Monday 14 February 2011

ఆకాశంలో నా ఊహలు


ఆకాశంలో నా ఊహలు

అబ్బ ఊహల ఊయల ఎంత బాగుంటుందోకదూ?ఒక్క సారి ఊహల ఊయల ఊగేద్దామమరి?

కంది పప్పు కిలో రెండు రూపాయలు.బియ్యం కూడా కిలో రెండు రూపాయాలకే దొరుకుతున్నాయట.
కూరగాయలైతే కిలొ అర్ద రూపాయి దాటి లేదు.బంగారం తులం మీద వంద రూపాయలకే వస్తుందట.


ఇళ్ళ స్తలాలు కూడా గజం వంద రూపాయలేకేనట.అపార్ట్మెంట్ల బాగోతం పోయి
అంతా ఇందిపెండెంత్ ఇళ్ళు కట్టుకుని పెరటిలో కూరలూ,వీధి వైపు స్తలంలో పూల మొక్కలు కనువిందు చేస్తూ
ఆహ్లాదంగా వున్నాయి.రైతులకి పంటలన్నీ విపరీతంగా పండి ఎంతో ఆనందంగా ఉన్నారు.ప్రతినిత్యం సంక్రాంతి
లానే ఉంది.

ప్రతి మనిషీ మోసం మాయ ఏదీ లేక,ఏ గొడవలూ లేకుండా ఎంతో సక్యతగా సంతోషంగా ఉన్నారు.

ఇక తిరుపతిలో క్యూ అనేది లేదట.వెళ్ళినవాళ్ళు వెళ్ళినట్లుగానే దర్శనం చేసుకొని బయటకు వఛేయటమే.
లడ్డూలు అడిగినవారికి అడిగినన్ని ఇచ్చేస్తున్నారు.భక్తులు ఆనందంతో తన్మయత్వం చెందుతున్నారు.
ఆహా ఏమి ప్రజల అద్రుష్టం.రాజకీయనాయకులు కూడా మామూలుగా మాదిరి ఇళ్ళలో ఉండి వారికి ఉన్న ఆస్తులన్నీ బీదవారికి పంచి ఇచ్చి
ప్రజల మనసులో దైవాల మాదిరి కొలొపించుకుంటున్నారు.అవును ఇదంతా నా ఊహా చిత్రమే!

Popular Posts