Monday, 31 December 2018

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో చాలా మంది టీవీలు చూడడం కంటే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఖాతాలను ఎక్కువగా వాడుతున్నారు. అందుకే ఇప్పుడు వాటికి క్రేజ్ బాగా పెరిగింది. క్రిష్ రూపొందిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ వారు నిర్మాతలకు భారీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

అప్పటివరకు సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ లేనప్పటికీ సినిమా ట్రైలర్ వచ్చి అంచనాలను అమాంతం పెంచేసింది. ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. దర్శకుడిగా క్రిష్ ఈ సినిమాకి నూటికి నూరు శాతం న్యాయం చేసి ఉంటారని అందరూ నమ్ముతున్నారు.

తన తండ్రి గెటప్ లో బాలకృష్ణ కూడా ఇమిడిపోయాడని అంటున్నారు. అందుకే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాకి భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు కలిపి పాతిక కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఆ రేటుకి బాలకృష్ణ సినిమా డిజిటల్ రైట్స్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది.

అమెజాన్ పైమ్ ఆఫర్ :- ఈరోజే ఉచితంగా సబ్‌స్కైబ్ అవ్వండి.. ఒక నెల రోజులు పాటు అన్ని సినిమాలూ చూసేయండి ఉచితంగా.

రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Sponsored: Amazon Prime India

Saturday, 29 December 2018

రాజమౌళి తనయుడు పెళ్ళిలో తారక్ రచ్చ

రాజమౌళి తన కొడుకు కార్తికేయ పెళ్లిని జైపూర్ లో జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకి సినీసెలబ్రెటీలు అందరు హాజరయ్యారు. వారిలో  ప్రభాస్, అనుష్క, రామ్ చరణ్, ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక నిన్న రాత్రి జరిగిన పార్టీలో తారక్ స్టేజ్ పై చేసిన రచ్చ మాములుగా లేదు.

దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో సందడి చేస్తుంది. మొదట కీరవాణి స్టేజ్ పై ఉన్న ప్రభాస్ ని ఓ ప్రశ్న అడగడానికి ప్రయత్నిస్తుంటాడు. డార్లింగ్ అని పిలుస్తూ....ఆడవారి వయసు చెప్పకూడదు, మగవాడి సంపాదన అడగకూడదు. అందుకే బాహుబలి సినిమాకు నువ్వు ఎంత పారితోషికం తీసుకున్నావని నేను అడగను అని అనే లోపు తారక్ స్టేజ్ పై మీదకు వచ్చేశాడు.

కీరవాణిని ఏడిపిస్తూ కొన్ని కామెంట్స్ చేస్తుండగా.... దానికి కీరవాణి తారక్ నీది ఎలిఫెంట్ కామెడీ అని అంటుంటే... మాకు తెలుసు అంటూ అక్కడున్న వారిని చూస్తూ ధన్యవాదాలు చెబుతుంటాడు. కీరవాణి తారక్ తారక్ అని ఎంతగా పిలిచినా పట్టించుకోకుండా కామెడీ చేస్తూనే ఉన్నాడు. ఆ వీడియో తారక్ అభిమానులుఆకట్టుకుంటుంది .Video Link

Friday, 28 December 2018

వినాయక్ వైజాగ్ థియేటర్ కూల్చివేత

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఈమధ్యన వైజాగ్ లో విమాక్స్ పేరుతో ఓ థియేటర్ కంప్లెక్స్ నిర్మించారు. ఆ కాంప్లెక్స్ వైజాగ్ లో జగదాంబ థియేటర్ల తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అందుకు కారణం వినాయక్ క్రేజ్ .... ఆ థియేటర్స్ లో ఉన్న ఫెయిసిలిటీ. వినాయక్ దర్శకుడుగా వెలుగుతున్న రోజుల్లో రెండు పాత థియేటర్లను కొని అధునాతన వసతులను ఏర్పాటు చేసి విమాక్స్ పేరుతో డెవలప్ చేశాడు.

అతి తక్కువ సమయంలో ఆ థియేటర్లు సిటీలో సెంటరాఫ్ అట్రాక్షన్ కదా, లోకల్ జనాలకు మేజర్ స్పాట్ గా మారాయి. అయితే ఇప్పుడు ఆయా థియేటర్లు కూల్చేస్తున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీకి ఆ థియేటర్ కాంప్లెక్స్ ను అమ్మేశాడట వినాయక్. ఆ సంస్థ అక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. అంటే ఆ థియేట‌ర్స్  త్వ‌ర‌లోనే కూల్చేస్తారని తెలుస్తోంది‌.

ఇక  వి.వి.వినాయ‌క్‌ ఈ కాంప్లెక్స్ అమ్మేయటాని కారణం ...మంచి రేట్ ప‌ల‌క‌డమే అని తెలుస్తోంది. అంతేతప్ప చాలా మంది భావిస్తున్నట్లు ఆర్దిక సమస్యలు ఏమీ లేవని, ఆయన వెల్ ఆఫ్ గా ఉన్నారని సమాచారం. ఇక వరస ఫ్లాఫ్ లతో ఉన్న వినాయిక్ ..సాయి ధరమ్ తేజ తో చేసిన మిస్టర్ ఇంటిలిజెంట్ సినిమా తర్వాత మరొక సినిమా కమిటవ్వలేదు. మంచి కథతో మళ్లీ స్టార్ హీరోతో ఆయన హిట్ కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు

Thursday, 27 December 2018

13 ఏళ్లలో తొలిసారి బికినిలో దర్శనమిచ్చింది

సినిమా రంగంలో ఏ టైములో చేయాల్సిన గ్లామర్ షో అప్పుడే చేయాలి. ఈ సత్యాన్ని హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఆలస్యంగా తెలుసుకుంది. జూనియర్ ఐశ్వర్యారాయ్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు చేసి విజయాలను అందుకుంది. కానీ, ఎందుకో ఎక్కువకాలంనిలదొక్కుకోలేదు . ఆమధ్య బాలాకిష్ణ సింహ సినిమాలో కనిపించి మెప్పించింది.

ఇప్పుడు హాట్ షోకి తెరలు తీసింది. మొదటి బికినీ ఫోటో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది స్నేహ ఉల్లాల్. ఫిట్నెస్ పరంగా బాగున్నా....ఇప్పటికే ఆలస్యం అయిపొయింది కాబట్టి, మిగిలినవారికి ఉన్న ఫాలోయిన్ తనకు లేదు. అయితేనేమి స్నేహ ఉల్లాల్ ఇప్పటి నుంచి ఇది కొనసాగిస్తున్నానని చెబుతుంది.  స్నేహ ఎంట్రీ ఇచ్చింది 2005లో. ఇప్పటికి 13 ఏళ్ళు గడిచింది.

సల్మాన్ ఖాన్ లక్కీతో పరిచయమైన స్నేహకు జూనియర్ ఐశ్వర్య రాయ్ అనే పేరు వచ్చింది కానీ ఆ రేంజ్ లో అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేకుండా ఖాళీగా ఉన్న స్నేహ ఉల్లాల్ వాటికి గేలం వేయడం కోసం ఇలా మొదలుపెట్టింది. ఎక్కాల్సిన ట్రైన్ జీవిత కాలం లేట్ తరహాలో కెరీర్ మొదలుపెట్టిన 13 ఏళ్లకు ఫస్ట్ బికినీ వేస్తే వర్క్ అవుట్ అవుతుందంటారా.

Wednesday, 26 December 2018

సుడిగాలి సుధీర్ ని పెళ్లి చేసుకోవడంపై స్పందించిన రష్మీ

జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్.. ప్రదీప్ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని వస్తే ఎవరిని  చేసుకుంటారనే ప్రశ్న యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఎదురైంది. ఇందుకు ఆమె ఏం చెప్పిందంటే.. తన వర్క్ వేరు, వ్యక్తిగతం వేరని చెప్పింది. రెండూ వేరు వేరుగా వుంటాయి. ఇందులో వుండే వ్యక్తులు అందులోకి రారు. అందులో వుండే వ్యక్తులు ఇందులోకి రారని స్పష్టం చేసింది. అలాగే మీ పెళ్లి లవ్వా, అరేంజ్డ్ మ్యారేజా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు......

సహజీవనం అనే ఆప్షన్ వుందిగా అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. కాగా బుల్లితెర యాంకర్‌గా మంచి క్రేజ్ కొట్టేసిన రష్మీ.. సినిమాల్లో కనిపిస్తూ... కుర్రకారు హృదయాలను దోచేస్తోంది. తాజాగా ట్విట్టర్ లైవ్ ఛాట్‌లో ప్రదీప్‌తో పెళ్లి గురించి స్పందించింది. తనకు పెళ్లి గురించి అడిగే ప్రశ్నలు నచ్చవని రష్మీ చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందే తాను ఓ బిడ్డను దత్తత తీసుకుంటానని రష్మీ చెప్పుకొచ్చింది

Tuesday, 25 December 2018

అందరు ఎన్టీఆర్ నే టార్గెట్ చేశారు

బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో  కాఫీ విత్ కరణ్ జోహార్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో కి తాజాగా బాహుబలి టీమ్ రాజమౌళి, రానా, ప్రభాస్ గెస్ట్ లుగా వెళ్లారు. అందులో భాగంగా హోస్ట్ కారం జోహార్ రాజమౌళిని ఈ షోకి రానా, ప్రభాస్ ల తో కాకుండా వేరే ఎవరితో రావాలని ఉంది అని అడగ్గా తారక్, రవితేజ అని సమాధానం చెప్పాడు.

ప్రభాస్ ని వీరిలో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు? అని ఆప్షన్ ఇవ్వగా తారక్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ అని ఈ వరుస క్రమంలో చెప్పుకొచ్చారు. రానాని లాంగ్ డ్రైవ్ కి ఎవరితో వెళ్ళడానికి ఇష్టపడుతావ్ అని అడిగితె.... ఎన్టీఆర్ అని బదులు ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు. సరదాగా సాగిన ఈ షోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

Saturday, 15 December 2018

అక్కడ తెలుగుదేశం ఓటమి, ఇక్కడ 2019లో వైకాపా ఓటమికి దారితీయనుందా?

అక్కడ తెలుగుదేశం ఓటమి, ఇక్కడ 2019లో వైకాపా ఓటమికి దారితీయనుందా?

నిత్యం ఐవిఆరెఎస్ కాల్స్, పాలన బావుందా? మీ అభిప్రాయాలు కావాలని. లోకల్ గా ఎన్ని ఇబ్బందులు వున్నా, చంద్రబాబు నాయుడి గొంతుతో అడిగేసరికి, అయ్యో కష్టపడే ఆయన కదా అని, అంతా బావుందని 1 నొక్కేస్తున్నారు.

ఆయన ఏమో, దానిని ముందేసుకొని, ఇంటెలిజెన్స్, పార్టీ వర్గాల సమాచారం మరియు బయటి వ్యక్తుల సర్వేలు, పార్టీ వర్గాలతో సమీక్షలు చేస్తుంటారు.

ఎన్ని గెలుస్తామో చెబుతూ, మీరు పని చేయట్లేదు, అవసరం అయితే మారుస్తా అని చెబుతూ వుంటారు.

నిత్యం ఎమ్మెల్యేలను ఏదో ఒక కార్యక్రమం పెట్టి, స్థానికంగా తిరిగేలా చేస్తున్నారు.

కానీ ఎంతటి క్రీడాకారుడు అయినా, నిత్యం కొంత ప్రాక్టీస్ చేస్తుంటాడు.

అలా తెలంగాణాలో కాంగ్రెస్స్ తో వెళ్లి, కుళ్లబొడిపించుకొని వచ్చింది. ఇంకా ఇక్కడ ఆరు నెలలు వుంది. ఆ దెబ్బలకు కారణాలు, అక్కడి వ్యూహాలు అన్నీ ఒక అనుభవం అవుతుంది.

ముఖ్యంగా, ఇక్కడ ఎలా ఒళ్లు దగ్గర పెట్టుకొని జాగ్రత్త పడాలో, బాగా గుణపాఠం నేర్చుకొంది.

నిన్నటి నైరాశ్యంలో నుండి అంతర్మధనం మొదలయ్యి, లోతైన విశ్లేషణ దిశగా, లోతు పాతుల అంతర్ముఖ పయనం జరుగుతోంది. పార్టీలో ప్రతి వ్యక్తి ఏమి చెబుతున్నాడో వింటోంది. ఇవన్నీ క్రోడీకరించి ఆలోచనలు కొలిక్కి వచ్చి, తన వ్యూహాత్మక అడుగులు, దాని నుండి ఆశించవచ్చు.

తెలంగాణాలో ఏదో బాబుగారి పాలన మీద తీర్పు ఇచ్చినట్టు, బాబు గారు అక్కడ సిఎం అవుతానంటే, తెలంగాణా అంతటా తిరస్కరించినట్టు, వైకాపా సంబరపడుతోంది, ఊదరగొడుతోంది.

12 స్థానాల్లో 2 స్థానాల్లో దళితులను గెలిపించుకొని, అక్కడి నుండి కాంగ్రెస్ తో ప్రత్యేక హోదా మీద ప్రకటన చేయించడం మరిచిపోతోంది.

నిజమే, పవన్, జెడి, బిజెపి, జగన్, లెఫ్ట్ మరియు కేసీఆర్ అంతా అంటీ ముట్టనట్టు, విడివిడిగా, మూకుమ్మడి దాడితో, కులం & మతం తో పాటు, అవినీతి ధనంతో, పెద్ద ఎత్తున వస్తారనే విషయం, ప్రతి నాయకుడి నుండి కార్యకర్త వరకు చెప్పి, తెలుగుదేశం తగువిధంగా సిద్ధం చేస్తుంది.

ఎవడు చెప్పినా తనో పెద్ద తోపని, పెడచెవిన పెట్టే జగన్ సహజ గుణం, నంద్యాల & కాకినాడల ఓటమి తరువాత ఏమీ నేర్చుకొన్నట్టు, కనిపించడం లేదు.

అదే జరిగి వుంటే కోడికత్తిని ఒక జాతీయ స్థాయి సమస్యగా ఇంకా చిత్రీకరించడానికి నానా పాట్లు పడుతూ, తుఫాన్ లాంటి విషయాల మీద నిర్లక్ష్యం వహించేది కాదు.

నాలుగు రోజులు ముందు, కేంద్ర కరువు బృందం, రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు తో సమీక్ష చేస్తుంటే, కనీసం తన వైకాపా బృందంతో, ప్రతిపక్ష పార్టీగా వినతి పత్రం ఇవ్వాలని విషయం కూడా మరిచిపోయి, కరపత్రం ద్వారా కరువని కన్నీరు కార్చి, సీఎం ఎంతడిగాడో వార్త వేశారు.

ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.

అక్కడ తెలుగుదేశం ఇంకొన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచివుంటే మళ్లీ కేసీఆర్ కొనుగోళ్లతో మరింత కుమిలేది. దానితో పాటు ఒరిగేది ఏమీ లేకున్నా, ఇక్కడ కన్నూమిన్నూ గానకుండా వచ్చే ఎన్నికలకు వెళ్లేవారు.

ఇప్పుడు భూమి మీద నిలబడేలా ఆలోచనలు & ఉపాయాలు చేసి వెళుతుంది.

దానికి దేశంలో 4 దశాబ్దాలకు పైగా, అత్యంత అనుభవం వున్న నాయకుడు వున్నాడు.

..చాకిరేవు.(సౌజన్యం తో )

Popular Posts