Monday 10 December 2018

ప్రజాకూటమిలోకి మజ్లిస్! అసదుద్దీన్ స్పందన...

తెలంగాణలోఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ రాజకీయాల్లో అనూహ్యా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో భాగంగా ‘మా సొంతబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అన్న తెరాస ప్రకటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ… దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూస్తామనితెలిపారు.  శనివారం  భాజపా నేత లక్ష్మణ్‌మాట్లాడుతూ మజ్లిస్‌, కాంగ్రెసేతరపార్టీతో తాము కలుస్తామని పరోక్షంగా తెరాసకు సానుకూల సంకేతాలు పంపిన విషయంతెలిసిందే.

ప్రజాకూటమిలోకి రావాలన్న కాంగ్రెస్‌ ఆహ్వానంపై ఆలోచించి నిర్ణయంతీసుకుంటామన్నారు. తెలంగాణలో గెలుపై రాజకీయ పార్టీలు ఆధారాలు లేకుండా అంచనావేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో  ఎంఐఎం  కనీసం 7 స్థానాలు గెలవనున్నట్లు  వస్తున్న సర్వేలపై రాజకీయ పార్టీల చూపు ఎంఐఎం పై ఉండటంతో ఫలితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Blog Archive