Saturday, 25 September 2010
ఇదే అదృష్టం!
స్వైన్ ఫ్లూ రోజుల్లో ఒట్టి ఫ్లూ రావడమే అదృష్టం.
గుండె పోట్ల రోజుల్లో గుండె కేవలం రివర్సయి డెంగూ గా రావడమే అదృష్టం.
టీవి చూసి గుండె ఆగే రోజుల్లో కరెంటు కోత ఉండటమే అదృష్టం.
టెర్రరిస్టులకు భయపడే రోజుల్లో జేబుదొంగలు తారసపడటమే అదృష్టం.
బ్యాంకులు దివాలా తీసే రోజుల్లో డబ్బులు లేకపోవడమే అదృష్టం.
ఉద్యోగాలు పోయే రోజుల్లో చదువులేకపోవడమే అదృష్టం.
అమెరికాకు ఆర్దికమాంద్యం వచ్చిన రోజుల్లో వీసా దొరకకపోవడమే అదృష్టం.
కందిపప్పు కొనలేని రోజుల్లో దానికి రుచి లేకుందా పోవడమే అదృష్టం.
సన్నబియ్యం దొరకని రోజుల్లో సన్నబడాల్సిరావడమే అదృష్టం.
ఆడపిల్లల్ని కననివ్వని రోజుల్లో గర్భం దాల్చకపోవడమే అదృష్టం.
ప్రేమికులు ఆసిడ్ బాటిళ్ళతో తిరిగే రోజుల్లో ఎవరి ప్రేమకూ నోచుకొకపోవడమే అదృష్టం.
మానసిక సౌందర్యాన్ని గుర్తించలేని రోజుల్లో శారీరక సౌందర్యం లేక పోవడమే అదృష్టం.
పెళ్ళిళ్ళ ఖర్చు ఆకాశాన్నంటే రోజుల్లో పెళ్ళికొడుకులూ ,కూతుళ్ళు దొరకకపోవడమే అదృష్టం.
స్వయంగా మొగుళ్ళే యముళ్ళుగా మారుతున్న రోజుల్లో అనాదలుగా బ్రతకడమే అదృష్టం.
వర్షాలు పడని రోజుల్లో వలస పోగలగటమే అదృష్టం.
నాయకులు లేని రోజుల్లో వినాయకుడు ఉండటమే అదృష్టం.
పుట్టగొడుగులమద్య బ్రతికే రోజుల్లో నిజం గొడుగు క్రింద నిలబడగలగటమే అదృష్టం.
తలవంచి బ్రతకడం తప్పనిసరైన రోజుల్లో తలల్లో ఏమీ లేకుండా ఉండటమే అదృష్టం.
అబద్దాలు ప్రచారమయ్యే రోజుల్లో నిజాలు నిలకడమీద తలుస్తాయని ఆశించడమే అదృష్టం.
నేరుగా తిట్టలేని రోజుల్లో పిట్టకధలు చెప్పి కోపం తీర్చుకోగలగటమే అదృష్టం.
Wednesday, 22 September 2010
ఒక శ్రీకాకుళం లెక్క!
సండే కామెంట్
ఒక శ్రీకాకుళం లెక్క
ఎన్ని దెబ్బలు తిన్నాక ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది?
ఎన్ని వృత్తులు నాశనమైతే ఒక డిగ్రీ చేతికి వస్తుంది?
ఎన్ని ప్రశంసలు లభిస్తే ఒక రచయిత సంతృప్తి చెందుతాడు?
ఎన్ని గుంటలు పడితే ఒక రోడ్డును ఓల్డ్ ఏజ్ హోమ్కు పంపిస్తారు?
ఎన్ని ఫ్లైఓవర్లు కడితే ఒక నగరం తన పేరును మార్చుకుంటుంది?
ఎన్ని ఉద్యమాలు జరిగితే ఒక రాష్ట్రం అవతరిస్తుంది?
ఎంత పని చేశాక ఒక శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది?
ఎంత డబ్బు జేబులో ఉంటే ఒక మనిషికి ధైర్యం వస్తుంది?
ఎంత ప్రయాణం పూర్తయితే గమ్యస్థానం ఏమిటో తెలుస్తుంది?
ఎంత స్తబ్ధత తర్వాత ఒక సమాజం మేలుకుంటుంది?
ఎంత అవినీతి జరిగితే దేవుడు కొత్త అవతారం ఎత్తుతాడు?
ఎంత మంచితనం జతపడితే ఒక సమాజం బాగుపడుతుంది?
***
ఇలాంటి గణాంకాలు కూడా చెప్పే శాస్త్రవేత్తలు ఎప్పుడు వస్తారో!
***
ఆ మధ్య శ్రీకాకుళంలో - కోటానుకోట్ల మంది వచ్చినారు బాబూ అని ఒకావిడ చాలా గొప్పగా చెప్పింది.
కోటానుకోట్ల మంది ఏమిటే లక్షలాది లక్షల మంది వచ్చారు అన్నదట రెండో ఆవిడ ఇంకా గొప్పగా.
లక్షలాది లక్షల మంది కాదే వేలాది వేల మంది వచ్చారంది ఇదంతా వింటున్న మూడో ఆవిడ మరింత గొప్పగా.
వాళ్లు లెక్కలు తెలియక అలా అంటున్నారనుకుంటున్నారా?
కాని లెక్కలు తెలిసిన అభివృద్ధి శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి లెక్కలే వేస్తున్నారే!
Friday, 3 September 2010
‘ఓదార్పు’
ట్రావెల్ ఎజెన్సీల దగ్గర ఈమధ్య విపరీతంగా జనం. ఉప ఎన్నికల కాలం కాబట్టి సహజమేనని ముందు ఎవరూ పట్టించుకోలేదు. ఈవెంట్ మెనేజర్ల దగ్గరా అదే పరిస్తితి.తీర్దయాత్రలకాలం కాబట్టి ఇదీ సహజమేనని ఎవరూ పట్టించుకొలేదు. పెళ్ళిళ్ళు,వార్షికొత్సవాలూ జరిగేకాలమూ కాదు.
బస్టాండులకు వెళ్ళినా,రైల్వే స్టేషన్లకు వెళ్ళినా సేం టు సేం.టిక్కెట్లన్నీ ఎప్పుడో అయిపోయాయి.పైగా బస్సులు బస్సులుగా,బొగీలు బొగీలుగా రిజర్వు అయిపోయి ఉన్నాయి.
ఏమిటీ జనం ఇంతలా టురిజం మీద పడ్డారు ?
అని ప్రభుత్వం,దాని అధికారులు కాస్త ఆశ్చర్యపోయారు.బాధలకు,ఎండలకు,వానలకూ తట్టుకొలేక తిరుపతి,కాశీ,షిర్డీ,పూరి జగన్నధ యాత్రలకో,అమరనాధ యాత్రలకో పొతున్నట్టున్నారు అనుకున్నరు వాల్లంతా. కాని జనం వెలుతున్న ఊర్ల పేర్లు చూసి మహా ఆశ్చర్యపోయారు.ఆ ఊళ్ళలో టురిజం ఏముందీ.. అందులొనూ వానాకాలంలొ?
ట్రవెల్ ఎజెన్సీల వాళ్ళనడిగారు.బస్సు ఆపరెటర్ల నడిగారు.ఈవెంట్ మెనెజర్ల నడిగారు.అందరూ రెట్లు,ఏర్పాట్ల గురించె చెప్పారు.కుటుంబాలకు కుటుంబాలు,ఊళ్ళకు ఊళ్ళు వెలుతున్నరు ఏమిటీ సంగతీ అనడిగారు.
‘ఓదార్పు యాత్ర’ చెప్పారు వాళ్ళు.‘ఎవర్ని ఓదార్చటానికీ?’
‘మాలాగే నీళ్ళు దొరక్క ఇబ్బంది పడుతున్న జనాన్ని,
మాలాగే గిట్టుబాటు ధరలు దొరక్క అవస్తలు పడుతున్న రైతుల్ని,
మాలాగే వైద్యం దొరక్క కష్టపడుత్టున్న ప్రజల్ని,
మాలాగే అధిక దరలతొ సతమతమవుతున్న మనుషుల్ని,
మాలాగే అప్పుల్లొ కూరుకుపోయిన ప్రజానికాన్ని,
మాలాగే భూములు కోల్పోతున్న భాదితుల్ని
పరామర్శించడానికి,ఓదార్చటానికి,ధైర్యం చెప్పటానికి వెళుతున్నాం’
అనిచెప్పారు వాళ్ళు.
‘ఓదార్పు’
ట్రావెల్ ఎజెన్సీల దగ్గర ఈమధ్య విపరీతంగా జనం. ఉప ఎన్నికల కాలం కాబట్టి సహజమేనని ముందు ఎవరూ పట్టించుకోలేదు. ఈవెంట్ మెనేజర్ల దగ్గరా అదే పరిస్తితి.తీర్దయాత్రలకాలం కాబట్టి ఇదీ సహజమేనని ఎవరూ పట్టించుకొలేదు. పెళ్ళిళ్ళు,వార్షికొత్సవాలూ జరిగేకాలమూ కాదు.
బస్టాండులకు వెళ్ళినా,రైల్వే స్టేషన్లకు వెళ్ళినా సేం టు సేం.టిక్కెట్లన్నీ ఎప్పుడో అయిపోయాయి.పైగా బస్సులు బస్సులుగా,బొగీలు బొగీలుగా రిజర్వు అయిపోయి ఉన్నాయి.
ఏమిటీ జనం ఇంతలా టురిజం మీద పడ్డారు ?
అని ప్రభుత్వం,దాని అధికారులు కాస్త ఆశ్చర్యపోయారు.బాధలకు,ఎండలకు,వానలకూ తట్టుకొలేక తిరుపతి,కాశీ,షిర్డీ,పూరి జగన్నధ యాత్రలకో,అమరనాధ యాత్రలకో పొతున్నట్టున్నారు అనుకున్నరు వాల్లంతా. కాని జనం వెలుతున్న ఊర్ల పేర్లు చూసి మహా ఆశ్చర్యపోయారు.ఆ ఊళ్ళలో టురిజం ఏముందీ.. అందులొనూ వానాకాలంలొ?
ట్రవెల్ ఎజెన్సీల వాళ్ళనడిగారు.బస్సు ఆపరెటర్ల నడిగారు.ఈవెంట్ మెనెజర్ల నడిగారు.అందరూ రెట్లు,ఏర్పాట్ల గురించె చెప్పారు.కుటుంబాలకు కుటుంబాలు,ఊళ్ళకు ఊళ్ళు వెలుతున్నరు ఏమిటీ సంగతీ అనడిగారు.
‘ఓదార్పు యాత్ర’ చెప్పారు వాళ్ళు.‘ఎవర్ని ఓదార్చటానికీ?’
‘మాలాగే నీళ్ళు దొరక్క ఇబ్బంది పడుతున్న జనాన్ని,
మాలాగే గిట్టుబాటు ధరలు దొరక్క అవస్తలు పడుతున్న రైతుల్ని,
మాలాగే వైద్యం దొరక్క కష్టపడుత్టున్న ప్రజల్ని,
మాలాగే అధిక దరలతొ సతమతమవుతున్న మనుషుల్ని,
మాలాగే అప్పుల్లొ కూరుకుపోయిన ప్రజానికాన్ని,
మాలాగే భూములు కోల్పోతున్న భాదితుల్ని
పరామర్శించడానికి,ఓదార్చటానికి,ధైర్యం చెప్పటానికి వెళుతున్నాం’
అనిచెప్పారు వాళ్ళు.
Monday, 23 August 2010
ఒక షార్కూ ... తాజా చేపలూ!
ఒక షార్కూ ... తాజా చేపలూ
జపాన్ వాళ్లకు చేపలంటే భలే ఇష్టం. చుట్టూ సముద్రమే కాబట్టి వాళ్లకు కావాల్సిన దానికంటే ఎక్కువ చేపలే దొరుకుతుండేవి ఇన్నాళ్లూ. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.
దగ్గరి సముద్ర జలాల్లో చేపలు దొరకడం మానేసాయి. కాలుష్యమో థర్మల్ ప్లాంట్లో ఏదో కారణమన్నారు.
మత్స్యకారులు చేపల కోసం దూరం వెళ్లాల్సి వచ్చింది. చిన్న పడవలు సరిపోక పెద్దవి చేయించుకున్నారు.
అక్కడ చేపలైతే దొరికాయి. కాని అంత దూరం నుండి తెచ్చేసరికి తాజాతనం ఉండక జనం కొనలేదు.
ఫిషింగ్ కంపెనీలు రంగప్రవేశం చేసి తమ పడవలకు ఫ్రీజర్లు అమర్చుకున్నాయి. దాంట్లో చేప్చల్ని భద్రపరిచి తెచ్చి అమ్మినా జనం కొనలేదు. ఎందుకంటే ఫ్రోజెన్ చేపలు నచ్చలేదు వాళ్లకు. దాంతో ఆ చేపల్ని తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చేది. ఈసారి కంపెనీల వాళ్లు పడవల్లోనే నీళ్ల ట్యాంకులు ఏర్పాటు చేసుకుని వాటిల్లో చేపలు వేసి తీసుకురాసాగారు. అయితే వాటిల్లో ఈదడానికి కాదు కదా కదలడానికి కూడా చోటు ఉండకపోవడంతో చేపలు మందకొడిగా తయారై తాజాదనం కోల్పోయేవి. జపాన్వాళ్లకు వాటి రుచీ నచ్చలేదు. అప్పుడు కంపెనీలు ఏం చేశాయో తెలుసా! ఆ ట్యాంకుల్లో మామూలు చేపలతో పాటు ఒక షార్క్ చేపనీ వేయసాగాయి. షార్క్ సంగతి తెలుసుగా మీకు? చేపలే దాని ఆహారం. షార్క్లు చేపల్ని తినేస్తే మరి వాళ్లకు ఏమిటి లాభం అనకండి. ఉంది. షార్క్ నుంచి తప్పించుకోవడానికి చేపలు ఆ ట్యాంకుల్లోనే చురుకుగా తిరుగుతూ ఉంటాయి కదా. వాళ్లకు కావల్సింది అదే. కొన్ని చేపలు పోతేనేం జనానికి మార్కెట్లో తాజాచేపలు దొరుకుతాయి. అబ్బ జనమంటే ఎంత ప్రేమ కంపెనీల వారికి అనుకోకండి. తాజాచేపల్ని ఎంతకైనా కొనే జనం అభిరుచి పట్లే వారి ప్రేమంతా.
నీతి : 1. శత్రువు ఉన్నప్పుడే మనం చురుగ్గా ఉంటాం.
2. జనానికి ఏది ఇష్టమైతే ముందుగా దాన్ని దూరం చేసి తర్వాత ఎక్కువ రేటు పెట్టి అమ్మాలి.
Sunday, 15 August 2010
ఒక వల - ఏడు పార్టీలు
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఒక వల - ఏడు పార్టీలు
సండే కామెంట్ఒక వల - ఏడు పార్టీలు
అనగనగా ఏడు పార్టీలు.ఏడు పార్టీలూ ఓట్ల వేటకెళ్లి ఏడు చేపలు తెచ్చుకుని ఎండబెట్టుకున్నాయి.అన్నీ ఒక సైజువి కాదు కనక ఒకేసారి ఎండలేదు. ముందుగా పెద్ద చేప ఎండడంతో ఆ చేపను వలేసి పట్టిన రాజు దాన్ని కోసి తన వాళ్లందరికీ చిన్నా పెద్దా ముక్కలు పంచిపెట్టాడు.ఇంతలో రాజు చనిపోయి మరో రాజు సింహాసనాన్ని అధిష్టించాడు.ముక్కలు ఇచ్చిన రాజుకే విధేయంగా ఉంటామని వాటిని తీసుకున్న వాళ్లు మొండికేసి కొత్త రాజును ముప్పుతిప్పలు పెట్టసాగారు.ఇచ్చిందెవరైతేనేం? బొక్కసంలో నుంచి వచ్చిన డబ్బుతోనే కదా వలను కుట్టించింది. దాన్ని విసిరిందీ, దానితో అతి పెద్ద చేపను పట్టిందీ కూడా రాజరికపు సొమ్ముతోనేనాయె. మీరు విధేయంగా ఉండాల్సింది వలకు కాని, వల విసిరిన వాళ్లకు కాదు కదా అని కొత్త రాజు నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించాడు.వాళ్లు... వింటేనా!వల గొప్పతనం గురించి నువ్వు మాకు కొత్తగా చెప్పనక్కర్లేదు. వలలు పేనీపేనీ పైకొచ్చిన వాళ్లమే మేమూ. లేకపోతే చేపముక్కలు మాదాకా ఎలా వచ్చేవి? ఆకర్షణీయమైన అతి పెద్దవల నేయడం అందరికీ చేతకాదు. నీకు అసలే రాదు. అందుకే మళ్లీ వేటకెళ్లినపుడు నువ్వొక్క చేపా తేలేవని మా అనుమానం... అన్నారు వాళ్లు.నిజమే. మీకందరికీ సరిపడేంత పెద్ద చేపను వలేసి పట్టే శక్తి నాకు లేదు. కాని ఇప్పటికే మీరు మింగిన చేపముక్కల్లో ఉన్న ముళ్లు మీ కడుపుకు గుచ్చుకునేలా మాత్రం చేయగలను. ఆ ముళ్లు మీరు పీక్కునేదాకా నేను నిశ్చింతగా రాజ్యం ఏలవచ్చును... అనుకున్నాడు కొత్త రాజు.మిగతా ఆరు పార్టీలూ ఈ చోద్యం చూస్తూ నిలబడి ఉండగా వాళ్లు ఎండబెట్టిన ఆరు చిన్నాచితకా చేపల్లో ఎక్కువ భాగం మళ్లీ నీళ్లలోకి జారుకోవడం మొదలుపెట్టాయి.వచ్చేసారి చేపల్ని పట్టడం మరింత కష్టమయ్యేలా ఉందని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి నిట్టూర్చారు.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
Popular Posts
-
1. వైజాగ్ లో రేవ్ పార్టీ లో దొరికిపోయిన హీరోయిన్ 2. బన్నీ (అల్లు అర్జున్) గురించి సమంతా ఏమందంటే ... 3. పవన్ కళ్యాణ్ పై హన్సిక సంచలన కామ...
-
ఈ మద్య హీరోయిన్స్ బాత్రూం వీడియో లు అంటూ నెట్ లో చాలా హంగామా జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయం పై హీరోయిన్స్ తలలు పట్టుకుంటున్నారు. మొన్న త్రి...
-
ఓ తల్లిపాలు తాగిన వాళ్ళంతా అన్నదమ్ములు అయితే, ఒకే నది నీళ్లు తాగి బ్రతికేవాళ్ళం అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు కాలేమా ఇదే కె.సి.ఆర్ ని ఆగ్రహ...
-
త్రిష ఆ ఫోటో ఎందుకు పెట్టిందబ్బా ? ఎక్కువగా చదివినవి: 1.నెట్ లో హల్ చల్ చేస్తున్న సొనక్షి సిన్హా MMS హాట్ వీడియో .. 2. చరిత్రకు న...
-
ఇక్కడ చదవండి Click Here to Read ఈ రోజు ప్రత్యేకం :Most Popular Today#Trending 1. వర్మ కామెంట్ తో మేగాభిమానుల ఫైర్ 2. మరో హీరోయి...
-
Kangana Ranaut is a Bollywood actor who made her acting debut in 2006 when director Anurag Basu spotted her at a coffee shop in Mumbai ...