Saturday, 25 February 2012

Was Einstein wrong - or was the cable loose?


The world of science was upended last year when an experiment appeared to show one of Einstein's fundamental theories was wrong - but now the lab behind it says the result could have been caused by a loose cable.

Physicists at the CERN laboratory near Genevaappeared to contradict Albert Einstein last year when they reported that sub-atomic particlescalled neutrinos could travel fractions of a second faster than light.




Einstein had said nothing could ever travel faster than light, and doing so would be like traveling back in time.




But James Gillies, a spokesman for CERN, said on Wednesday the lab's startling result was now in doubt.




Earlier on Wednesday, ScienceInsider, a website run by the respected American Association for the Advancement of Science, reported that the surprising result was down to a loose fibre optic cable linking a Global Positioning System satellite receiver to a computer.




Gillies confirmed that a flaw in the GPS system was now suspected as a possible cause for the surprising reading. Further testing was needed before any definite conclusions could be reached, he added.




The faster-than-light finding was recorded when 15,000 neutrino beams were pumped over three years from CERN to an underground Italian laboratory at Gran Sasso near Rome.




"A possible explanation has been found. But we won't know until we have tested it out with a new beam to Gran Sasso," Gillies told Reuters in Geneva.




Physicists on the experiment, called OPERA, said when they reported it last September that they had checked and rechecked over many months anything that could have produced a misreading before announcing what they had found.




A second test whose results were announced in November appeared to provide further evidence that neutrinos were travelling faster than light. But many experts remained sceptical of a result that would have overturned one of the fundamental principles of modern physics.

Sunday, 12 February 2012

'Businessman' throws rules to the winds..!


HYDERABAD: Whether 'Businessman' that is being touted as the 'biggest box office hit' in the 81-year-old history of the Telugu film industry' is the subject matter of debate, but surely Mahesh Babu-starrer is breaking rules.
The movie has violated provisions of the Cinematograph Act and the Central Board of Film Certification (CBFC) has been taken for a ride. This pertains to the title of the movie. The CBFC cleared the movie with the title 'The Businessman' but the filmmakers have dropped 'The' on their own. The publicity of the film is being done without the definite article.
In fact, the Andhra Pradesh Film Chamber of Commerce, too, through a letter on January 1, 2011 had cleared the registration of the film title as 'The Businessman'. The title was also renewed up to April 22, 2012.
However, the definite article is missing from the posters and other publicity material of the movie which was released on January 13. Curiously, a set of publicity posters submitted to the CBFC for certification carry the full title.
According to sources, such violation - publicizing a movie with change in title - is an offence and punishable up to three years of imprisonment and also with a fine. Clearly, R R Movie Makers, the producers of the film, showed no respect for rules and regulations as laid down by the Cinematograph Act.
The movie which is running for the successful fifth week has also courted controversy for other reasons. Another glaring omission was 'A' certification. A film which is given 'A' certification is meant for only adults. This prompted some activists to lodge a complaint with the police.
Taking objection to the lyric 'Bad boys...' in the film, VHP activists also lodged a complaint with the police. But the police failed to take these violations to the notice of CBFC. The length of cuts the film was subjected to by censors shows to what depths film director Puri Jagannadh stooped to in projecting obscenity, including liberal doses of 'f...' word.
Strange as it seemed, film hero Mahesh Babu justifies the existence of the mafia in settling problems. In the film, the hero even goes to the extent of suggesting that those who do not have a purpose in life would do better to commit suicide rather than be a burden on the earth.

Tuesday, 3 January 2012

The 2012 pole shift has started

When I first started the website December212012.com back in August 2005, I warned you about a coming pole shift. At that time the earth’s magnetic pole was about 2 to 3 degrees to the right of true geographic north. Scientists have now determined that the magnetic poles has moved even further north and will continue to move causing major concerns.

On January 7th the main stream media informed us that this slow but steady shift is having an effect on the airline industry. As a result, the Tampa International airport and airports around the world are being forced to make changes to their runway marking to adjust for this irregularity of onboard composes. Please view this video:

http://www.youtube.com/watch?v=akBvr_ZUCro&feature=player_embedded&noredirect=1

Let me try to explain what is going on. Envision the earth itself as a clock, and the internal magnetic poles of the earth as the hands on that clock. The hands of this clock were originally pointing geographically at 12 o’clock due north and 6 o’clock due south and have been there for about 26,000 years. Our sun and the center of our Milky Way Galaxy directly influence these poles (hands), which are influenced by other surrounding planets and galaxies and so on and so forth throughout the entire universe.


On the winter solstice of 1999, which I call the beginning of a 13-year tribulation, the poles began to move in relationship to the universal cycles. Scientists are now telling us that the hand-pointing north is now at 10 minutes past 12 o’clock, and the south facing hand has moved 10 minutes towards 12 o’clock. This gradual movement of the poles (hands) is not only having and effect on composes, but is having a direct influence on the earth it self. The effected influence on earth’s crust is causing an increase in the number and intensity of natural disasters such as earthquakes. While at the same time the external influences of the sun and Milky Way Galaxy are effecting our atmosphere which is the reason for the increased weather patterns such as tornadoes and rainfall that is bringing widespread flooding around the world.
As the magnetic poles continue to shift, we can expect to see even more earthly and atmospheric disasters. The earth will continue to violently quake, devastating entire regions, the sun will thrust massive solar flares in our direction destroying the electric and communication grids, and people who are not prepared will die in number we have never seen before.
The coming pole shift is simply part of a grand universal cycle of events. These events will continue to occur until such time as the universe comes back into alignment. From our standpoint here on earth, we can only realize a small part of this universal realignment, which we recognize as the December 21 2012 galactic alignment of the sun, earth and center of the Milky Way Galaxy. This event will mark the end of our 13-year tribulation period, and will bring peace and stability back to our planet for another 26,000 +/- years.
You’re not going to hear a lot about the continuing pole shift from the news and government sponsored scientists for fear of causing a worldwide panic. Instead, you will hear about and even witness for yourself the increasing natural disasters and unusual weather events that are taking place all over the world. Just know and realize that these events are taking place right now, and don’t be surprised when they start happening in your own back yard.

Saturday, 17 September 2011

150 వ సినిమా రహస్యం!

లవ్ పై డిఫరెంట్ సినిమా తీయాలని ఒక డైరెక్టర్ కంకణం కట్టుకున్నాడు.రచయితకి కాకితో కబురంపితే,రెక్కలు కట్టుకుని వాలాడు.
"హీరోయిన్ ని హీరో ప్రేమిస్తాడు.కానీ అది ప్రేమని తెలియదు.హీరోపై హీరోయిన్ కి ఇది.అదేంటో తెలీయదు."చెప్పాడు డైరెక్టర్.
"ఎవరికీ ఏమీ తెలీయక పోవడమే సినిమాకి సగం బలం."అన్నాడు రచయిత.
"ఏమీ తెలీయకపోయినా ముద్దుల వరకూ వస్తారు."
"ముద్దులతో ప్రారంభమైన ప్రతి ప్రేమా చివరికి మిస్టరీగా ముగుస్తుంది."
"హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఒకాయనకి బాగా తెలుసు.ఆయనో ఫిజిక్స్ లెక్చరర్.ఈయన రకరకాల ఉపన్యాసాలతో,ఫ్లాష్ బ్యాక్ లతో సినిమాను ముందుకు నడిపిస్తుంటాడు."

"ఈయనకి వేరేపని లేదా?"
"ప్రేమికులని కలపడమే పని"
"కంటికి కనిపించేదేదీ నిజంకాదనే ఫిలాసఫర్ ఒకాయనుంటాడు.ఈయన విలన్."
"ప్రేమించి పెళ్ళిచేసుకున్న తరువాత లవర్సే విలన్లు.మళ్ళీ వేరే విలన్లు అవసరమా?"
"లాజిక్ ని తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరు.హీరో లేకపోయినా చూస్తారుకానీ,విలన్లు లేకపోతే చూడరు.మన విలన్ వయసులో ఉన్నప్పుడు ఆరుగురుని ప్రేమించాడు."
"ఆరుగురూ తిరస్కరించారా?"
"అంగీకరించారు అందుకే ఫిలాసఫర్ గా మారి ప్రేమికుల్ని విడదీస్తూ ఉంటాడు."

"కలిపేవాడున్నప్పుడు విడదీసేవాడూ ఉంటాడు.ఇంతకీ సినిమా పేరేంటో?"
"మార్ దో గోలీ.హీరోకి గోలీసోడాలంటే ఇష్టం.రోమ్మ్ లో గోలీసోడాలమ్ముతున్నారని తెలిసి హెలికాఫ్టర్ లోనుంచి పరాచూట్ లో దిగి బ్లాక్స్ తో ఫైట్ చేసి సోడా సాధిస్తాడు."
"సోడా కోసం ఇంత ఎపిసోడా?"
"మంచినీళ్ళకోసం ఈమద్య ఒక హీరో ఎడారి దుమ్ములో దొర్లుతూ ఎడపెడా ఫైటింగ్ చేస్తే జనం 'ఖలేజా' తో చూసారా లేదా?"
"ఒప్పుకుంటా తర్వాత సీన్ నేనుచెబుతా.గోలీసోడా చేత పట్టుకొని పాతిక మంది బ్రిటీష్ దాన్సర్లతో 'సోడా,బీరా,నీకు సరి జోడా మగాడా' అని సాంగ్. "
"రచయిత కథ చెప్పినా చెప్పకపోయినా పాటలూ,ఫైటింగులు చెబితే చాలు.మన సినిమాలో థీమ్మ్ సాంగ్ కూడా ఉంది.హీరో హీరోయిన్లు కనిపించినపుడల్లా 'ప్రేమా, దోమా, చీమా, రామా, భీమా తింటావా ఖీమా' అని పాట."
"హీరో హీరోయిన్లు ప్యారిస్ ఎయిర్ పోర్ట్ లో ఒకరినొకరు చూసుకొనిలండన్ లో దిగుతారు.నైట్ క్లబ్ లో కలుస్తారు.ఇద్దరూ తెలుగు వారనే విషయం వాళ్ళకి తెలీయదు."
"కానీ వాళ్ళు ఎప్పటికైనా తెలుగు మాట్లాడతారనే విషయం ఆడియన్స్ కి తెలుసు"
"అక్కడే మనం వాళ్ళని ఫూల్స్ చేస్తాం.సినిమాలో హీరో చాలాసేపు ఇంగ్లిష్ లో,కాసేపు ఆఫ్గనీ లో మాట్లాడతాడు.ప్రేక్షకులు గోల చేస్తారని అనుమానం వచ్చినపుడు మాత్రం తెలుగులో గొనుగుతాడు."
ఇంతకూ హీరో హీరోయిన్లు కలుసుకుంటారా లేదా?
"కలుసుకుంటారు,డాన్స్ చేస్తారు.ముద్దులు పెట్టుకుంటారు,విడిపోతారు.అప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంటరై ఈ కాలంలో దోమలే తప్ప ప్రేమలు లేవంటాడు.ఒకప్పుడు తన మిత్రుడు రామ్మ్ అనే ఆయన సన అనే అమ్మాయితో మాట్లాడటానికి,కలుసుకోవడానికి ఎన్ని అవస్తలు పడ్డాడో చెబుతాడు."
"ఆ కాలంలో సెల్ ఫోన్ లు లేవు కాబట్టి ఎవడి చావు వాడు చచ్చేవాడు.ఇప్పుడేం ఖర్మ."
"ఈ సెల్ ఫోన్ ల వల్ల ప్రమ గుడ్డిదేకాదు,చెవిటిది కూడా అయిపోయింది."
"ప్రేక్షకులు మూగపోకుండా కథ నడపండి?"
రామ్మ్ కి అప్పడాలంటే ఇష్టమని సన ఒక అర్ధరాత్రి వేయించి మరీ తినిపిస్తుంది.ఇది ప్రేమంటే.."
"కుర్ కురే లాగా కరకర మంటోంది.విలన్ ఎంట్రీ ఎప్పుడు?"
"మన వాడు ఉపవాసాలూ,ఫ్లాష్ బ్యాక్ లూ విని,తనలో పుట్టింది ప్రేమని తెలుసుకొనేలోగా విలన్ వచ్చి కంటికి కనిపించే అప్పడాలు నిజం కాదంటాడు.ప్రేమ వరకూ కలర్ ఫుల్ గా ఉంటుందనీ,పెళ్ళి తరువాత వచ్చే బ్లాక్ అండ్ వైట్ రీల్ తాను చూపిస్తానని 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళతాడు."
"రొమాన్స్ లో అంబులెన్స్ ఎందుకో ?"
"అదే క్లైమాక్స్ .ఆస్పత్రి బెడ్ పై బ్యాండేజీతో ఉన్న శాల్తీని చూపి అతడే రామ్మ్ అంటాడు.ఒకప్పుడు అప్పడాలు ప్రేమగా తినిపించిన సన,తర్వాతికాలంలో అప్పడాల కర్రతో చావబాదడం వల్ల ఇలా కోమాలోకి పోయాడని చెబుతాడు.హీరో ఆలోచనలో పడతాడు .దీనికి రెండురకాల ముగింపులిచ్చి దియేటర్ లో వదులుతాం.జనానికి ఏది నచ్చితే దాన్ని కంటిన్యూ చేద్దాం."
కట్ చేస్తే ...?
జనం ఏ ముగింపూ చూడకుండానే సగంలోనే గేట్లుదూకి పారిపోయారు."

Tuesday, 26 July 2011

దేవుడికే దడ పుట్టింది!


స్వర్గ లోకం లో అన్ని రాష్ట్రాల దేవుళ్ళు కూర్చుని మూడు ముక్కలాట ఆడుకుంటున్నారు.

ఇంతలో 'పెద్ద ' దేవుడొచ్చి..."ఇక మీదట మీకు టైం పాస్ కావాలంటే పేకాడాల్సిన అవసరం లేదు. రేపు మన లోకానికి ఒక హోం థియేటర్ తెప్పిస్తున్నాను. హాయిగా సినిమాలు చూడొచ్చు" అన్నాడు.
చేతుల్లొ ఉన్న పేకలు గాల్లొకి ఎగరేసి చప్పట్లు కొట్టి ఈలలు వేసారు దేవుళ్ళందరూ.

పెద్ద దేవుడు - "మీరంతా ఈ సారి సెలవులకు మీ మీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి మంచి మంచి సినిమాలు పట్టుకురండి. అందరివి చూసాక అందులో బెస్ట్ అనిపించుకున్నవి మాత్రం ప్లే చేస్తాను...ఎమంటారు" అన్నాడు.

మిగతా దేవుళ్ళంతా "హై హై నాయకా..హై హై నాయకా" అని అరుచుకుంటూ వెళ్ళిపొయ్యారు.

తెలుగు దేవుడు ఆంధ్రప్రదేశ్ లో దిగాడు. ప్రయాణం వల్ల బాగా అలసిపొయ్యినట్టున్నాడు. ఒళ్ళు విరుచుకుని, పక్కన్నే ఉన్న టే కొట్టుకు వెళ్ళాడు. ఒక టీ చెప్పి, న్యూస్ పేపర్ తీసాడు..ఊళ్ళో ఏ తెలుగు సినిమాలు ఉన్నాయో చూద్దామని. ఉన్న వాటిలొ సగానికి పైగా డబ్బింగ్ సినిమాలు. 'ప్రేమ సంయోగం', 'వీర దంచుడు ', 'జాతీయ పాట ' టైటిల్స్ మాత్రం గుర్తుండిపొయాయ్ దేవుడికి.

స్వర్గ లొకంలొ జరిగే ఫిలిం ఫెస్టివల్ కు మంచి సినిమాలు సెలెక్ట్ చెయ్యాలి, పేపర్లలో వెతుక్కుని ,థియేటర్లకు వెళ్ళి చూస్తూకూర్చుంటే జరిగే పని కాదని, ఒక వీడియో పార్లర్ కు వెళ్ళి ఓ 200 సినిమాలు అద్దెకు తీసుకుని ఎడా పెడా చూసేసాడు.

అలా ఎన్ని రోజులు గడిచాయో తెలియదు. సినిమాలన్నీ చూసాక దేవుడికి ఏమి చెయ్యాలో తోచలా...తను చూసిన ఆ రెండొందల సినిమాలలో ఓ ఐదు సినిమాలు తప్ప మిగిలినవన్నీ చెత్తా చెదారం....'యూత్ ','ఫాక్షన్ ' ట్రెండ్ల పేరిట వచ్చిన ఎన్నో నికృష్టమైన సినిమాలు చూసాడు పాపం.

ఈ రెణ్ణెల్ల మెదడు వాపు కార్యక్రమం తరువాత ఓ రోజు న్యూస్ పేపర్ తెరిస్తే అందులో "తెలుగు నిర్మాతల సంఘం అనువాద చిత్రాలను బహిష్కరించాలని నిర్ణయించుకుంది" అని ఉంది.

అంతే...తెలుగు దేవుడికి చిర్రెత్తుకొచ్చింది , తన శక్తులన్నీ ఉపయోగించి తెలుగు సినిమా ఇండస్ట్రి వాళ్ళనందరినీ రవీంద్ర భారతికి రప్పించాడు..

మన సినిమా హీరొల స్టైల్లొనే కొంచెం అతి ఆవేశంతొ మొదలెట్టాడు దేవుడు - "రేయ్ మూర్ఖుల్లారా....మన సినిమాలు ఆడాలంటే డబ్బింగ్ సినిమాలను నిషేదించటం కాదు మార్గం...పిచ్చి పిచ్చి 'ట్రెండ్ ' సినిమాలు తియ్యకుండా.. కాస్త బుర్ర పెట్టి ఎంటర్టైనింగ్ గా తీయండి, అప్పుడు ఎందుకు చూడరు మీ సినిమాలు జనాలు?"

ఆగి, పక్కనున్న గ్లాసు లొంచి గట గటా నీళ్ళు తాగేసాడు.

మూతి తుడ్చుకుని, " 'సూపర్ కుర్రాళ్ళు - the youth guys ' అనే సినిమా తీసిన గాడిద ఎవడు...ముందుకు రా రా..." పిలిచాడు దేవుడు
"ఆ సినిమా రిలీజ్ చేసేముందు ఒక్క సారైన చూసావా దాన్ని?" .

ఆ దర్శకుడు "చూడండి సార్..ఇప్పుడు యూత్ ట్రెండ్ నడుస్తోంది...మీకు అర్థం కాదు..." అని ఇంకా ఏదో అనబోతుండగా...

" 'యూత్ ట్రెండ్' ఎంట్రా నీ మన్ను...ఏమాత్రం నటించలేని ఓ నలుగురిని తీసుకొచ్చి..వాళ్ళకు ఒకే రంగు బాగులు తగిలించి.. ఈ భూప్రపంచం లో యే కాలేజిలోనూ జరిగే అవకాశమే లేని 'క్లాసు రూము ' సన్నివేశాలు ఓ పది తీసి...సినిమా లో ఉండే విషయానికి ఏమాత్రం సంబంధం లేని టైటిల్ పెట్టి...అంతకన్నా దరిద్రమైన కాప్షన్ ఒకటి తగిలించి సినిమా రిలీజ్ చేస్తే....థియేటర్ లో ప్రొజెక్టర్ ఆపరేటర్ కూడా చూడడురా దాన్ని"

ఆ మాటలకు ముందు వరసలో కూర్చున్న సీనియర్ నిర్మాతల్లో ఒకరు "బాగా చెప్పారు...అస్సలు ఈ కొత్తవాళ్ళకు సమాజం పట్ల బాధ్యత లేకుండా పోతోంది.....సినిమా తీసెటప్పుడు స్క్రిప్టు పక్కాగా తయారు చేసుకుని వెళ్ళాలి..సీనియర్ రచయితల, దర్శకుల పర్యవేక్షణ లో తియ్యండయ్యా సినిమాలు" అన్నాడు.

దేవుడు ఆ నిర్మాత వైపు చూసి...."ఓ! మీరా సార్, మీ సినిమాలు కూడ ఓ నాలుగైదు చూసాను మొన్న ....వాళ్ళు తీసే సినిమాలు పనికిమాలినవైనా కనీసం కొత్త రకం చెత్త తీస్తున్నారు....మరి మీ సంగతి???? పాతికేళ్ళ నాటి కథలు, ముప్ఫై ఏళ్ళ నాటి డైలాగులు... రాసినవే మళ్ళీ మళ్ళీ రాసి, అతిశయోక్తి లేకుండా అర వాక్యం కూడ రాయలేని రచయితల్ని పెట్టుకుని సినిమాలు తీసేస్తున్నారే .. కొత్త కథలు, మంచి సంభాషణలు ఎక్కడి నుండి వస్తాయి భీష్ముడు గారూ??

" 'ఆడవాళ్ళ కోసం తీసిన సినిమా ' అని లేబిల్ తగిలించడం.అదే సినిమాలో అస్సలు అవసరం లేని బూతు పాటలు పెట్టడం, పరమ రిగ్రెస్సివ్ సన్నివేశాలు, డైలాగులతో సినిమాను రెండున్నర గంటల నిడివి నింపేయడం...

" 'ఇది కళ కాదు పెంకులూ కాదు, మేము కేవలం డబ్బు కోసం తీస్తున్నాము ' అని మీరు అంటే మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ రెండు రోజులకొకసారి..."మంచి సోషల్ మెస్సేజ్ ఉన్న సినిమా తీసాము...దీనికి 'ఉత్తమ చిత్రం ' అవార్డు రాకుంటే ఊరుకునేది లేదు "...అంటూ వాగుతూంటారే...మీకు అంతరాత్మ అనేది ఉందా..?
మీ లాంటి వాళ్ళను ఒక చీకటి గదిలో బంధించి 'దోమ కుడితె చికున్ గునియా...ప్రేమ కుడితే సుఖంగునియా ' అనే పాట వినిపించాలి"

ఓ రెండు సెకండ్లు ఏదొ ఆలొచిస్తున్నట్టు బుర్ర గోక్కుని మళ్ళీ ప్రారంభించాడు దేవుడు
"ఆ ఫాక్షన్ సినిమాల రచయితలు,దర్శకులు...ఇప్పుడు మీ వంతు,రండి ఫైకి ...ఆ వచ్చే ముందు...ఒక్కొక్కరు పది గుంజిళ్ళు తీసి రండి....
ఇన్ని 'రాయలసీమ ఫాక్షన్ ' సినిమాలు తీసారే...మీలో ఒక్కరికైన నిజంగా ఆ ఫాక్షనిస్టులు ఎలాగుంటారో తెలుసా??? చేతిలో కత్తులు, గన్నులతో ఎదురెదురుగా నుంచునప్పుడు...టీ లు, కాఫీలు తాగుతూ.. తీరిగ్గా అమ్మలను, అయ్యలను తిట్టుకుంటూ డైలాగులు చెప్పుకుంటార్రా ఎవరైనా??....ఐనా..ఒక్క సినిమాలో హీరో తొడ కొట్టినప్పుడు తెల్ల లుంగీ సందులోంచి చారల డ్రాయర్ కనిపించిందని...వరుసగా ఇరవై సినిమాలలో హీరోకు చారల డ్రాయర్ వేసి నిలబెడితే సినిమాలు హిట్టైపోవు"

"చివరగా మీలో ఉన్న ఇంకో ఆణిముత్యాన్ని పిలుస్తానుండండి" అని... మూలకు కూర్చున్న ఒక దర్శకుడిని పిలిచి "నీ పేరు...నువ్వు తియ్యబొయ్యే సినిమా గురించి అందరికీ చెప్పు" అన్నాడు దేవుడు.

ఆ దర్శకుడు అందరి ముందు నుంచొని "నా పేరు దినకర్...నా సినిమా చాల డిఫరెంట్ గా ఉంటుంది....ఇందులో క్లాస్, మాస్, లేడీస్ సెంటిమెంట్ అండ్ కామెడీ విత్ ఆక్షన్ బాక్డ్రాప్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి" అన్నాడు.

దేవుడు దినకర్ చెవు మెలి పెట్టి..."చూసారా...సినిమా పేరు తో వీడు చేస్తున్న అక్రమాలు....వీడా మన తెలుగు సినిమా భవిష్యత్తు???సంవత్సరానికి రెండు వందల తెలుగు సినిమాలు రిలీజ్ ఐతే...అందులో ఓ పదిహేను సినిమాలైన బాగా ఆడుతున్నాయా??? మిమ్మల్ని ఆర్ట్ సినిమాలు తియ్యమని ఎవ్వరూ అడగట్లేదు...మసాలా సినిమాలైనా మనోరంజకంగా తియ్యొచ్చు...వేరే భాష ల్లోనూ చెత్త సినిమాలు వస్తున్నాయి....కానీ వాళ్ళ మంచి సినిమాలు, ప్రయోగాత్మక సినిమాల శాతం మనకన్నా చాలా ఎక్కువ. అక్కడ బాగా ఆడిన సినిమాలను మన వాళ్ళు చక్కగా డబ్బింగు చేసి వదుల్తున్నారు....
అయితే, మూస వెధవల్లారా....ఒక్క డబ్బింగు సినిమా హిట్ అయ్యిందని...అరవం లో అడ్రస్సు లేని హీరోల సినిమాలు కూడా అనువదించి జనాల మీదకు తోస్తున్నారు కదరా"

ఇంతలో ఆకాశం లో పెద్ద ఉరుములు....దేవుడు పైకి చూసాడు..

పెద్ద దేవుడు ఆకాశం లో కనిపించి - "నాయనా...రానున్నది కార్తీక పౌర్ణమి...అంతలోపు నువ్వు తిరిగి రాకపొతే....దైవత్వము కోల్పొయ్యి శాశ్వతంగా భూలోకము మీద తెలుగు లో వచ్చే డబ్బింగు సినిమాలు, 'యూత్ ' సినిమాలు చూస్తూ ఉండిపోతావు" అన్నాడు.

దేవుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరితో - "నేను మా లోకానికి తిరిగి వెళ్ళిపోవాలి. ఇంకో సంవత్సరం లో మళ్ళీ వస్తా...అప్పటికైనా మన తెలుగు సినిమాల స్టాండర్డ్ కాస్త పెంచడానికి ప్రయత్నిచండి. జంధ్యాల, విశ్వనాథ్, బాపు, వంశీ లాంటి వాళ్ళు రెగులర్ గా తీసిన టైములో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. ఇప్పుడున్న దర్శకులలో 'సినిమా' మీద మంచి అవగాహన ఉండి, చక్కటి చిత్రాలు తీసే వాళ్ళు ఓ నలుగురున్నారంతే...ఆ సంఖ్య పెంచండి. మన సినిమాలను వేరే భాషల్లోకి అనువదించే లాగా తియ్యండి..కాదూ, కూడదు అని ఇలాగే చెత్త సినిమాలు తీస్తూ కూర్చుంటే......ఈసారి మీరు జరుపుకోవలసింది 'వజ్రోత్సవాలు ' కాదు...'బూడిదోత్సవాలు ' " అని మాయమైపొయ్యాడు..

"అన్ని తెలుగు సినిమాలు చూసిన ఎఫెక్ట్ వల్ల కాస్త ఓవరాక్షను డైలాగుల్తొ పేలినా మొత్తమ్మీద చాల నిజాలే మాట్లాడాడు ఈ దేవుడు" అనుకున్నాడు ఆ హాల్లొ ఉన్న ఒకే ఒక్క sensible శాల్తీ.

తను ఆ మీటింగుకి మైకు సెట్టు అరేంజ్ చేయటానికొచ్చినతను.

Monday, 25 July 2011

రు.700 కోట్ల జగన్ మహల్!



అక్కడెక్కడో ముకేశ్ అంబానీ భారీ భవంతిని కట్టాడని గొప్పలు చెప్పుకున్నాం కానీ, మనకు తెలియకుండానే, మన పక్కనే ఓ భారీ భవంతిని జగన్ నిర్మించాడని తెలుసుకోలేకపోయాం. జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై సీబీఐ విచారణ పుణ్యమా అని.. ఆ విషయం బయటపడింది. అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కలిసే.. లోటస్ పాండ్ దగ్గర ఉంది మనం చెప్పుకుంటున్న మహాసౌథం. అందుకే.. ఈ మహల్ కు లోటస్ మహల్ అని పేరు పెట్టుకున్నాడు జగన్. పైకి చూడడానికి మాములుగానే కనిపించినా, విషయమంతా అందులోకి వెళ్లిన వారికే తెలుస్తుంది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఈ నివాసంలోకి కొన్ని రోజుల క్రితం ప్రవేశించారు. 52263 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఐదంతస్తుల రాజభవనాన్ని చూసి వారు అవాక్కయ్యారు. ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వెళ్లడానికి సౌకర్యం కోసం పెద్ద సంఖ్యలో లిఫ్ట్ట్లులు, ఎస్కలేటర్లు ఉన్నాయి. 200 సీటింగ్ కెపాసిటీ గల ఓ మినీ థియేటర్, లైబ్రరీ, జిమ్, స్క్వాష్, టెన్నిస్,వాలీబాల్ కోర్టులు ఇందులోకి ప్రవేశించిన వారికి కనిపిస్తాయి. దాదాపు 30 బెడ్ రూములు ఈ మహల్లో ఉన్నాయి. దీని నిర్మాణంలో భాగంగా 24 బోగీల మార్భుల్ రాయిని రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. సాధారణ సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ సైజులో రూములు కడితే.. 60 గదులకు ఈ మార్బుల్ సరిపోతుందట. ఇక ప్రత్యేకంగా సెల్లార్ లో మూడు అంతస్తులు పార్కింగ్ కోసమే వదిలిపెట్టారు. లోటస్ మహల్ ఉన్న ప్లాట్ లోనే ఆఫీస్ కాంప్లెక్స్ , సేవకుల కోసం 20 క్వార్టర్లు, రెండంతస్తుల ఔట్ హౌస్ ప్రత్యేకంగా నిర్మించారు. లోటస్ పాండ్ సమీపంలోని హుడాహైట్స్ లో 2,3,4,6,7,8 ప్లాట్లను కొని ఈ మహాసౌథాన్ని జగన్ నిర్మించాడు. ఇందులో మూడొంతులు జగనుకు చెందితే, మరో వంతు ఆయన సోదరి షర్మిలాది. వాస్తవానికి ఈ భవనం విలువ బహిరంగ మార్కెట్లో 700 కోట్ల వరకూ పలుకుతుందని, అయితే, తెలంగాణ ఉద్యమం కారణంగా, ప్రస్తుతం 300కోట్ల వరకూ విలువ చేస్తుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

Monday, 18 July 2011

కొంపముంచిన మతిమరుపు.!

హాల్‌టికెట్ మరిచిపోయి ఎగ్జామ్‌కు వెళితే? పెనాల్టీతోనైనా ఎగ్జామ్ ఫీజు చెల్లించే ఆ చివరి రోజు కూడా మరిచిపోతే...? రిసీవ్ చేసుకోవడానికి కచ్చితంగా స్టేషన్‌కు వస్తానని చెప్పి, ఏ ఊరో వెళ్లిపోతే...? వ్యాపారి టాక్స్ చెల్లించాల్సిన లాస్ట్‌డేట్ మరిచిపోతే...? మ్యారేజ్ డే అన్న విషయమే మరిచిపోయి శ్రీవారు ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుంటే..? అన్నీ అతి ముఖ్యమైనవే! అయినా మరిచిపోవడమేమిటి? అదే మరి! కొన్ని విషయాలను మరిచిపోవడం వల్ల భారీ మూల్యమే చెలించుకోవలసి వస్తుంది.

వాటిలో కొన్ని తిరిగి పూడ్చుకునే అవకాశమే లేని నష్టాలు కావచ్చు. నిజానికి ఆ నష్టాల గురించి తెలియకపోవడం కూడా కాదు. అయినా మరిచిపోతుంటాం. ఒక విద్యార్థి ఫీజు కట్టడం మరిచిపోతే ఒక విద్యాసంవ త్సరమే చేజారిపోయినట్లే కదా! ఒక సంవత్సరం వృధాగా గడిచిపోయాక వచ్చే సంవత్సరం నాటికి ఆలోచనలు మారిపోవనేమీ లేదు కదా! పరిస్థితులు మారిపోవచ్చు. ఏడాది తరువాత మళ్లీ ఆ దిశగా వెళ్లడం సాధ్యమే కాకపోవచ్చు.

అహోరాత్రులు ఎంతో కష్టపడి చదివి, హాల్‌టికెట్ లేకుండా ఎగ్జామ్‌కు వెళితే ఏమిటి పరిస్థితి? మ్యారేజ్ డే మరిచిపోయిన శ్రీవారికి ఇంక ఆ ఏడాది పొడవునా వే ధింపులూ సాధింపులే కదా! నువ్వు ఉన్నావన్న ధీమాతో స్టేషన్‌లో దిగిపోతే నువ్వు ఆ విషయమే మరిచిపోయి అయిపు లేకుండా పోతే కొత్తగా సిటీకి వచ్చిన వారి గతేం కాను? ఈ విషయాల్లో ఎవరినో నిందించాల్సిన పనిలేదు.

అసలు మనల్ని మనమే క్షమించుకోలేం. తమాషా ఏమిటంటే ఇవేవీ మనం కావాలని చేసిన తప్పులు కావు. ఏవో పెద్ద అడ్డంకులు వచ్చి ఆగిపోయామని కూడా కాదు. వాటిని మరిచిపోవడమే సమస్య. ఎందుకిలా అవుతుంది?

కన్న వాళ్లే అన్నీ మోస్తే...
విద్యార్థులు ఫీజు లేదా హాల్ టికెట్ల విషయం మరిచిపోవడానికి కొన్ని సార్లు ఎగ్జామ్స్ తాలూకు ఒత్తిళ్లు కారణం కావచ్చు. ఇక కొందరి విషయంలో అయితే, తమకు సంబంధించినవన్నీ పేరెంట్సే చేసి పెట్టడం కారణంగా ఉంటుంది. అప్పటిదాకా తమ ప్రతి పనీ వారే చేశారు కాబట్టి, ఈ ఫీజులు, హాల్ టికెట్ల విషయాలు కూడా వారికి పట్టవు. అది తమ బాధ్యతగా అనిపించకపోవచ్చు. చివరికి హాల్ టికెట్ తెచ్చారో లేదో ఆ పేరెంట్స్‌ను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. త మలో ఇలా పేరుకుపోయిన ఉపేక్ష క్రమంగా ఒక మరుపుగా మారిపోవచ్చు.

మనసుకు నచ్చకపోయినా...?
కొన్ని పనులు ముఖ్యమైనవే కావచ్చు. కానీ, అవి మనసుకు నచ్చినవి కాకపోవచ్చు. ఇలాంటి విషయాల పట్ల అంతరంగంలో ఒక ఒక తిరస్కార వైఖరి ఉంటుంది. అందుకే ఆ పనుల పట్ల మనసు పట్టనట్లు ఉంటుంది. వాటిని మనసులోంచి బయటికి తోసేసే ప్రయత్నం కూడా చేస్తుంది. నచ్చని విషయాల పట్ల మనసులో దృఢమైన నిర్ణయం ఏర్పడదు. ఏదో బలంవంతంగా నిర్ణయానికి వచ్చేనాటికి ఆ గడువు కాస్తా దాటిపోతుంది. ఇతరుల బలవంతమే తప్ప తనకు ఏమాత్రం ఇష్టం లే నప్పుడు కూడా మనసులోంచి అది పూర్తిగా వైదొలగిపోతుంది.అది మరపు జాబితాలో చేరిపోతుంది. మెదడుకూ హృదయానికీ మధ్య చోటుచేసుకునే వైరుధ్యాలివి. ఇలాంటి పరిస్థితులో చాలా సార్లు హృద యానిదే పైచేయి అవుతుంది.

ఆత్మీయులకు దూరం కాలేక
కొన్ని సార్లు తాను ప్రేమించే వాటికి దూరం కాలేక కూడా మనసు ఇలాంటి వైఖరిని అలవర్చుకుంటుంది. ఐఐటి ఎంట్రన్సు రాసి సీటు వచ్చేస్తే ఎక్కడో దూరంగా వెళ్లాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులకూ, తోబుట్టువులకూ, మిత్రులకూ ఆత్మీయులకూ దూరంగా వెళ్లాలి. ఇది ఏమాత్రం భరించలేని మనసు పలాయనానికి సిద్ధపడుతుంది.

ఆ ఎగ్జామ్‌కు సంబంధించి ఫీజు చెల్లించకపోవడం గానీ, హాల్ టికె ట్ మరిచిపోవడం గానీ జరిగిపోతుంటాయి. ఇవన్నీ చేతన మనసుకు తెలియకుండానే జరిగిపోతాయి. పరీక్షల్లో కొన్నిసార్లు అన్ని ప్రశ్నలకూ సమాధానం రాయగలిగి కూడా కొంత మంది మధ్యలోనే విరమించుకుంటారు. ప్రతికూలమైన భావోద్వేగాలు, అనుభవాల నుంచి గాయాల నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటివి చోటుచేసుకుంటాయి.

వర్తమానాన్ని వదిలేస్తూ...
యువతలో ఎక్కువ మంది భవిష్యత్తు తాలూకు ఊహల్లో జీవించడాన్ని ఇష్టపడతారు. ప్రణాళికలన్నీ భవిష్యత్తుకు సంబంధించే ఉంటాయి. ఈ క్రమంలో వర్తమాన విషయాల మీధ «ధ్యాస బాగా తగ్గిపోతుంది. మనసంతా భవిష్యత్తే ఆక్రమిస్తే మనసులో వర్తమానానికి చోటెక్కడిది? వర్తమానంలో బాధ్యతల భారం ఉంటుంది. అందుకే చాలా మందికి భవిష్యత్తు తాలూకు ఊహల్లో గడపడమే హాయి అనిపిస్తుంది. చాలా మందికి వర్తమానం ఒక చేదు అనుభవం. అందుకే వర్తమానంలో చేయవలసిన చాలా పనులు వారి మదిలో ఉండవు. ఇలా నిజాలనుంచి దూరం జరిగే తత్వాన్ని డిసోషియేషన్ ఆఫ్ అమ్నేసియా అంటారు.

నిద్రలేమి...
జ్ఞాపకాలను స్థిరపరచడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. మానసిక ఒత్తిళ్లు తీవవ్రమైనప్పుడు కొందరిలో నిద్రలేమి మొదలవుతుంది. తాత్కాలిక నిద్రలేమి సమస్యలు అంత పెద్ద ప్రభావాన్ని చూపించకపోవచ్చు. కానీ, దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యలు క చ్ఛితంగా జ్ఞాపక శక్తిని దెబ్బ తీస్తాయి. ముఖ్యంగా ఎగ్జామ్స్‌కు ముందు యువతీ యువకులు తమ నిద్రా సమయాన్ని బాగా తగ్గిస్తారు. ఇది శారీరక , మానసిక ఒత్తిళ్లను పెంచుతుంది.

అలాగే తాను పనిచేసే సంస్థకు సంబంధించి ఒక పని తరువాత మరోపని వరుస పరంపరగా వచ్చిపడుతుంటే వ్యక్తిగతమైన విషయాల గురించి ఆలోచించే స్థితిని మనిషి కోల్పోతాడు. కుటుంబపరమైనవి, తన వ్యక్తిగతమైనవేవీ తనకు గుర్తు లేకుండా పోతాయి. ఇలాంటి స్థితిలో మన ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. అందుకు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ నిపుణుల సహకారం కూడా తెలుసుకోవాలి.

ప్లాన్ ఉంటే లేదు తంటా!
ఇష్టమైన పనులే అయినా అన్నీ ఒకసారే చేయలేం కదా! ఏది ఎప్పుడు చేయాలో వాటి ప్రాధాన్యతలను అనుసరించి ఒక ప్రణాళికా లేకపోతే అది కూడా ఒక ఇబ్బందే. పనులు పర్వతంలా ముందు పడి ఉన్నప్పుడు కూడా మనసు వాటినుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అన్నీ చేయాలనే ఆరాటంలో ఏ ఒక్కటీ చేయలేని పరిస్థితిలో పడిపోవచ్చు. ప్రణాళికలేని మనసులో ఒక అయోమయం నెలకొంటుంది. అయోమయం భయాన్నీ,ఆందోళననూ కలిగిస్తుంది.

అందుకే మనకున్న పనులన్నిటినీ ఒక ప్రణాళికా బద్ధం చేసుకోవ డం చాలా ముఖ్యం. వేరెవరూ ఈ పనిని తనంత బాగా చెయ్యలేరని కొందరు అన్నీ తామే చెయ్యాలనుకుంటారు. ఇది విపరీతమైన ఒత్తిడికి గురిచేసి చివరికి ఏ ఒక్క పనీ పరిపూర్ణంగా చేయలే ని స్థితికి చేరుకుంటారు. ఇవన్నీ వైఫళ్యాల వైపే నడిపిస్తాయి. పైగా పరిపూర్ణంగా చేయకపోవడం అలా ఉంచి చాలా పనులను పూర్తిగా వదిలేసే ప్రమాదం ఉంది. అందుకే పని విభజన కూడా చాలా ముఖ్యం.

బోర్డు మీద రాయాలి
జ్ఞాపకం ఉంటాయిలే అనే అతి నమ్మకం చాలా సార్లు ప్రమాదాల్లో పడదోస్తుంది. అందుకే అతి ముఖ్యమైన పనులను ఒక బోర్డు మీద పెద్ద అక్షరాలతో రాసి పెట్టుకోవాలి. వాటిలోనూ ఆ నెలలో చేయవలసినవి, ఆ వారంలో చెయ్య వలసినవి, ఆ రోజే చేయవలసినవి అంటూ కొన్ని విభాగాలుగా రాసిపెట్టుకోవాలి. అప్పుడింక మరిచిపోయే అవకాశం ఉండదు. అయితే ఏది ముందో ఏది వెనుకో ఆ క్రమాన్ని కూడా రాసుకోవాలి. ప్రాధాన్యతను బట్టే ఆ క్రమం ఉండాలి.

యోగా, మెడిటేషన్ విధి నిర్వహణ ఎంత ముఖ్యమైనా శరీరం అనుకూలించక పోతే ఏమీ జరగదు. అందుకే శారీరక ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలి. వ్యాధిగ్రస్తమై, శక్తిహీనమైన శరీరం ఏ బాధ్యతల పట్లా ఆసక్తి చూపదు. అందుకే పోషకాహారం తోపాటు ప్రతిరోజూ ఎంతో కొంత సమయాన్ని యోగా, ధ్యానాలకు కేటాయించాలి.       -Courtesy:Telugu News Paper.

Popular Posts