాడు. ఈ తాజా ప‌రిణామ‌ల‌తో ఇద్ద‌రి మ‌ధ్య దూరం తగ్గింద‌నుకున్నారంతా. కానీ… అది అలానే కొన‌సాగుతోంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆ రిస్కు తీసుకోవ‌డం ఇష్టం లేక‌.. బాల‌య్య కోసం ఎన్టీఆర్‌ని వ‌ద్ద‌నుకున్నాడు కేటీఆర్‌. అందుకే సుబ్బిరామిరెడ్డి అవార్డుల జాబితాలో ఎన్టీఆర్ పేరు క‌నిపించ‌లేదు.

Monday 11 February 2019

క్లివేజ్ షో తో మతిపోగొడుతున్న ఐశ్వర్య

అందం గురించి ఉదాహరణ చూపించాలంటే ఐశ్వర్యారాయ్ ను చూపిస్తే సరిపోతుంది. అంతగా ఇప్పటికీ తన అందంతో అలరిస్తుంది ఈ భామ. 45 ఏళ్ల వయసు వచ్చినా కూడా బ్రహ్మదేవుడు మాత్రం ఈమెకు ఒక్కదానికే అందాలను దాచుకునే యంత్రం ఎదో ఇచ్చినట్లున్నాడు. అందుకే ఇప్పటివరకు గ్లామర్ షోతో మతులు పోగొడుతుంది.

తాజాగా డబూ రత్నాని ఫ్తో షూట్ కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఐశ్వర్యారాయ్. అక్కడ ఆమెను చూసి ఫిదా కానీ వారు ఉండరు. కుర్ర హీరోయిన్ల‌కు కూడా కుళ్లు తెప్పించేలా అందాలు ఆర‌బోసింది. క్లీవేజ్ షోతో హీట్ పుట్టించింది. వ‌య‌సు ఐదు ప‌దుల‌కు చేరువ‌గా వ‌స్తున్నా కూడా ఇప్ప‌టికీ అందాన్ని కాపాడుకోవ‌డంలో ఐష్ త‌ర్వాతే ఎవ‌రైనా..?

మ‌రోసారి ఇప్పుడు ఇదే చేసింది ఈ భామ. హాట్ డ్ర‌స్ లో ఈ భామ క్లీవేజ్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసింది. ఇప్పుడు కూడా అమ్మడి అందాల ఆరబోత చూసి ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు. ఆమె క్లివేజ్ తో అక్కడి కెమెరాలన్నీ వేడెక్కాయి

ఆ క్రీమ్ వాడితే అమ్మాయిలకు పెళ్లవుతుందా?

ఆ క్రీమ్ వాడితే అమ్మాయిలకు పెళ్లవుతుందా? లేకుంటే పెళ్లి కాదా? అని హీరోయిన్ శ్రీయ ప్రశ్నిస్తుంది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో తాను నటించబోనని స్పష్టంచేసింది. ఇటీవలి కాలంలో ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ వ్యాపార ప్రకటనపై స్పందించిన ఆమె, తానూ ఆదినుంచి కొన్ని రకాల వాణిజ్య ప్రకటనలను వ్యతిరేకినని, ఫెయిర్ నెస్ క్రీమ్ వాడితే తెల్లగా ఆవులారని, వారికి తొందరగా పెళ్లి అవుతుందని ఆమధ్య వచ్చిన ఓ ప్రకటన తనకు నచ్చలేదని చెప్పింది.

మొదట ఆ కమర్షియల్ ప్రకటనలో నటించాలని తననే సంప్రందించారని, దాన్ని తానూ తిరస్కరించానని చెప్పింది. దీనిపై ఆమె స్పందిస్తూ.... సదరు క్రీమ్ వాడితే అమ్మాయిలకు పెళ్లవుతుందా? లేకపోతె కాదా? తెల్లగా ఉండాలన్నది చర్మ సౌందర్యానికి సంబందించిన విషయం. స్వతహాగానే అది వస్తుంది తప్ప ఏ క్రీమ్ లు వాడినా రాదూ. ఈ తరహా అసత్యపు యాడ్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం నాకు నచ్చదు. అందుకే పలు ప్రకటనలకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నా నేను ఒప్పుకోను అని తేల్చేసింది.

Friday 8 February 2019

మెట్రో రైల్వే స్టేషన్ ఎలివేటర్లు ప్రేమికులకు హాట్ స్పాట్... లిఫ్ట్‌ల్లో అధర చుంబనాలు

hyderabad metro rail - youth kissing in lift
hyderabad metro rail - youth kissing in lift
పార్కులు ప్రేమికుల రాసలీలలకు కేంద్రంగా మారిన నేపథ్యంలో.. తాజాగా మెట్రో రైల్వేస్టేషన్‌లోని లిఫ్టులు కూడా ముద్దుముచ్చటకు నిలయంగా మారిపోతున్నాయి. హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్టులు ప్రేమికులకు అడ్డాగా మారుతున్నాయి. నాలుగు వైపులా.. మూతపడిపోవడంతో ఈ ఎలివేటర్లు ప్రేమికులకు హాట్ స్పాట్‌గా మారిపోతున్నాయి.

నిత్యం రద్దీగా ఉండే నగరంలో కాసింత ఏకాంతం కోరుకునే ప్రేమికులకు మెట్రో లిఫ్ట్‌లు ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తున్నాయి. ఈ లిఫ్ట్‌లలో సీసీటీవీలు ఉన్నాయన్న సంగతిని గుర్తించని ప్రేమికులు ఆ కాస్త సమయంలోనే ముద్దు ముచ్చట తీర్చుకుంటున్నారు.

ఇటీవల ఈ సీసీటీవీ ఫుటేజీలను గమనించిన సిబ్బంది అందులోని దృశ్యాలు చూసి షాక్ తిన్నారు. వెంటనే ఆ ఫుటేజీలను పోలీసులకు పంపారు. లిఫ్ట్‌లలో అధర చుంబనాలు కానిచ్చేస్తున్న వారంతా ఇంటర్, డిగ్రీ చదివే వారు కావడం గమనార్హం. ఇప్పుడీ దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే.. వైరల్‌గా మారిన ఈ వీడియోలు మెట్రో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై విచారణ చేస్తున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్లను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Tags: hyderabad-metro-rail-lifts-a-lovebirds-haven, Hyderabad: Couples have been caught getting cozy in the elevators of Metro stations, as couples have been caught kissing on cameras

Thursday 31 January 2019

ఆ దర్శకుడిపై హేమ రుసరుసలడుతుంది

టాలీవుడ్ నటి హేమ ఓ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పారితోషికం డిసైడ్ చేయడానికి అయన ఎవరంటూ రుసరుసలాడింది. ఇంతకీ హేమకు, త్రివిక్రమ్ కు ఎక్కడ చెడిందో? ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది.

పరిశ్రమలో టాప్ డైరెక్టర్స్ తన ఫ్రెండ్స్ అని చెప్పిన నటి హేమ, తన కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు ఉంటారని, ఆ విషయం దర్శకులకు కూడా తెలుసనీ చెప్పింది. సంక్రాంతికి వచ్చిన వినయ విదేయ రామ తో మరోసారి నిరూపించానని గుర్తు చేసుకుంది.

ఇదే క్రమంలో తనకు పారితోషికం పెంచలేదని మనుసులోని మాట చెప్పింది. త్రివిక్రమ్ సినిమాల్లో ఎందుకు కనిపించలేదని అడిగిన ప్రశ్నకు వెరైటీగా రిప్లయ్ ఇచ్చింది. తమ పారితోషికం డిసైడ్ చేయడానికి అతనెవరు. ఈ విషయంలో నిర్ణయించుకోవాల్సింది మేనేజర్ లేదంటే నిర్మాత అని చెప్పింది.

ఇన్నేళ్లు మీతో ట్రావెల్ చేసిన తనను నమ్మలేదని, కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని సైలెంట్ అయిపోయానని వెల్లడించింది. దీంతో ఆయనతో మాట్లాడడం మానేశానని తెలియజేసింది. మరి హేమ వ్యాఖ్యలపై మాటల మాంత్రికుడు ఏమంటాడో చూడాలి.

Monday 31 December 2018

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో చాలా మంది టీవీలు చూడడం కంటే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఖాతాలను ఎక్కువగా వాడుతున్నారు. అందుకే ఇప్పుడు వాటికి క్రేజ్ బాగా పెరిగింది. క్రిష్ రూపొందిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ వారు నిర్మాతలకు భారీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

అప్పటివరకు సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ లేనప్పటికీ సినిమా ట్రైలర్ వచ్చి అంచనాలను అమాంతం పెంచేసింది. ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. దర్శకుడిగా క్రిష్ ఈ సినిమాకి నూటికి నూరు శాతం న్యాయం చేసి ఉంటారని అందరూ నమ్ముతున్నారు.

తన తండ్రి గెటప్ లో బాలకృష్ణ కూడా ఇమిడిపోయాడని అంటున్నారు. అందుకే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాకి భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు కలిపి పాతిక కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఆ రేటుకి బాలకృష్ణ సినిమా డిజిటల్ రైట్స్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది.

అమెజాన్ పైమ్ ఆఫర్ :- ఈరోజే ఉచితంగా సబ్‌స్కైబ్ అవ్వండి.. ఒక నెల రోజులు పాటు అన్ని సినిమాలూ చూసేయండి ఉచితంగా.

రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Sponsored: Amazon Prime India